బీటీ–3 పత్తి విత్తనాల పట్టివేత | Sakshi
Sakshi News home page

బీటీ–3 పత్తి విత్తనాల పట్టివేత

Published Sat, May 25 2024 1:00 PM

బీటీ–3 పత్తి విత్తనాల పట్టివేత

జడ్చర్ల: రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన నిషేధిత బీటీ– 3 పత్తి విత్తనాలను శుక్రవారం వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఏఓ వెంకటేష్‌, ఏఎస్పీ రాములు వెల్లడించారు. జడ్చర్ల మండలం గోప్లాపూర్‌లో సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి గుట్టుగా లూజ్‌ పత్తి విత్తనాలను గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి తెచ్చి రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వ్యవసాయాధికారులు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి స్థాని క పోలీసుల సహకారంతో గోప్లాపూర్‌లో నిందితుల పై ఇంటిపై ఏకకాలంలో దాడులు చేసి పత్తి విత్తనా ల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులను జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న విత్తనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించి పరీక్షిస్తామని చెప్పారు. 2.21 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని ఏఎస్పీ రాములు చెప్పారు. సమావేశంలో సీఐ ఆదిరెడ్డి, ఏఓ గోపినాథ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement