-
No Headline
పెద్దవంగర: ప్రజలకు సేవ చేసేందుకే వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్య పోటీ చేస్తున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్లు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటి వెళ్లి కడియం కావ్వ గెలుపు కోరుతూ ప్రచారం చేశారు. ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కూలీలను కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి ప్రతిపక్షాలను తరిమికొట్టాలని కోరారు. బీఆర్ఎస్ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని, ఆ పార్టీ నాయకుల మాయమాటలు విని ఓటు వేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే అని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్కు అండగా ఉంటే రాహుల్గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగ పార్టీలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఆదరించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్యను ఆదరించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడుసురేష్, తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీపీ కల్పన, ఎంపీటీసీలు సౌజన్య, బానోతు రవీందర్, నాయకులు రవీందర్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, హరికృష్ణ, కృష్ణ, శ్రీనివాస్, యాకయ్య, సైదులు, మహేష్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
గంగారం: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని పెద్ద ఎల్లాపురంతోపాటు పలు గ్రామాల్లో కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన బలరాంనాయక్.. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. అనంతరం గంగారంలో యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్, ఏఐసీసీ ఆర్గనైజింగ్ సెట్రకరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ కొత్తగూడ, గంగారం మండలాల అధ్యక్షులు వజ్జ సారయ్య, వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరబోయిన మొగిళి, జెడ్పీటీసీలు ఈసం రమ, విజయ రూప్సింగ్, ఎంపీపీలు సువర్ణపాక సరోజన జగ్గారావు, పుష్పలత, మాజీ సర్పంచ్లు చుంచ వెంకటలక్ష్మి, మద్దెల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేసముద్రం మార్కెట్లో రైతుల ఆందోళన
కేసముద్రం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను మార్కెట్కు తీసుకురాగా.. వ్యాపారులు టెండర్లు వేయకపోవడం, తక్కువ ధర పెట్టడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగిన ఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు ధాన్యాన్ని, మక్కలను అమ్మేందుకు మార్కెట్కు తీసుకొచ్చారు. ఈ మేరకు కొన్ని కూట్లకు టెండర్లు వేసి, మరికొన్ని కూట్లకు టెండర్ల వేయకుండా వదిలేశారు. అదేవిధంగా మరికొన్ని ధాన్యం కూట్లకు ఒకే వ్యాపారి తక్కువ ధర (రూ.1,901) పెట్టడంతో రైతులు ఆగ్రహించారు. తమ రాశులకు టెండర్లు ఎందుకు వేయలేదని, పైగా ఒకే వ్యాపారి తక్కువ ధరకు టెండర్ ఎలా వేస్తాడంటూ మార్కెట్ కార్యాలయానికి చేరుకుని, అధికారులను ప్రశ్నించారు. దీంతో మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్రావు, వ్యాపారులను, రైతు సంఘం నాయకుల పిలిపించి రైతుల సమక్షంలో మాట్లాడారు. ఈ మేరకు మంగళవారం తక్కువ ధర పెట్టిన కూట్లకు, టెండర్లు వేయని రాశులకు రీటెండర్ వేయిస్తామని రైతులకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, రైతుసంఘం నాయకులు సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డి, వ్యాపారులు, అధికారులు పాల్గొన్నారు. తక్కువ ధర పెట్టారంటూ ఆగ్రహం -
పీఎం సెక్యూరిటీ ట్రయల్రన్
ఖిలా వరంగల్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు(బుధవారం) లక్ష్మీపురం మైదానంలో నిర్వహించే సభకు ప్రధాని మోదీ రానున్నా రు. దీంతోప్రధానమంత్రి భద్రతాధికారులు(సెక్యూరిటీ) సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి మామునూరు విమానాశ్రయానికి వచ్చారు. హెలిపాడ్ నుంచే అధికారులు విమానాశ్రయం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీజీ అధికారులు,ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ తిరుపతి పాల్గొన్నారు. నేడు వరంగల్ నగరంలో సీఎం రోడ్షో హన్మకొండ చౌరస్తా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం వరంగల్ నగరంలో రోడ్షో, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు వరంగల్ తూర్పులోని పోచమ్మమైదాన్ జంక్షన్లో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. 6గంటలకు వేయిస్తంభాల గుడి నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్షో నిర్వహిస్తారని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. అనంతరం హనుమకొండ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారని తెలిపారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఓటర్ల సౌలభ్యం కోసం ‘చాట్ బాట్’ యాప్
హన్మకొండ అర్బన్ : ఎన్నికలకు సంబంధించిన పలు వివరాలు తెలుసుకునేందుకు ఓటర్ల సౌలభ్యం కోసం వాట్సాప్కు సంబంధించిన ‘చాట్ బాట్’ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. దీనిని ఉపయోగించేందుకు క్యూఆర్ కోడ్ లేదా 97045 60805 నంబర్ను సంప్రదించాలన్నారు. తద్వారా ఓటర్ హెల్ప్లైన్తో పాటు ఎన్నికలకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ యాప్లో మొదట హాయ్ అని సందేశం పంపించాలని, అలా సందేశం పంపిన వెంటనే వాట్సాప్లో ఓటర్ హెల్ప్లైన్, పీడబ్ల్యూడీ హెల్ప్లైన్, పోలింగ్ బూత్ వివరాలు అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయన్నారు. పీడబ్ల్యూడీ హెల్ప్లైన్లో గూగుల్ లింక్ను ఉపయోగించి వీడియో కాల్ చేయడం ద్వారా ఎలక్షన్ కంట్రోల్ రూమ్లోని అధికారులతో నేరుగా రోజు (ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) మాట్లాడే అవకాశం ఉంటుందని, బధిరుల కోసం కంట్రోల్ రూమ్లో సైన్ లాంగ్వేజ్ ద్వారా కూడా సమాచారం తెలిపేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన సందేశాలు, ఆకర్షణీయమైన ఫొటోలు voter-spointh-nk.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం వరంగల్ ఎన్ఐటీ విద్యార్థులు, అధ్యాపక బృందం రూపొందించిన ఈ యాప్ను ఓటర్లు సద్వినియోంచుకోవాలని కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement