Sakshi News home page

గడ్డివామి దగ్ధం

Published Sun, Nov 12 2023 1:30 AM

-

రామసముద్రం : మండలంలోని ఆర్‌.నడింపల్లె పంచాయతీ మిట్టపల్లె గ్రామంలో గడ్డివామి దగ్ధమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో టపాకాయలు పేల్చుతుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న మునస్వామి గడ్డివాముకు నిప్పంటుకుంది. గమనించిన స్థానికులు వెంటనే పుంగనూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రాతికూసాలు, గడ్డి కాలిపోవడంతో రూ.20 వేల నష్టం వాటిల్లినట్లు ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ సుబ్బరాజు తెలిపారు. మంటలు ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బంది సురేష్‌ , సుమన్‌, లోకేష్‌రెడ్డి, కేశవ, మోహన్‌ పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement