మద్యం మత్తులో ట్రాఫిక్ ఎస్సైపై దాడి
కరప: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్సైపై ఓ వ్యక్తి మద్యం మత్తులో దాడిచేసి గాయపరిచాడు. ఈ సంఘటన కరప మండలం ఉప్పలంక వద్ద జరిగింది. గాయపడిన ట్రాఫిక్ ఎస్సై కిషోర్కుమార్ను చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉప్పలంక వద్ద ఎస్సై కిషోర్కుమార్ గురువారం ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పగడాలపేట వాసి, ఉప్పలంక గ్రామానికి చెందిన కర్రి కేశవ్ బంధువులలో ఒకరు పెద్దకార్యానికి వెళ్లి అతని బావ పాలెపు రాజుతో వస్తున్నాడు. మద్యం తాగి ఉన్న వారిని ఎస్సై వారిని ఆపి మాట్లాడుతుండగా కేశవ్ ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న గాజుపెంకుతో ఎస్సైపై దాడి చేసి గాయపరిచాడు. ఈ సమాచారం తెలుసుకున్న కరప ఎస్సై రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గాయపడిన ట్రాఫిక్ ఎస్సైను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.