మొగుళ్లపల్లి: సాగునీరందక మండలంలోని కాసులపహడ్ గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను గురువారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటపొలాలు ఎండిపోతే రైతులకు అపార నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటకాల్వల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు నష్టపరిహారం అందించాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మండలకేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు తంగళ్లపల్లి రాజు ఇటీవల మరణించిగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు.
Breadcrumb
- HOME
Related news
Related News by category
-
వరుస సభలు.. ప్రచార హోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ రాజకీయ పార్టీల పోరుగల్లుగా మారింది. నామినేషన్ల ఘట్టం 25న ముగియనుండగా.. అప్పుడే పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతల ప్రచార సభలు హోరెత్తుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన అగ్రనేతలు.. అభ్యర్థుల గెలు పు కోసం సర్వశక్తులొడ్డేందుకు రోడ్షోలు, బహిరంగ సభల షెడ్యూల్లను ప్రకటించారు. ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా ఓవైపు అభ్యర్థులు నిత్యం నియోజకవర్గాల్లో అలుపెరగకుండా తిరుగుతుండగా.. మరోవైపు జోష్ పెంచేందుకు అగ్రనేతలతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల నుంచే మొదలైన ప్రచారం... ఈ నెల 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆ మరుసటి రోజు నుంచే అగ్రనేతల ప్రచార సభలు మొదలయ్యాయి. 19న మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి వరంగల్లో ఎన్నికల శంఖారావం పూరించారు. బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతల షెడ్యూల్ కూడా మానుకోటలో ఖరారయ్యింది. మే 1న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మానుకోటలో రోడ్షో నిర్వహించనున్నారని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ తరఫున కేంద్రమంత్రి అమిత్షా పాల్గొననున్నట్లు వెల్లడించారు. అలాగే వరంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఎం.సుధీర్కుమార్ తరఫున ప్రచారం నిర్వహించేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు (మంగళవారం) వరంగల్లో పర్యటించనున్నారు. ఆ మరుసటి రోజు, ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తరఫున ప్రచారం చేసేందుకు వరంగల్కు రానున్నారు. 28న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అమిత్షాలు బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ గెలుపు కోసం రోడ్షో, సభలు నిర్వహించనున్నట్లు పార్టీవర్గాలు ప్రకటించాయి. కాగా 25న నామినేషన్ల పర్వం ముగియనుండగా 29న ఉపసంహరణ అనంతరం గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత సుమారు 14 రోజులు ప్రచారం నిర్వహించే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు, బీజేపీ తరఫున పీఎం నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్షా, అశ్విన్ వైష్ణవ్, సీఎం ఆదిత్యనాథ్ యోగి తదితరులు, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు, తదితరులు ప్రచారాన్ని హోరెత్తించనున్నారని ఆయా పార్టీలు ప్రకటించాయి. నేడు వరంగల్కు కేటీఆర్.. షెడ్యూల్ ఇదీ.. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ తరఫున ప్రచారం నిర్వహించేందుకు మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మంగళవారం వరంగల్లో పర్యటించనున్నారు. అలంపూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4.30 గంటలకు సుబేదారి పరిధిలోని ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల మైదానానికి చేరుకోనున్న కేటీఆర్.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో హంటర్రోడ్డులోని డి–కన్వెన్షన్కు వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉర్సుగుట్టలోని నాని గార్డెన్స్లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో పాల్గొని.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు వెళ్తారు. అగ్రనేతల ఆగమనం.. ఊపందుకున్న ప్రచారం ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేతలు.. నేడు వరంగల్లో కేటీఆర్ సభ.. రేపు సీఎం రేవంత్ రెడ్డి రాక మరోవైపు బీజేపీ కేంద్రమంత్రులు.. పోటాపోటీగా అగ్రనేతల సభలునామినేషన్ల సందడి దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు మహబూబాబాద్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ దాఖలు.. తొలిసెట్ సమర్పించిన సుధీర్ కుమార్, కడియం కావ్య – వివరాలు 8లోu -
నీడ మాటున.. నిధులు మాయం
భూపాలపల్లి అర్బన్: గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కలకు నీడ కల్పించేందుకు వెచ్చిస్తున్న ప్రజాధనం షేడ్నెట్ల పాలవుతోంది. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతూ పనికిరాకుండా పోతున్నాయి. తరచూ కొత్త వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ పంచాయతీలో ప్రభుత్వ నర్సరీలు ఏర్పాటుచేసి సుమారుగా 26లక్షల మొక్కులను పెంచుతున్నారు. ఈ ఏడాది అన్ని నర్సరీల్లో 10వేల నుంచి 20వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. వేసవిలోనూ మొక్కల పెంపకం చేపడుతుండటంతో నీడ అవసరం ఉంటుంది. ఇందుకు షేడ్నెట్ (నీడకోసం పరదా)లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి పంచాయతీ నిధులను కేటాయిస్తున్నారు. ప్రతి నర్సరీకి రెండు నుంచి నాలుగు వరకు షేడ్నెట్ల అవసరం ఉంటుంది. ఒక్కో నెట్కు రూ.3వేల వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన రెండు షేడ్ నెట్లకు రూ.6వేలు, నాలుగు నెట్లకు రూ.12వేలు ఖర్చువుతుంది. ఏటా రూ.15 లక్షల నుంచి 20లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. చిరిగిపోతూ.. కొనుగోలు చేస్తున్న షేడ్నెట్లు చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతున్నాయి. ఒక్కసారి చిరిగితే పనికిరాకుండా పోతున్నాయి. గతేడాది కొనుగోలు చేసినవి అప్పుడే పాడైపోయాయి. మొక్కల రక్షణకు మళ్లీ వీటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. ఏటా నిధులు వెచ్చించే బదులు శాశ్వత ప్రాతిపదికన ఒకేసారి నాణ్యమైన నెట్లను గానీ ప్రత్యామ్నాయ పరికరాలను గానీ కొనుగోలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ నర్సరీల నిర్వాహకులు నీడకోసం ఏర్పాటు చేసుకునే విధంగా పంచాయతీల్లో నాణ్యమైనవి ఏర్పాటు చేసుకుంటే ఏటా కొనుగోలు చేసే అవసరం లేకుండా ఖర్చునూ తగ్గించుకోవచ్చంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్ర జాప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు. రూ.6వేలతో ఏర్పాటు.. మండలంలోని గొర్లవీడు నర్సరీలో ఏటా 10వేల మొక్కలు పెంచుతున్నారు. ఎండ వేడిమికి మొలకలు, మొక్కలు ఎండిపోతుండటంతో ఇటీవల పంచాయతీ నిధులు రూ.6వేలతో షెడ్నెట్ ఏర్పాటు చేశారు. ఏటా షేడ్నెట్ ఏర్పాటు చేయడంతో రూ.6వేల వరకు ఖర్చవుతోంది. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుండటంతో చిన్నపాటి ఈదురుగాలులు వీచినా చిరిగిపోతూ అవి పనికి రాకుండా పోతున్నాయి.షేడ్నెట్లకు జిల్లాలో ఏటా రూ.15లక్షలకు పైగా ఖర్చు నిధులు మంజూరుచేయని డీఆర్డీఏ గ్రామ పంచాయతీ నిధుల నుంచే కొనుగోలుపంచాయతీలపై అదనపు భారం.. హరితహారం కార్యక్రమం ప్రారంభం నుంచి 2021 సంవత్సరం వరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మొక్కల విత్తనాలు నాటే కార్యక్రమం ప్రారంభం నుంచి మొక్కలు నాటే వరకు ఉపాధి హమీ పథకంలో చేపట్టేవారు. మూడేళ్ల నుంచి కొంత పరిమితికి మాత్రమే విత్తనాలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. నాటుతున్న విత్తనాలు మొలుకెత్తి సంరక్షించే బాధ్యతలను మరిచారు. వేసవితాపంలో మొక్కలకు రక్షణ కల్పించేందుకు షెడ్నెట్లకు రావాల్సిన నెట్లను పంపిణీ చేయడం లేదు. దీంతో గ్రామ పంచాయతీల కార్యదర్శులు పంచాయతీ నిధులను వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రతి ఏడాది రూ.10వేల వరకు అదనపు ఖర్చు వస్తుంది. -
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతు
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024కాళోజీ సెంటర్: ‘35 ఏళ్ల తర్వాత వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మహిళకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించాలి’ అని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్యకు తన నామినేషన్ సెట్ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం కావ్య మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా మహిళా ఓటర్లున్నారని, గతంలో మహిళల సమస్యల పరిష్కారానికి పని చేశానన్నారు. విద్య, ఆరోగ్యం కోసం అధిక ప్రాధాన్యమిస్తాన్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న సమస్యలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ అప్ గ్రేడ్ లెదర్ పార్క్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎడ్యుకేషన్, ఐటీ హబ్గా అండర్ డ్రెయినేజీ వ్యవస్థను తీర్చిదిద్దడానికి పని చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ.. రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు వారి మాటలు నమ్మకుండా తన గెలుపు కోసం అందరు సహకరించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కావ్య కోరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య మాట్లాడుతూ.. కులాల పేరుతో మతాల పేరుతో నిరుద్యోగులు, రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ అన్నారు. 120 రోజుల తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిందలు మోపుతూ 10 ఏళ్ల పాలనలో అన్ని రకాలుగా ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. అన్ని రకాల ప్రజలకు మేలు జరగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సీనియర్ నాయకుడు ఈవీ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ/కాళోజీ సెంటర్: బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ 50 వేల మెజార్టీతో విజయం సాధిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా హనుమకొండ బాల సముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఏకశిల పార్కు వరకు భారీ ర్యాలీ తీశారు. ఈర్యాలీని ఉద్దేశించి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. తాను సర్వే చేయించానని, రంగంలోకి దిగకముందే 50 వేల మెజార్టీతో గెలస్తున్నామని, ప్రచారం చేపడితే మెజార్టీ మరింత పెరుగుతుందన్నారు. పార్టీ పరంగా లాభం పొంది బయటకు వెళ్లిన నాయకులను తిరిగి చేర్చుకునేది లేదని, ఈవిషయంపై పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వద్ద మాట తీసుకున్నానన్నారు. తనను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, వారికి ఎలాంటి ఆధారాలు దొరకడం లేదన్నారు. కడియం శ్రీహరికి తానే రాజకీయ జీవితమిచ్చానన్నారు. రేవంత్రెడ్డి బ్రోకర్ అయితే కడియం శ్రీహరి మోసకారి అని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ను బ్లాక్ మెయిల్ చేసి బిడ్డకు టికెట్ ఇప్పించి వంచించిన మోసగాడు కడియం శ్రీహరి అని ధ్వజమెత్తారు. శ్రీహరిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ మాట్లాడుతూ.. తాను స్థానికున్నే అని, కడియం కావ్య గుంటూరుకు చెందిన వ్యక్తి అని అన్నారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు, వినయ్భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి మిగతా వర్గాలను విస్మరించిందని పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ గల్లంతవుతుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మానుకోట పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్ధి అజ్మీరా సీతారాం నాయక్ను గెలిపించాలని కోరారు. సీతారాం నాయక్ నామినేషన్ సమర్పించిన నేపథ్యంలో సోమవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా ప్రత్యేక హెలికాప్టర్లో మానుకోట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపానికి చేరుకున్నారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో సభ నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 70 ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను మోదీ సర్కార్ పరిష్కరించిందన్నారు. మోదీ అంటే గ్యారంటీ అని, ప్రజలు ఆలోచన చేస్తున్నారని, దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందన్నారు. ఆదివాసీ, గిరిజన మహిళలను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని, ఉద్యోగం, రాజకీయం ఇతర రంగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. సీతారాంను ఎంపీగా గెలిపిస్తే మానుకోటలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో జిల్లా యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. దేశాభివృద్ధి కోసం మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్, మాజీ రాజ్యసభ, బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, క్రమశిక్షణ సంఘం చైర్మన్ ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న డాక్టర్ కడియం కావ్య, చిత్రంలో సాంబయ్య, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న ఎర్రబెల్లి, చిత్రంలో ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్, వినయ్భాస్కర్, రాజయ్య న్యూస్రీల్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ను గెలిపించాలి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు -
విద్యార్థులు లక్ష్యం ఎంచుకోవాలి
మొగుళ్లపల్లి: విద్యార్థులు వేసవి సెలవులను మంచి అవకాశంగా భావించి లక్ష్యం నిర్ణయించుకుని ముందుకు సాగాలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ భద్రయ్య అన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయపాల్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాలుగోరోజు.. 14మంది నామినేషన్ సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నాలుగో రోజు సోమవారం 14మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖల చేశారు. పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కు వారు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్, స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య, ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్, జుమ్మిడి గోపాల్, అంబాల మహేందర్, జనగామ నరేశ్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, దాగం సుధారాణి, జాడి ప్రేమ్సాగర్, అక్కపాక తిరుపతి ఒక్కోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గద్దల వినయ్కుమార్, బొట్ల చంద్రయ్య రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 25మంది అభ్యర్థులు మొత్తంగా 31 సెట్ల నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జాబ్మేళాకు విశేష స్పందన భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని సంఘమిత్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన వచ్చినట్లు కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్ తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్, ప్రిన్సిపాల్ ఎలుగూరి హరికృష్ణ అధ్యక్షతన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో జెన్ ప్యాక్ట్ కంపెనీ, హెచ్ఆర్ శ్యామ్ సన్ మెగా జాబ్ మేళాలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాబ్మేళాకు 153మంది అభ్యర్థులు హాజరు కాగా జెన్ ఫ్యాక్ట్ కంపెనీ హెచ్ఆర్ 46మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా వచ్చిన ఉద్యోగాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు మొగిలి, రాజశేఖర్, నరేష్, ప్రవీణ్, ఆనంద్, ఉదయలక్ష్మి, మమత, రాజు, రంజిత్ పాల్గొన్నారు. పనుల పరిశీలన రేగొండ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకోసం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పకడ్బందీగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడేపాక ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులను చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మృతుడి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ చిట్యాల: మండలకేంద్రానికి చెందిన చింతల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మృతుడి కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల నాయకులు చింతల రమేష్, పువ్వాటి హరికృష్ణ, గురుకుంట్ల కిరణ్, కొడెల రాయమల్లు, ఉప్పుల కిరణ్, కొత్త శ్రీనివాస్, తణుకు మధు ఉన్నారు. -
సమస్యలకు సత్వర పరిష్కారం
భూపాలపల్లి: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ భవేష్మిశ్రా అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 36 దరకాస్తులను కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలిపిన అక్షయ తల్లితండ్రులు.. చిన్నారి అక్షయకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని కలెక్టర్ భవేష్మిశ్రా హామీ ఇచ్చినందుకు చి న్నారి తల్లితండ్రులు సోమవారం కలెక్టర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.కలెక్టర్ భవేష్మిశ్రా
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement