పాత పైపులైన్కే.. మిషన్భగీరథ కనెక్షన్
చిన్నచింతకుంట: గ్రామాలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ పైపులైన్ తరుచూ లీకేజీలు అవుతున్నాయి. దీంతో మండలంలోని వివిధ గ్రామాలకు నీటి సరఫరా కలుషితమవుతుంది. కురుమూర్తి రాయ హెడ్ట్యాంక్ నుంచి అప్పంపల్లి వరకు సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన పాత పైపులైన్కే మిషన్ భగీరథ కనెక్షన్ కలపడంతో తరుచూ పైపులు పగిలి లీకేజీలు ఏర్పడుతున్నాయి. దీంతో మండలంలోని 13 గ్రామాలకు తాగునీటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. గ్రామాలకు నీరు ఎప్పుడు సరఫరా అవుతుందో కూడా ప్రజలకు తెలియడం లేదు. అధికారులు పైపులను సరిచేసి నీటిని వదిలిన అది కలుషితంగా సరఫరా అవుతుంది.
నిధులు దుర్వినియోగం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు తాగునీరు అందించే దిశలో రూ.కోట్లు ఖర్చు చేసింది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై నిధులను దుర్వనియోగ పరిచారు. పాత పైపులైన్లకే మిషన్భగీరథ కనెక్షన్లు ఇచ్చారు. అప్పట్లో మండలంలోని 13 గ్రామాలకు రామన్పాడు ప్రాజెక్ట్ నుంచి, మన్యంకొండ హెడ్ ట్యాంక్ నుంచి 9 గ్రామాలకు అప్పటి అధికారులు పైపులను అమర్చి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే రామన్పాడు ప్రాజెక్ట్ నుంచి కురుమూర్తి హెడ్ట్యాంక్ వరకు కొత్తగా పైపులు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ముచ్చింతల వరకు 40 సంవత్సరాల క్రితం షిరిడి సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన పాత పైపులైన్కు లింక్ కలిపారు. అందుకు కురుమూర్తి నుంచి ముచ్చింతల వరకు ఏదో ఒక చోట లీకేజీలు అవుతూనే ఉన్నాయి. దీంతో మండల కేంద్రం, అమ్మాపురం, తిర్మలాపూర్, మద్ధూర్, ఏదులాపూర్, దాసర్పల్లి, అప్పంపల్లి, ముచ్చింతల గ్రామాలకు నీరు సక్రమంగా అందకపోగా నాచు, బురద, వేర్లు వంటి కలుషితమైన నీరు సరఫరా అవుతుంది. పాత పైప్లైన్ తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని మండల సర్వసభ్య సమావేశాలల్లో సర్పంచులు, ఎంపీటీసీలు లేవనెత్తిన అధికారులలో స్పందన రాలేదు.
పలుమార్లు లీకేజీలు
గ్రామాలకు కలుషితనీరు సరఫరా