-
దేశ ప్రజల భవిష్యత్ కోసమే ఇండియా కూటమి
నడిగూడెం: దేశ ప్రజల భవిష్యత్ కోసమే ఇండియా కూటమి ఏర్పాటు అయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో కోదాడ ఎమ్యెల్యే పద్మావతి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డిలతో కలిసి నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ లోక్సభ ఎన్నికలు చాలా కీలకమని, బీజేపీ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో దేశ ప్రజల కోసం చేసిందేమీ లేదని అన్నారు.బీజేపీ సర్కార్ మతపరంగా ప్రజలను విభజించి పాలిస్తోందన్నారు. మోదీ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారన్నారు. దీంతో ప్రజలకు భారంగా మారిందన్నారు. దేశంలో మెజారిటీ లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పదేళ్లలో బీఆర్ఎస్ కూడా చేసిందేమీ లేదని, లోక్సభ ఎన్నికల అనంతరం ఆ పార్టీ మనుగడలేకుండా పోతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో అధికార దుర్వినియోగం జరిగిందని, అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, పోలీసు శాఖను ఇష్టారాజ్యంగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల అనంతరం అర్హులైన పేదలందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్యెల్యే వేనేపల్లి చందర్రావు ఈ సభలో పాల్గొన్నారు. -
బీఆర్ఎస్కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా
నల్లగొండ: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్కు రెండు సీట్లు వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ చేశారు. ఎన్నికల తరువాత ఆ పార్టీ ఉండదన్నారు. బుధవారం నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి నామినేషన్ సందర్భంగా నల్లగొండ వీటీకాలనీలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు.అనంతరం భారీ ర్యాలీగా గడియారం సెంటర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కోమటిరెడ్డి మాట్లాడారు. సాగర్, శ్రీశైలంలను ఎండబెట్టిన ద్రోహి కేసీఆర్ అని, అలాంటిది ఏ మొహం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తున్నారన్నారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే కేసీఆర్ మాత్రం దొంగదీక్ష చేశాడంటూ దుయ్యబట్టారు. రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: ఉత్తమ్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్నాయంటూ ఇటీవల భువనగిరిలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని చెప్పారు.రైతులను మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మంత్రిగా మాటిస్తున్నా. ఎస్ఎల్బీసీని, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఎన్నికల తర్వాత కొత్త రేషన్కార్డులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడే మరమ్మతులొద్దు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతుల నిర్వహణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించడంపై ఆ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని స్పష్టం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. బ్యారేజీలకు అత్యవసర మరమ్మతుల విషయమై నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఇటీవల నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్ జలసౌధలో సమావేశం నిర్వహించి చర్చలు జరపడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా, పాలసీకి విరుద్ధంగా మరమ్మతుల విషయంలో ఎలా ముందుకు వెళ్లారు? అనే అంశంపై ఈఎన్సీ అనిల్కుమార్ను మంత్రి వివరణ కోరారు. ఇలావుండగా.. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ పునర్నిర్మాణం పనులతో పాటు కాఫర్ డ్యామ్ పనులను సొంత ఖర్చుతో చేసేందుకు ఈ సమావేశంలో నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’అంగీకరించినట్టు కొన్ని పత్రికల (సాక్షి కాదు)తో పాటు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు రావడంతో సీఎం కార్యాలయం ఆరా తీసింది. ఆ వార్తా కథనాలను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించింది. వర్షాలొస్తే వరదలొస్తాయని.. కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి పరిష్కారాలను సూచించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేసేవరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టబోమంటూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ విధానపర నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై విస్తృత రీతిలో అధ్యయనం చేపట్టింది. నీళ్లు నిల్వ ఉంటే బ్యారేజీలకు మరింత నష్టం జరిగే ప్రమాదముందని, ఖాళీ చేయాలని సూచించడంతో గతంలోనే బ్యారేజీలను ఖాళీ చేశారు. కాగా మరో నెలన్నర రోజుల్లో వర్షాలు ప్రారంభం కానుండడంతో గోదావరిలో ఎప్పటిలాగే భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. ఈ వరదలతో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా చేపట్టాల్సిన అత్యవసర మరమ్మతులను సాధ్యమైనంత త్వరగా సూచించాలని అయ్యర్ కమిటీకి సర్కారు విజ్ఞప్తి చేసింది. అయితే కమిటీ రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి సూచనలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే అత్యవసర మరమ్మతులపై బ్యారేజీల నిర్మాణ సంస్థలతో గత వారం ఆ శాఖ ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్ చర్చలు జరిపారు. విషయం తెలియడంతో మంత్రి ఫైర్! మేడిగడ్డ బ్యారేజీ మరింత కుంగకుండా 7వ బ్లాక్కు రెండు వైపులా షీట్పైల్స్తో అదనపు రక్షణ కల్పించాలని ఈఎన్సీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీని కోరినట్టు తెలిసింది. గోదావరి నదికి అడ్డంగా బ్యారేజీలకు రెండు వైపులా కరై్టన్ వాల్స్ నిర్మించాలని సూచించినట్టు సమాచారం. అలాగే బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను ప్రెషర్ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేయాలని కాంట్రాక్టర్లను కోరినట్టు తెలిసింది. కాగా ఈ పనులను సొంత ఖర్చుతో చేసేందుకు ఎల్ అండ్ టీతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్కి ఎదురుగా నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ కోసం రూ.52 కోట్ల బిల్లులను చెల్లించాలని కూడా ఎల్ అండ్ టీ కోరింది. ఈ విషయాలన్నీ తెలిసిన నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. -
త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పొగరు కారణంగానే గత ఎన్ని కలకు ముందు 104 మందితో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇటీవలి ఎన్నికల తర్వాత 39కి తగ్గిందని సాగు నీరు, పౌరసరఫరాల మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి విమ ర్శించారు. ఇప్పుడు అందులోనూ 25 మంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని జోస్యం చెప్పారు. శనివా రం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లతో కలసి ఉత్తమ్ మాట్లాడారు. కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ అన్నీ అబద్ధాలు మాట్లాడారని, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఎవరినో తొక్కడం కాదని, లోక్సభ ఎన్నికల్లో జనమే కేసీ ఆర్ను బొంద పెడతారని వ్యాఖ్యానించారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఇంట్లో పడుకున్న కేసీఆర్ ఇప్పుడు నైరాశ్యంలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమను బ్రోకర్, జోకర్ అంటున్న కేసీఆర్ లాగా తాము పాస్పోర్టులు అమ్ముకొని బ్రోకర్లుగా పనిచేయ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ లాంటి పొగరుబోతు వ్యక్తి ని తానెప్పుడూ చూడలేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారన్నారు. కరువు తెచ్చింది కేసీఆరే.. కేసీఆర్ సాగునీటి రంగాన్ని పదేళ్లపాటు సర్వనాశనం చేశా రని, ఆయన కమీషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టు కొచ్చిందని ఉత్తమ్ ఆరోపించారు. కరువును తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, కేసీఆరేనని, ఆయన మాటలు ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాగు, సాగునీటి అవసరాల కోసం కేసీఆర్ మొహం చూసి తాము నీళ్లు విడుదల చేయట్లేదని, షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి సమస్య రాకుండా చూసుకుంటామని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ను పాతిపెట్టాలి: జూపల్లి కేసీఆర్ చవట, దద్దమ్మ కాబట్టే ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన రూ. 8 లక్షల కోట్ల భారం మోపా రని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే ప్రాంతంలోనే పాతిపెట్టా లన్న కాళోజీ అన్నట్టు కేసీఆర్ను పాతిపెట్టాలని వ్యాఖ్యానించారు. ఆయన అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడైనా పంట నష్టం పరిహారం రైతులకు ఇచ్చారా అని ప్రశ్నించారు. నాలుగు మాసాల తమ పాలన చూసే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క లోక్సభ స్థానం కూడా రాదని అన్నారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని తాము ధైర్యంగా చెబుతున్నామని, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని రద్దు చేసుకుంటానని చెప్పే ధైర్యం కేసీఆర్కు ఉందా అని సవాల్ విసిరారు. తల ఎక్కడ పెట్టుకుంటావ్... కేసీఆర్: పొన్నం మిషన్ కాకతీయ పేరుతో రూ. 40 వేల కోట్లు పెట్టి కేసీఆర్ చెరువుల్లో పూడికలు తీయిస్తే భూగర్భంలో ఉన్న నీళ్లు ఏమ య్యాయని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయానన్న అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉపయోగించిన భాషతోనే తాము కౌంటర్ ఇస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. తాము రేపటి నుంచి ఫీల్డ్లోనే ఉంటామని, ఎవరు ఎవరిని తొక్కుతారో చూద్దామని సవాల్ చేశారు. -
అలా.. మాట్లాడిన అతను పదవికి రాజీనామా చేయాలి : ఎంపీ అర్వింద్
నిజామాబాద్: రాష్ట్రంలో ముసింల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ పాకులాడుతోందని, అందుకు నిదర్శనమే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలని బీజేపీ అభ్యర్థి, ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారికంగా ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ముస్లింల ఓట్ల కోసం ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పార్లమెంట్లో పాసైన చట్టాలను ఏ రాష్ట్రమైనా అమలు చేయమనే అధికారం లేదన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడిన ఉత్తమ్కుమార్రెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ప్రధానకార్యదర్శి లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, శంకర్, మల్లేశ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ముఖ్యమంత్రి గుంపు మేస్త్రీ.. ప్రధానమంత్రి తాపీ మేస్త్రీ..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement