-
ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఉద్యోగికి కత్తిపోటు
తిరువళ్లూరు: ప్రైవేటు సంస్థలో తీసుకున్న అప్పు వాయిదా తమ వద్దకు వస్తే చెల్లిస్తామని, ఫోన్లో పిలిపించి కత్తులతో దాడి చేసిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా తన్నీర్కుళం గ్రామానికి చెందిన అజిత్కుమార్(27) పట్టణంలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అజిత్కుమార్ను ఫోన్లో సంప్రదించిన యువకుడు తాను సంస్థకు వాయిదా చెల్లించాల్సివుందని తిరువళ్లూరులోని ఐసీఎంఆర్ దగ్గరకు వస్తే అక్కడ నగదు ఇస్తామని చెప్పాడు. దీంతో అజిత్కుమార్ ద్విచక్ర వాహనంలో అక్కడికి వెళ్లాడు. అనంతరం అజిత్కుమార్ను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతడి కళ్లలో కారం చల్లి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి, తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి, 108లో అజిత్కుమార్ను తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు నిర్ధారించిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సైన్స్ ఉపాధ్యాయుల ఇస్రో పర్యటన
తిరువళ్లూరు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సైన్స్పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉపగ్రహాల తయారీ విధానంపై అవగాహన పెంపొందించడానికి 200 మందితో కూడి న సైన్సు టీచర్ల బృందం డార్విన్ సంస్థ ఆధ్వర్యంలో ఇస్రోను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ విధానంపై బోధన, ఉపగ్రహాలు, టెలిస్కోప్ తయారీ విధానంపై అవగాహన కల్పించాలని డార్వీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం ఏటా 200 నుంచి 300 మంది ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు చెందిన సైన్స్ టీచర్లను ఇస్రోకు తీ సుకెళ్లి అక్కడ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఉపగ్రహాలు, టెలీస్కోప్ తయారీ విధానం, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది సైన్స్ టీచర్లు సుమారు 200 మంది ఇస్రోను సందర్శించారు. మొదట శాస్త్రవేత్తలు శ్రీనివాసరావు, అన్నాదురైతో సహా నలుగురు శాస్త్రవేత్తలతో ఉపాధ్యాయులు ముఖాముఖీ నిర్వహించారు. సైన్స్ బోధన సమయంలో ఉపయోగించాల్సిన టెక్నిక్స్తోపాటు ఉపగ్రహాలు, టెలీస్కోప్ తయారీ విధానంపై తమకున్న సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరోనాటికల్ విభాగంలో ప్రస్తుతం సాగుతున్న పరిశోధనలను పరిశీలించారు. పర్యటనలో పాల్గొన్న తిరువళ్లూరుకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ డెలోరస్పాండ్యన్ మాట్లాడుతూ డార్వీన్ సంస్థ సైన్స్ ఉపాధ్యాయులను ఇస్రో తీసుకెళ్లడం, వేర్వేరు పరిశోధనలపై శాస్త్రవేత్తలతో ముఖాముఖీ నిర్వహించడం అబినందించదగ్గ విషయమన్నారు. మే 24 నుంచి 26 వరకు కోయంబత్తూరు జిల్లా అన్ననూర్లోని నవభారత్ మెట్రిక్ పాఠశాలలో ఉపగ్రహాల తయారీ, మైక్రోస్కోప్, టెలీస్కోప్ తయారు చేసే విధానంపై శిక్షణ తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దినేష్, జిల్లాల కోర్డినేటర్లు నెల్సన్, కన్నన్, కర్పగం, జయంతి, రాజ్కుమార్, రూపావతి, పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడాది చివరి నాటికి 7,030 కొత్త బస్సులు
● త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులు సాక్షి చైన్నె: ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ 7,030 కొత్త బస్సులను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ రవాణా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఎనిమిది ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన 20,260 బస్సులు ద్వారా 10,128 మార్గాల్లో పబ్లిక్ బస్సులు నడుపుతోంది. రోజుకు 18,728 బస్సులు, అలాగే సాధారణ ప్రజల అవసరాల మేరకు వారాంతాల్లో మరిన్ని ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రోజుకు 1.78 కోట్ల మంది ప్రయాణికులకు లబ్ధి పొందుతున్నారు. ఇందులో మహిళల ప్రయోజనం కోసం ఉచితంగా నడపే 7,179 బస్సుల్లో రోజుకు 51.47 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. 2014 ఏప్రిల్ 24 నాటి ఆదేశాల మేరకు అన్ని బస్సులను తనిఖీ చేసి, మరమ్మతులు చేయించాలని, ప్రస్తుతం అన్ని బస్సులను యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేసి, మరమ్మతులు చేస్తున్నారు. కోవిడ్ –19 మహమ్మారి 2020 –21, 22 మధ్యకాలంలో రవాణా సంస్థల్లో ఎలాంటి ఆదాయం లేకపోవడం, తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయలేపోయింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2022– 23లో వెయ్యి కొత్త బస్సులు, 2023–24లో వెయ్యి కొత్త బస్సులు, 2004లో 3 వేల బస్సులు, ఎస్ఏటీపీ పథకం కింద 16 బస్సులను అందజేయనుందని వెల్లడించింది. అలాగే చైన్నె టోటల్ కాస్ట్ కాంట్రాక్ట్ కింద వెయ్యి విద్యుత్ బస్సులను నడపాలని ప్రణాళికను సిద్ధం చేసింది. మొదటి దశలో 500 విద్యుత్ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 7,030 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. -
హిందూమన్నని నాయకుడి అరెస్టు
కొరుక్కుపేట: తప్పుడు ఫిర్యాదు చేసి, పోలీసులను తప్పుదారి పట్టించిన హిందూమున్నని నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని సెల్వపురం ప్రాంతానికి చెందిన సూర్య ప్రసాద్ (28) అనే ఆటో డ్రైవర్ సెల్వపురం హిందూ మున్నని నాయకుడిగా కొనసాగుతున్నారు. సెల్వపురం నార్త్ అపార్టుమెంట్కు చెందిన చేపల దుకాణ యజమాని అజారుద్దీనన్తో తనకు ప్రాణహాని ఉందని గత నెల 30వ తేదీన సూర్యప్రసాద్ సెల్వపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో అజారుద్దీన్ ఫొటోలు, వీడియోలు రికార్డు చేసి ప్రాణహాని ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు అజారుద్దీన్ సెల్ఫోన్న్ను పోలీసులు స్వాధీనం చేసుకుని సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. ఆ పరీక్షల్లో సూర్య ప్రసాద్ చెప్పినట్లు అజారుద్దీన్ ఫోన్లో సూర్య ప్రసాద్ ఫొటో ఏదీ సేవ్ కాలేదని, డిలీట్ చేయలేదని తేలింది. దీంతో సూర్యప్రసాద్ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తప్పుడు ఫిర్యాదు చేసిన సూర్యప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. -
వీఏఓ, గ్రామ సహాయకుడిపై కేసు నమోదు
తిరువొత్తియూరు: లంచం డిమాండ్ చేసిన వీఏఓ, గ్రామ సహాయకుడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నైల్లె టౌన్ కోటయ్యడివీధికి చెందిన చిన్నదురై (50) నైల్లె కార్పొరేషన్ తచ్చై మండలంలో ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతను తన పొలానికి సంబంధించి అడంగల్ కోసం నైల్లె టౌన్ వీఏఓ కార్యాలయంలో నెల రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తుపై వీఏఓ దురై కుట్టి, గ్రామ సహాయకుడు నటరాజన్ విచారణ చేశారు. చిన్నదురై అడంగల్ కోసం సుమారు నాలుగు సార్లు వీఏఓ కార్యాలయానికి వెళ్లారు. కానీ వారు నిర్లక్ష్యం చేస్తూ అడంగల్ ఇవ్వలేదు. ఈ క్రమంలో గతవారం వీఏఓ దురైకుట్టి, గ్రామ సహాయకుడు నటరాజన్ ఇద్దరూ వేర్వేరుగా సెల్ఫోన్లో చిన్నదురైని వీఏఓ కార్యాలయానికి రావాలని పిలిచారు. అక్కడికి వెళ్లిన చిన్నదురైతో వీఏఓ, గ్రామ సహాయకుడు అడంగల్ ఇవ్వడానికి రూ.20 వేలు ఇవ్వమని కోరారు. అందుకు అతను తిరస్కరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో చిన్నదురైని అసభ్యకరంగా మాట్లాడినట్టు తెలిసింది. ఈ విషయమై చిన్నదురై నైల్లె టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు అడంగల్ ఇవ్వకపోగా వీఏఓ, గ్రామ సహాయకుడు తనని కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారని రూ.2 వేలు కోరుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు విచారణ జరిపి అసభ్యకరంగా మాట్లాడడం, అంటరానితనం తదితర నాలుగు విభాగాల కింద వీఏఓ దురైకుట్టి, గ్రామ సహాయకుడు నటరాజన్పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement