-
పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి
ఆసిఫాబాద్: సింబల్ లోడింగ్ యూనిట్ల స్టోరేజ్ గది వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సింబల్ లోడింగ్ యూని ట్ల స్టోరేజ్ గదిని సోమవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణుతో కలిసి రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కమి షనింగ్కు ఉపయోగించిన సింబల్ లోడింగ్ యూని ట్లను భద్రపరచి, గదికి సీలు వేశామని తెలిపారు. సిబ్బంది సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎన్నికల సూపరింటెండెంట్ మధుకర్, నాయబ్ తహసీల్దార్లు జితేందర్ పాల్గొన్నారు. అభివృద్ధి పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేయాలిజిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఈవో అశోక్తో కలిసి విద్యాశాఖ అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులు, పంచాయతీ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన పాఠశాలలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. విద్యుదీకరణ, తాగునీరు, మూత్రశాలలు, ర్యాంపుల పనులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యుత్ నియంత్రిక బోర్డులు అమర్చాలని, పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
ఓటేసిన అధికారులు
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వివి ధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పో స్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,420 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకో గా.. ఆదివారం వరకు 1160 మంది ఓటు హక్కు వి నియోగించుకున్నారు. ఇక సోమవారం 561 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని రిటర్నింగ్ అ ధికారి దాసరి వేణు వెల్లడించారు. జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సంపత్కుమార్, తహసీల్దా ర్ శ్రీనివాస్తోపాటు పలువురు అధికారులు జిల్లా కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తా
ఆసిఫాబాద్రూరల్/రెబ్బెన/తిర్యాణి/వాంకిడి: జి ల్లాలోని ప్రాంతాలపై భౌగోలికంగా తనకు పట్టుందని, గెలిచిన తర్వాత గ్రామాల్లో సమస్యలన్నీ పరి ష్కరిస్తామని బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ, రెబ్బెన మండలం గోలేటి పరిధిలోని గౌతమ్నగర్, తిర్యాణి మండల కేంద్రంతోపాటు వాంకిడిలోని మార్కెట్ ఏరియాలో జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్తో కలిసి సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశ భవిష్యత్తు కోసం మోదీని ప్రధాని చేయాలని కోరారు. ఆయన వెంట జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్, పార్టీ పార్లమెంట్ కన్వీనర్ కిరణ్కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు గుల్బం చక్రపాణి, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, నాయకులు వెంకటేశ్, రమేశ్గౌడ్, సుభాశ్, భాస్కర్, గోపాల్, తొంగల తిరుపతి, గాయంగి తిరుపతి, విశాల్, సుహాసిని, లక్ష్మి, సుచిత్ ఉన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ -
విద్యార్థులకు శాపం
అధికారుల తప్పిదం.. ● జిల్లాలో మొదటిసారి నీట్ నిర్వహణ ● ఒక సెట్కు బదులు మరో సెట్తో పరీక్ష ● ఫలితాలపై విద్యార్థుల ఆందోళన ● న్యాయం చేయాలని కలెక్టర్కు వేడుకోలు ● విచారణ చేపట్టిన ఆసిఫాబాద్ ఆర్డీవోఆసిఫాబాద్రూరల్: వైద్యవృత్తిలో చేరి పేదలకు సేవ చేయాలని నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్(నీట్– 2024)కు హాజరైన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. అధికారుల తప్పిదం వారికి శాపంగా మారింది. దేశవ్యాప్తంగా ఒక సెట్ ప్రశ్నపత్రంతో నీట్ నిర్వహిస్తే.. జిల్లాలో మాత్రం విద్యార్థులకు మరో సెట్ ప్రశ్నపత్రం అందించి పరీక్ష రాయించారు. రోజుల తరబడి చదివి హాజరైన పరీక్ష ఫలితాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో సెంటర్..దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఏటా ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన మా ర్కులు, ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్లో ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నీట్ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఈ ఏజెన్సీ ప్రశ్నపత్రం రూపొందించి పరీక్ష నిర్వహిస్తుంది. నీట్ నిర్వహణ కోసం జిల్లాలో మొదటిసారిగా ఆసిఫాబాద్ పరీక్ష కేంద్రం కేటాయించారు. ఆసిఫాబాద్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన పరీక్షకు మొత్తం 323 మంది విద్యార్థులకు 299 మంది హాజరయ్యారు. 24 మంది గైర్హాజరయ్యారు. తప్పిదంపై ఆర్డీవోతో విచారణప్రశ్నపత్రం తారుమారు కావడంపై కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశాలతో ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్రావు విచారణ చేపట్టారు. ఎగ్జామ్ సెంటర్కు వెళ్లి సిటి కోఆర్డినేటర్ నరేందర్ను విచారించగా.. ప్రశ్నపత్రం తారుమారైందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిశారు. న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. జరిగిన తప్పిదం గురించి నీట్ అధికారిక వెబ్సైట్లో ఉంచాలని, అప్పుడే కొంత ఊరటగా ఉంటుందని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ.. వెబ్సైట్లో అలా పెట్టేందుకు వీలు కాదని, విద్యార్థులు ఆందోళన చెందాల్సి అవసరం లేదన్నారు. విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తానని పేర్కొన్నారు. అధికారికంగా రెండు సెట్ల పేపర్లకు కీ వస్తుందని తెలిపారు. కలెక్టర్ హామీ ఇచ్చినా తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రం తారుమారు..నీట్ కోసం ఎన్టీఏ ఆధ్వర్యంలో రెండు సెట్ల ప్రశ్నపత్రాలు రూపొందించారు. రెండు సెట్ల పేపర్లను ఆసిఫాబాద్ పట్టణంలోని ఎస్బీఐ, కెనరా బ్యాంకుల్లో వేర్వేరుగా భద్రపరిచారు. పరీక్షకు ముందు ఎన్టీఏ నుంచి నిర్వాహకులకు అందిన ఈ– మెయిల్ ద్వారా ప్రశ్నపత్రాలను కేంద్రానికి తీసుకురావాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఎస్బీఐలో భద్రపరిచిన జీఆర్ఐడీయూ కోడ్తో ఉన్న సెట్ ప్రశ్నపత్రాలను వినియోగించాల్సి ఉంటుంది. జిల్లా అధి కారులు నిర్లక్ష్యంతో కెనరా బ్యాంకులోని ఎన్ఏజీఎన్యూ కోడ్ సెట్ ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఒక సెట్తో పరీక్ష నిర్వహిస్తే.. జిల్లాలో విద్యార్థులు మాత్రం మరో ప్రశ్నపత్రానికి సమాధానాలు రాశారు. జిల్లాలో నీట్ నిర్వహణ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇచ్చిన ప్రశ్నపత్రానికి బార్కోడ్ ఉండగా.. జిల్లాలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లకు కనీసం బార్కోడ్ కూడా లేదని విద్యార్థులు చెబుతున్నారు. -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ఆసిఫాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఈజీఎంఎం– డీడీయూజీకేవై ఆధ్వర్యంలో సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ అండ్ శాని టేషన్లో ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి, బుక్స్, యూనిఫాం, షూ, హెల్మెట్ అందజేస్తామని తెలిపా రు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఎన్ఏసీ సర్టిఫికెట్ ప్రదానం చేస్తామన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువకులు ఎన్ఏసీ శిక్షణా కేంద్రం, బెల్లంపల్లిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 83285 07232, 87904 14049 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement