ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతి కెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 35 వేలు మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల నోము ఆచరించిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అలాగే పరిసర గ్రామాల నుంచి కాలినడకన భక్తులు స్వామి సన్నిధికి చేరుకున్నారు. వేంకటేశ్వరస్వామి ప్రత్యేక పుష్పాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాద విరాళాలు, సేవలు, లడ్డూ విక్రయం, విరాళాల ద్వారా రూ.29,05,432 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్రాజు, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఆలయం వద్ద ట్రాఫిక్ పెరగడంతో ఎస్సై కిరణ్కుమార్ పోలీసు బందోబస్తు నిర్వహించారు.
ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామి దర్శనం
దేవస్థానానికి
రూ.29.05 లక్షల ఆదాయం