Sakshi News home page

చలివేంద్రం ప్రారంభం

Published Fri, Mar 29 2024 1:00 AM

- - Sakshi

కోరుట్ల: అయిలాపూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మండల పంచాయతీ అధికారి నీరజ గురువారం ప్రారంభించారు. పంచాయతీరాజ్‌ సీఎస్‌ ఆదేశాలతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్‌, అంగన్‌వాడీ టీచర్లు రాజమణి, కాళేశ్వరి, మంజుల, విమల, సుమతి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

కార్యవర్గం ఎన్నిక

రాయికల్‌: ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడిగా కూరగాయల రవి, ప్రధాన కార్యదర్శిగా గరిపెల్లి శ్రీనివాస్‌, కోశాధికారిగా పల్లెర్ల పవన్‌, ఉపాధ్యక్షులుగా అయిత శేఖర్‌, సిర్ప సంతోష్‌, బొల్సాని ఆంజనేయులు, అయిత నవీన్‌, జాయింట్‌ సెక్రటరీలుగా సిద్దంశెట్టి మహేశ్‌, కూరగాయల అశోక్‌, జక్క రంజిత్‌, కట్కం కల్యాణ్‌, పీఆర్వోలుగా నాగమల్ల శ్రీకర్‌, నరంశెట్టి మనోజ్‌ ఎన్నికయ్యారు.

Advertisement

What’s your opinion

Advertisement