-
రైతులకు గుడ్న్యూస్.. రైతుభరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త చెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా నిధులు జమ చేస్తామని రేవంత్ చెప్పారు.కాగా, ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘ఎన్నికల వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త అందించారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. అలాగే, ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా ఏడు లక్షల 60 వేల మందికి ఇప్పటికే వేశాం. మిగిలిన నాలుగు లక్షల మందికి వేస్తాం’ అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్..‘ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు దిక్సూచి. కేసీఆర్ నామా నాగేశ్వరరావును బకరాను చేస్తున్నారు. ఏ సంకీర్ణంలో చేరుతావు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తారు. నామాకు సూచన చేస్తున్నాను. కేసీఆర్ మాటలు వినకు. గత డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు సెమీ ఫైనల్స్. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఫైనల్ తీర్పు రాబోతుంది. గుజరాత్ టీమ్ను ఇంటికి పంపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నారు’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సీఎం రేవంత్ ఇలాంటి ప్రకటన చేయడం కోడ్ ఉల్లంఘనకు కిందకు వస్తుందని ప్రతిపక్ష పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసమే రేవంత్ ఇలాంటి కామెంట్స్ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రిజర్వేషన్ల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. తప్పుడు కేసులతో ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?. రాజ్యాంగాన్ని కాపాడతామని రాహుల్ గాంధీ చెప్పిన మాటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాలం చెల్లిన థర్మల్ పవర్ స్టేషన్లను తిరిగి వాడకంలోకి తెస్తాం. కార్మికులకు రావాల్సిన లాభాలు ఇవ్వకుండా, సింగరేణికి బొగ్గు బావులు తవ్వకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయింది.సింగరేణి పరిసరాల్లోని బొగ్గు బావులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కాకుండా సింగరేణికే చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపించి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. రాబోయే ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెప్పపాటుసేపు కూడా కరెంటు పోవడం లేదు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆగిపోయే ప్రసక్తే లేదు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. రాహుల్ను ప్రధానిని చేయడానికి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కామెంట్స్ చేశారు. -
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
ఖమ్మంవ్యవసాయం: వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుండగా, అంతరాయాలు లేకుండా సరఫ రా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎన్పీ డీసీఎల్ ఖమ్మం ఎస్ఈ ఏ.సురేందర్ తెలిపారు. ఖమ్మం మమతా ఆస్పత్రి రోడ్డులోని సబ్ స్టేషన్లో రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన అదనపు 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ మేరకు ట్రాన్స్ఫార్మర్ పని తీరును పరిశీలించిన ఎస్ఈ మాట్లాడుతూ నగరం విస్తరిస్తుండగా పెరుగుతున్న అవసరాల మేరకు సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన అదనపు ట్రాన్స్ఫార్మర్ ద్వారా రాఘవయ్యనగర్, గొల్లగూడెం, చెరువుకట్ట బజార్, రోటరీనగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఉండవని చెప్పారు. డీఈలు బాబూరావు, నంబూరి రామారావు, భద్రుపవార్, ఏడీఈ రమేష్ పాల్గొన్నారు. రఘునాథపాలెంలో... రఘునాథపాలెం: రఘునాథపాలెంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.4లక్షల వ్యయంతో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు డీఈ ఎన్.రామారావు, ఏడీఈ సంజయ్కుమార్ తెలి పారు. గ్రామంలోని గాంధీ బొమ్మ సెంటర్, ఎస్సీ కాలనీల్లో అంతరాయాలు నివారించడానికి ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేశామని చెప్పారు. ఏఈ ఇందిర, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
