Sakshi News home page

చెరువులో కుళ్లిన మృతదేహం

Published Tue, Mar 26 2024 1:55 AM

-

ఇందల్వాయి: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో కుళ్లినస్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 40ఏళ్లు ఉంటుందని, ఒంటిపై నల్లరంగు ఫుల్‌ టీషర్ట్‌, గోధుమరంగు ప్యాంట్‌ ఉన్నాయని ఎస్సై మనోజ్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

మిర్చి కాంపౌండ్‌లో..

ఖలీల్‌ వాడి: నగరంలోని ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపారు. చాంద్‌ మిర్చిగిర్ని వద్ద సుమారు 60 ఏళ్ల మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండగా, స్థానికులు జీజీహెచ్‌కు తర లించారన్నారు. పరిస్థితి విషమించి సదరు మహిళ సోమవారం మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలి సంబంధీకులు ఎవరైనా ఉంటే ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

వివాహిత అదృశ్యం

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ కాలనీకి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కల్కినగర్‌ కాలనీకి చెందిన మంచిర్యాల స్వరూపారాణికి భర్తతో గొడవ కావడంతో సోమవారం ఉదయం విద్యానగర్‌ కాలనీలో ఉండే తల్లిగారింటికి వెళ్లింది. కొద్దిసేపటికే అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. భర్త బ్రహ్మచారి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement