-
చంద్రబాబు నుంచి ప్రాణ హాని..
-
అభివృద్ధిని విస్మరించిన మండవ
డిచ్పల్లి, న్యూస్లైన్ : ప్రస్తుత నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం (గతంలో డిచ్పల్లి నియోజకవర్గం)లో అభివృద్ధిని గత పాలకులు పూర్తిగా విస్మరించారని పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ ఆరోపించారు. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచి మంత్రి పదవులు అనుభవించిన మండల వెంకటేశ్వరావు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఆదివారం డిచ్పల్లి మండలంలోని గన్నారం, ఇందల్వాయి, తిర్మన్పల్లి, మల్లాపూర్, నడిపల్లి గ్రామాల్లో నిర్వహించిన కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో డీఎస్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధిని కాకపోయినా ఇక్కడి ప్రజలపై ఉన్న ప్రేమతో కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయిస్తున్నట్లు చెప్పారు. గన్నారం గ్రామం 30 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంద ని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఇక్కడ కన్పిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటులో నాది ప్రత్యేక పాత్ర.. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను గుర్తిం చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించినట్లు డీఎస్ తెలిపారు. తాను పీసీసీ చీఫ్గా ఉన్న కాలంలో తెలంగాణ ప్రజల అవస్థలను సోని యాగాంధీకి వివరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనది ప్రత్యేక పాత్ర అని అన్నారు. సోనియాను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచి పోరని అన్నారు. ముఖ్యమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నరు.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలు తనను ముఖ్యమైన స్థానంలో చూడాలని కోరుకుంటున్నారని డీఎస్ అన్నారు. ఏ గ్రామం వెళ్లినా ఇ్కకడి నుంచే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారని తెలి పారు. రాష్ట్ర మహిళా కాం గ్రెస్ అధ్యక్షురాలు, సోదరి ఆకుల లలిత కూడా నిజామాబాద్ రూరల్ నుంచే పోటీ చేయాలని తనను ఆర్డర్ వేసిందని అన్నారు. ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార, పీసీసీ కార్యదర్శి రత్నాకర్, ఏఎంసీ చైర్మన్ నగేశ్రెడ్డి, డీసీసీబీ డైరక్టర్లు గజవాడ జైపాల్, పాశం నర్సిం హులు, న్యాసరాజేశ్వర్, ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ కంచెట్టి గంగాధర్, నాయకులు ముప్ప గంగారెడ్డి, మనోహర్ రెడ్డి, దాసరి లక్ష్యినర్స య్య, సాయిప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, సదానంద్, నరహరి, చిన్నయ్య, రూప్సింగ్, పాశంకుమా ర్, గుట్ట గంగాధర్, ఎల్లయ్య, మురళి, అంబర్సింగ్, రత్తునాయక్, సరస్వతి, ఇనాయత్, రాజునాయక్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement