-
హనుమంతరావు అరెస్టు
సిరిసిల్లటౌన్: వలస కూలీలను తమ స్వస్థలాలకు తరలించే క్రమంలో పోలీసులు, టీఆర్ఎస్ నాయకులతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటకుండా డీఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో వీహెచ్ను అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన కార్మికులను తమ సొంత ఊళ్లకు పంపించడానికి కాంగ్రెస్ నాయకులు మూడు ప్రైవేటు బస్సులను మాట్లాడి, వాటికి అనుమతి తీసుకున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. పట్టణ శివారులో సుమారు 60 మంది కార్మికులు ఉండటంతో పోలీసులు ఒక బస్సుకు డ్రైవర్ కాకుండా ఏడుగురినే తరలించేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు. ఆగ్రహానికి గురైన వీహెచ్.. ‘కేటీఆ ర్.. ఇదేం దాదాగిరి.. ఇదేం ప్రజాస్వామ్యం.. కాంగ్రెసోళ్లు సాయం చేయద్దా.. చేస్తే.. తప్పా?’ అని ధ్వ జమెత్తారు. పోలీసులతో కలిసి అధికార పార్టీ నా యకులు వలస కార్మికులను స్వస్థలాలకు పంపించకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. కొద్దిసేప టి తర్వాత టీఆర్ఎస్ నాయకులు, పోలీసులతో వా గ్వాదానికి దిగారు. ఆయన పరుశపదజాలం వాడారంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. ఈక్రమంలోనే డీఎస్పీ చంద్రశేఖర్, టౌన్ సీఐ వెంకటనర్సయ్య ఆధ్వర్యంలో వీహెచ్ను అరెస్టు చేశారు. -
ఆంధ్రప్రదేశ్లో అరాచకం: వీహెచ్
విజయవాడ: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. అధికారం ఉంది కదా అని ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా పురాతన, చారిత్రక ఆనవాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూలగొడుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. అన్నాహజారే స్ఫూర్తి అని చెప్పే ముఖ్యమంత్రి.. ఆయన ప్రతిష్ఠించిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా కూలగొట్టడం దారుణమైన విషయమన్నారు. వేల సంవత్సరాల క్రితం అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతంగా భావించే విజయేశ్వరి ఆలయాన్ని కూలగొట్టడం నియంతృత్వ పాలన కాక ఇంకేమిటని ప్రశ్నించారు. అయోధ్యలో రాయాలయం నిర్మిస్తామంటున్న ఆర్ఎస్ఎస్, విశ్వహిందూపరిషత్ వంటి సంస్థలు, తిరుమలలో వెయ్యికాళ్ల మండపం కూల్చినప్పుడు శాపనార్థాలు పెట్టిన చినజీయర్ స్వామీజీ.. వీరంతా ఇప్పుడు ఎక్కడికి పోయారన్నారు. ప్రతిరోజూ పూజారి వేషధారణలో గుడికి వెళ్లే గవర్నర్ నరసింహన్ నోరు మెదపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విజయవాడలో జరుగుతున్న అరాచకాలపై ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. తాను తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడినైనా.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటానన్నారు. ఇప్పటి సీఎం విదేశాలను పొగడడం ఫ్యాషనయిందని, అందుకే వీరికి దేశీయ సంప్రదాయాలు తెలియడం లేదన్నారు. కూల్చివేసిన గుళ్లను పునర్నిర్మించేవరకు ఆందోళన ఆగదని వీహెచ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement