విద్యుత్‌ షాక్‌తో దింపు కార్మికుడి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో దింపు కార్మికుడి మృతి

Published Mon, Nov 13 2023 11:38 PM

వీరరాఘవులు (ఫైల్‌)  - Sakshi

అంబాజీపేట: కొబ్బరి చెట్టు ఎక్కే సమయంలో విద్యుత్‌ షాక్‌నకు దింపు కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. చిరతపూడి శివా రు లంకవారిపేటకు చెందిన కొబ్బరి దింపు కార్మికుడు దువ్వ వీరరా ఘవులు (35) ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న ఓ కొబ్బరితోటలో దింపు తీసేందుకు కొబ్బ రి చెట్టు ఎక్కుతున్న సమయంలో పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్లు తగిలి షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరరాఘవులు విద్యుత్‌షాక్‌నకు గురైనట్లు అంబాజీపేట పోలీసులకు సమాచారం అందించారు.

ఉపాధి కూలీ మృతి

రావులపాలెం: మండలంలోని ఈతకోట గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. ఏపీఓ కవిత తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గండ్రోతు చక్రధర్‌రావు (69) ఉదయం ఉపాధి హామీ పనికి వచ్చాడు. పని అనంతరం నీరసంగా ఉందంటూ పక్కన కూర్చుని కుప్పకూలిపోయాడు. దీంతో గుండోపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని కవిత తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement