వరి వంగడాల కోసం బారులు.. | Sakshi
Sakshi News home page

వరి వంగడాల కోసం బారులు..

Published Sat, May 25 2024 12:30 PM

-

పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించిన విత్తన మేళాకు ఉమ్మడి జిల్లాలోని రైతులు పోటెత్తారు. పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్‌తోపాటు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు పలు రకాల విత్తనాలను అందుబాటులో ఉంచగా.. వరి వంగడాల కోసం బారులుతీరారు. అంతకు ముందు ఉమ్మడి జిల్లాలో వాతావరణం, నేల స్థితిగతుల మేరకు ఏ పంట ఎప్పుడు సాగుచేయాలన్న అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాల రకాలు, యంత్ర పరికరాల పనితీరును వివరించేందుకు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో ఇష్టాగోష్టి నిర్వహించి, సందేహాలను నివృత్తి చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement