Sakshi News home page

పంట పొలాల పరిశీలన

Published Fri, Mar 29 2024 1:55 AM

పంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ చారి  - Sakshi

మొగుళ్లపల్లి: సాగునీరందక మండలంలోని కాసులపహడ్‌ గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను గురువారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటపొలాలు ఎండిపోతే రైతులకు అపార నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటకాల్వల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు నష్టపరిహారం అందించాలన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. మండలకేంద్రానికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు తంగళ్లపల్లి రాజు ఇటీవల మరణించిగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు.

Advertisement

What’s your opinion

Advertisement