ఖమ్మం: గత ఎన్నికల్లో తమను కడుపులో పెట్టుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి ముస్తఫానగర్, చర్చికాంపౌండ్, ప్రకాష్నగర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు శుక్రవారం రాత్రి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చికాంపౌండ్ సెంటర్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పుల నుండి కాపాడుకోడానికి బీజేపీతో జత కడుతున్నారని చెప్పారు. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి మాయమాటలతో పదేళ్లు రాజ్యమేలారని విమర్శించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ మంత్రి తుమ్మల ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కావాలని అడిగారని తెలిపారు. గృహనిర్మాణ శాఖకు మంత్రిగా ఉన్న తాను ఖమ్మంకు ఆరు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎంపీగా రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని తెలిపారు.నిరుపేదలందరికీ ఇళ్లు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు.ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టితో పాటు తామిద్దరం కలిసి ఖమ్మంను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్టంలోనే ఆగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్న వారు ధైర్యం ఉంటే రేవంత్రెడ్డిని తాకాలని సూచించారు.మతోన్మాద బీజేపీ మరోమారు గెలిస్తే ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముగ్గురు మంత్రుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ రోడ్డు షోలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మహ్మ ద్ జావీద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
ఖమ్మం సహకారనగర్: కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉద్యోగులు ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని ఖమ్మం లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ. గౌతమ్ సూచించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలల్లో అధికారులకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణను ఆయన పరిశీలించి మాట్లాడారు. మాక్ పోలింగ్, ఈవీఎంల పనితీరుపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. గైర్హాజరైన వారికి మరోమారు శిక్షణ ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగుల్లో శిక్షణకు గైర్హాజరైన వారితో పాటు పూర్తి అవగాహన రాని వారికి మరోమారు శిక్షణ ఇవ్వాలని ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ సూచించారు. కలెక్టరేట్లో ఆయన ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించిన విషయాన్ని ప్రచారం చేయాలని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతీ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి లోకసభ ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా సమకూర్చుకున్న అదనపు ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తయిందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లో ఏఆర్ఓలు, పార్టీల అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షాన ర్యాండమైజేషన్ పూర్తిచేశామని చెప్పారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, డీఏఓ విజయనిర్మల, డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీఓలు జి.గణేష్, ఎల్.రాజేందర్, అదనపు డీసీపీ ప్రసాదరావు, తహసీల్దార్ సీహెచ్.స్వామి తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల శిక్షణలో కలెక్టర్ గౌతమ్ -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ఖమ్మం మామిళ్లగూడెం: దేశంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు ఇక్కడ కూడా తాను గెలి స్తేనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం రోడ్షో నిర్వహించగా.. రాపర్తినగర్ సెంటర్లో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో కేంద్రం ఇచ్చిన నిధులతోనే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, పార్కులు, రోడ్ల నిర్మా ణం జరిగిందని తెలిపారు. గత పదేళ్లుగా ఎంపీగా ఉన్న నామ నాగేశ్వరరావు ఏం సాధించారో చెప్పాలన్నారు. ఇక కాంగ్రెస్ గెలిచినా అదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. కేంద్రంలో మూడోసారి కూడా మోదీ నేతృత్వాన ప్రభుత్వం ఏర్పడనున్నందున ఖమ్మం నుంచి తనను గెలిపిస్తే అత్యధిక నిధులు సాధించి అభివృద్ధికి పడుతానని వినోద్రావు తెలిపారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యాన నిర్వహించిన యువజన సదస్సులో వినోద్రావు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో కీలకమైన యువత బీజేపీ అభ్యర్థిగా తనకు ఓటు వేసేలా ప్రచా రం చేయాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు మాట్లాడగా... వినోద్రావును నాయకులు సత్కరించారు. కాగా, నాయకుడు రుద్ర ప్రదీప్తో పాటు 24వ డివిజన్కు చెందిన పలువురు నాయకులు తిరిగి బీజేపీలో చేరారు. ఈసందర్భంగా వారికి వినోద్రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, నాయకులు డాక్టర్ గొంగూర వెంకటేశ్వర్లు, డాక్టర్ శీలం పాపారావు, అల్లిక అంజయ్య, మోత్కూరి నారాయణ, వాసుదేవరావు, భద్రం, మేకల నాగేందర్, సుధాకర్, క్రాంతి, మధు, ఉపేందర్గౌడ్, శ్రీనివాస్, రవితేజ, నాగసురేందర్రెడ్డి, పృథ్వీ, వినయ్, గోపి, నాగాచారి, వెంకట్యాదవ్, పరశురాం, లక్ష్మారెడ్డి, గోపి, శ్రీకాంత్, రామకృష్ణ, ప్రవీణ్, అజయ్, కిట్టు పాల్గొన్నారు. ఖమ్మం లోక్సభ అభ్యర్థి వినోద్రావు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement