-
హైదరాబాద్లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక
బిగ్బాస్ 7 తెలుగు సీజన్తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్తో హైదరాబాద్లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)ప్రస్తుతం హైదరాబాద్లోని అద్దె ఫ్లాట్లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ ) -
అలాంటి సన్నివేశాలకు నో: మృణాళ్ ఠాకూర్
‘కథకి, పాత్రకి అవసరమైతే గ్లామర్ సన్నివేశాల్లో, ముద్దు సీన్స్లో నటించేందుకు సిద్ధం’ అనే మాటని ఎక్కువశాతం హీరోయిన్లు అంటుంటారు. అయితే అలాంటి సన్నివేశాలకు నో అనే కథానాయికలూ లేకపోలేదు. హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా గ్లామర్ సన్నివేశాలు, ముద్దు సీన్స్లో నటించేందుకు నో చెబుతాను అంటున్నారు. ‘సీతా రామం’(2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు ఈ మరాఠీ బ్యూటీ. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత తెలుగులో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారామె.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ–‘‘ఇంటెన్స్ కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. పైగా నేను అలాంటి సీన్స్లో యాక్ట్ చేసేందుకు నా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అందుకే మొహ మాటం లేకుండా నో చెబుతాను’’ అన్నారు. -
ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్.. కేవలం 61 గంటల్లోనే!
అల్లు అర్జున్ మూవీ జులాయితో ప్రేక్షకులను అలరించిన నటుడు సోనూ సూద్. అరుంధతి చిత్రంతో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఫతే మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే తాజాగా సోనూ సూద్ వాట్సాప్ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో వెంటనే ట్విటర్ ద్వారా తన సమస్యను ప్రస్తావించారు.సోనూ సూద్ విజ్ఞప్తిని పరిశీలించిన వాట్సాప్ యాజమాన్యం అతని ఖాతాను పునరుద్ధరించింది. అయిదే దాదాపు 61 గంటల తర్వాత వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సోనూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఫైనల్గా నా వాట్సాప్ తిరిగి పనిచేస్తోంది.. కేవలం 61 గంటల వ్యవధిలోనే 9,483 సందేశాలు వచ్చాయి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. కాగా.. సోనూ సూద్ నటిస్తోన్న ఫతే చిత్రంలో జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా సోనూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం
బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈమేరకు తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. తన భర్త మంజునాథ్ తండ్రి గారు హఠాన్మరణం చెందారని తెలుపుతూ ఆమె కలత చెందింది. ఈ క్రమంలో తన మామగారి ఫోటోను ఆమె షేర్ చేసింది. 'మిస్ యూ అంకుల్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ చెప్పుకొచ్చింది.ఇదే సమయంలో లాస్య భర్త మంజునాథ్ కూడా తన తండ్రి గురించి ఎమోషనల్ అయ్యాడు. 'భౌతికంగా మీరు మాతో లేకపోయినా.. మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుంది.' అని మంజునాథ్ భావోద్వేగానికి గురైయాడు. ఆపై తన తండ్రితో దిగిని ఫోటోలను పంచుకున్నాడు. ఆయన మరణానికి కారణాలు తెలుపలేదు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించి ఉంటారని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Manjunath Chillale (@manjunath_chillale) -
నిర్మాతగా సమంత.. కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
హీరోయిన్గా ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన సమంత వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా కూడా రాణించింది. తాజాగా టాలీవుడ్లో ఆమె మరో అడుగు ముందుకు వేసింది. నిర్మాతగా మారిన సమంత తన కొత్త సినిమాను ప్రకటించింది. ఈ మేరకు తన కొత్త ప్రొడక్షన్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' కంపెనీ నుంచి మొదటి సినిమా ప్రకటన అఫీషియల్గా వచ్చేసింది.నేడు (ఏప్రిల్ 28న) సమంత పుట్టిన రోజు సందర్భంగా తన నిర్మాణ సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. 'మా ఇంటి బంగారం' అనే టైటిల్తో పోస్టర్ విడుదల చేశారు. తన సొంత నిర్మాణ సంస్థలో సమంత లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో సమంత చీరకట్టుకుని చేతిలో తుపాకీ పట్టి సీరియస్ లుక్తో కనిపిస్తుంది. లేడీ ఓరియేంటెడ్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సినిమాలు నిర్మించే విషయంలో హైదరాబాద్కు చెందిన ఎంటర్టైన్మెంట్ కంపెనీ 'మండోవా మీడియా వర్క్స్'తో సమంత ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ సంస్థకు మంచి గుర్తింపే ఉంది. తమ భాగస్వామ్యంలో వెబ్ సిరీస్తో పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ రూపొందించే అవకాశం ఉందని మండొవా మీడియా వర్క్స్ అధినేత హిమాంక్ దువుర్రు గతంలో తెలిపాడు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
Advertisement