-
ఇంద్రకరణ్రెడ్డికి బుద్ధి చెప్పాలి
● ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు ● జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ బూత్స్థాయి కార్యకర్తల సమావేశం నిర్మల్టౌన్: అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడు నెలలు కూడా ఆగకుండా అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి బుద్ధి చెప్పాలని ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు అన్నారు. ఐకేరెడ్డి ఓసారి ఏనుగు, సైకిల్, చైతి, కారు, మళ్లీ చేతి.. అంటూ .. సొంత లాభాల కోసం పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్లో బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ బూత్లెవెల్ కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని మామడ, లక్ష్మణచాంద, దిలావర్పూర్, నర్సాపూర్, సారంగపూర్, నిర్మల్ రూరల్, పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. జోగు రామన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, ప్రజలకు అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. ఇంద్రకరణ్ రెడ్డి దాదాగిరి, దౌర్జన్యాలకు పాల్పడే నాయకుడన్నారు. బీజేపీ సభ్యత్వం లేని తమ పార్టీ నుంచి వచ్చిన గోడెం నాగేష్కు ఆ పార్టీ టికెట్ ఇచ్చి, వారి సిద్ధాంతాలను పక్కకు పెట్టారన్నారు. నగేష్ మంత్రిగా, ఎంపీగా జిల్లాకు ఏం చేశాడని ప్రశ్నించాడు. నగేష్కు బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు మాట్లాడుతూ బీఆర్ఎస్ను వీడినవారు వాగులోని తుక్కు, తుంటలు, మొద్దులు అని ఎద్దేవ చేశారు. ఇప్పుడున్న నాయకులు, కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న వారని వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. పోలింగ్కు కొద్ది రో జుల సమయం ఉందని, కార్యకర్తలు ఓటర్లను కలి సి బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరించి, ఓట్లను అడగాలని సూచించారు. నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మరుగొండ రాము, నాయకులు డాక్టర్ సుభాష్రావు, నజీరుద్దీన్, జగడం రాజు, నెల్ల అనిల్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
పారదర్శకంగా ఈవీఎంల నిర్మల్చైన్గేట్: ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలి పా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజ కీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల ర్యాండమైజేషన్పై సోమవారం స మావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మొదటి, రెండో ర్యాండమైజేషన్, ఈ వీఎంల కమిషనింగ్ అనంతరం రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఎండలు అధికంగా ఉన్నందున ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, బెంచీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నేడు 5కె రన్.. జిల్లాలో పోలింగ్ శాతం పెంచేలా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఉదయం 6 గంటలకు 5కె రన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో అన్నివర్గాల ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. గోదాంలోని ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎంల సెగ్రిగేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, నిర్మల్, ముధోల్, ఉట్నూర్ ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, జివాకర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్రెడ్డి, రవి, సిరికొండ రమేశ్, గండ్రత్ రమేశ్, మజార్, హైదర్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. ● జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ -
ఆత్రం సుగుణ గెలుపు ఖాయం
నిర్మల్చైన్గేట్: ఆదిలాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. సారంగాపూర్ మండలం జెండానగర్కు చెందిన ప లువురు శ్రీహరిరావు సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పా ర్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో అధికారంలోకి రావడానికి సమష్టిగా కృషిచేద్దామన్నారు. ఎన్నికలకు మరో ఏడు రోజుల గడువు ఉందని ప్రతీ కార్యకర్త ఆత్రం సుగుణ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మతతత్వ విధానాలు వివరించాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజి నర్సయ్య , మాజీ ఏఎంసీ చైర్మన్ రాజ్మహమ్మద్, శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, విలాస్రావ్, సలీం, భూమన్న పోతన్న గంగాధర్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పొల్గొన్నారు. -
మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి
సారంగపూర్: ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని జామ్, చించోలి(బి)గ్రామాల్లో సోమవారం ఉపాధిహామీ కూ లీలను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. పదేళ్ల ప్రస్థానంలో నరేంద్రమోదీ ఎలాంటి అవినీతికి తావులేకుండా పాలన సాగించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు అఽధికారంలో ఉన్న బీఆర్ఎస్గానీ, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్గానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. ఉపాధిహామీ పథకం నిర్వరా మంగా అమలు చేస్తూ కూలీలకు బాసటగా నిలిచిన ఏకైక ప్రభుత్వం బీజేపీ అని పేర్కొన్నా రు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే యువకులు, రైతులు, మహిళలు, కూలీలు, ఇలా అన్నివర్గాల వారికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గోడం నగేశ్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో నాయకులు సత్యనారాయణగౌడ్, విలాస్, చంద్రప్రకాశ్గౌడ్, మంతెన గంగారెడ్డి, రాంశంకర్రెడ్డి, చెన్న రాజేశ్వర్, శ్రావణ్కుమార్, సాహెబ్రావు, పోతన్న, తిరుమలాచారి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
నిర్మల్టౌన్: ఖానాపూర్కు చెందిన న్యాయవాదిపై ఇద్దరు దుండగులు శుక్రవారం హత్యా ప్రయత్నం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ.. నిర్మల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్, ఉపాధ్యక్షురాలు కవితారెడ్డి, లైబ్రరీ సెక్రటరీ అర్చన, న్యాయవాదులు శ్యాంసుందర్రెడ్డి, నూనె గంగాధర్, రమణారావు, నరేందర్, మధుకర్, రాజు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదికి పరామర్శ ఖానాపూర్: పట్టణంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన సీనియర్ న్యాయవాది వెంకట్మహేంద్రపై శుక్రవారం దాడి జరిగింది. బాధిత న్యాయవాదిని మంచిర్యాలబార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పరామర్శించారు. పట్టణంలోని వెంకటమహేంద్ర నివాసానికి వచ్చి దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిపై దాడిని ఖండించారు. దాడులను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. పరామర్శించిన వారిలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ సంతోష్గౌడ్, ఖానాపూర్ బార్ అసోసియేషన్ చైర్మన్ మంత్రరాజం సురేష్, మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు పీసర శ్రీకాంత్, ప్రదీప్చంద్ర తదితరులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement