-
బంజారాహిల్స్ పబ్లో అసభ్య డ్యాన్స్లు.. 35 యువతుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలోని ఆఫ్టర్ 9 పబ్పై శనివారం రాత్రి వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. కస్టమర్లను ఆకర్షించడానికి నిర్వాహకులు వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్లో అసభ్యకర డ్యాన్స్లు చేపిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టారు. అర్థరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్ను క్లోజ్ చేయించి.. కేసు నమోదు చేశారు.కాగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు బార్ & పబ్ ఆర్గనైజర్ నిర్వహిస్తున్నారు. After 9 పబ్ రైడ్ సమయంలో సుమారు 100 నుండి 150 మంది యువతి యువకులు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో డ్యాన్స్ 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు. 32 మంది యువతులను పోలీస్ వాహనంలో సైదాబాద్లోని రెస్క్యూ హోమ్ తరలించారు. వీరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. -
వడదెబ్బతో 16 మంది మృతి
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఎండల కారణంగా వడదెబ్బ తగిలి శనివారం వివిధ ప్రాంతాల్లో 16 మంది మృతిచెందారు. జగిత్యాల జిల్లాలో ఎంఈవోగా పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన బత్తుల భూమయ్య వడదెబ్బతో హఠాన్మరణానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల విజిలెన్స్ బృందంలో పనిచేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ఎండలోనే ఆయన పనిచేయాల్సి వస్తోంది. తీవ్రమైన ఎండవేడికి వడదెబ్బకు గురైన ఆయన చొప్పదండిలోని స్వగృహంలో వేకువజామున కుప్పకూలిపోయారు.అలాగే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగేళ శివారు గొండుగూడెంకు చెందిన కొమురం సోము (58) ఎండకు తాళలేక మృతిచెందారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్తండాకు చెందిన ఉపాధ్యాయుడు లకావత్ రామన్న (45) శుక్రవారం గజ్వేల్లో జరిగిన ఎన్నికల శిక్షణకు వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. కాగా, రాత్రి ఆయన ఆరోగ్య క్షీణించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందారు.నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు (56) మధ్యాహ్నం ఎండకు తాళలేక ఇంటి సమీపంలో కింద పడిపోయారు. ఆయనను 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొల్లాపూర్ మండలంలోనే ముక్కిడిగుండం గ్రామానికి చెందిన శక్రు నాయక్ (80) కొల్లాపూర్ వెళ్లి మధ్యాహ్నం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. సాయంత్రం వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన గొడిశాల దేవయ్య(70) ఎండ తీవ్రతకు మృతిచెందారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో వడ్డె యాదయ్య (72) పత్తికట్టె తొలగించే పనులు చేస్తుండగా సొమ్మసిల్లి మృతి చెందారు. అలాగే గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన స్పృహ తప్పి పడిపోయిన వర్గల్ మండలం వేలూరుకు చెందిన దార నాగయ్య(45)ను పోలీసులు ప్రభుత్వాసుపత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బ కారణంగా శనివారం ఆరుగురు మృతిచెందారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్చెడ గ్రామానికి చెందిన ఆకుల భాస్కర్ (25), హరియా తండాకు చెందిన శతాధిక వృద్ధుడు బాదావత్ నర్సింహ(100) ఎండ వేడికి తాళలేక చనిపోయారు. నర్సంపేట మండలం ఇప్పల్తండాకు చెందిన అజ్మీర మంగ్యా (45) అనే రైతు ఎండ తీవ్రతకు మృతిచెందారు.ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన వంక లక్షి్మ(67) వడదెబ్బతో తనువు చాలించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాం«దీనగర్కు చెందిన ఆవుల కనకయ్య(75) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడేనికి చెందిన మేకల లస్మయ్య (56) అనే రైతు ప్రాణాలు కోల్పోయారు. పనిచేస్తున్న చోటే..కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి గ్రామంలో భూమిని రాములు (71) ఉపాధిహామీ పనుల్లో భాగంగా పలుగుతో మట్టిని తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి కూలీలు ఇచ్చిన సమాచారంతో అక్కడి చేరుకున్న వైద్యులు రాములును పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. వారం రోజులుగా వరుసగా ఉపాధి పనులకు హాజరు కావడంతో రాములుకు వడదెబ్బ తగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన మహిళా కూలీ బోల్లబోయిన వనమాల (45) ధాన్యం ఆరబెట్టేందుకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందారు. -
నెల ముందే గరిష్టానికి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. సాధారణంగా మే నెల చివరివారంలో ఉండే స్థాయిలోని గరిష్ట ఉష్ణోగ్రతలు.. మే తొలివారంలోనే నమోదవుతుండటం గమనార్హం. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లిపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలలో గరిష్ట ఉష్ణోగ్రత 46.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో చూస్తే.. మహబూబ్నగర్లో సాధారణం కంటే 4.5 డిగ్రీలు, హైదరాబాద్, ఖమ్మంలలో 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే అధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాడ్పుల తీవ్రత పెరిగే చాన్స్ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయని.. ఆది, సోమవారాల్లో వడగాడ్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఉరుములు, మెరుపుల వానలకు చాన్స్ మరాఠ్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా వానలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వివరించింది. -
రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు చెప్పారు. రివర్స్ గేర్లో వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ గెలవాలని వారు భావిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో చెరో 8 లోక్సభ స్థానాలు గెలుచుకునేలా కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఆంధ్రా మూలాలు కలిగిన సీఎం రేవంత్రెడ్డి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి మూటలు పంపడంపైనే శ్రద్ధ‘సీఎం రేవంత్ చెప్తున్న ప్రజాపాలన ఫార్స్గా మారింది. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఓ వైపు దూషిస్తూ, మరోవైపు ఒట్లు పెడుతున్నారు. ప్రజలను నిరంతరం మోసగించడం సాధ్యం కాదనే విషయం గ్రహించి కేసీఆర్ను దుర్భాషలాడుతున్నారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలు, పరిపాలనపై లేదు.రాష్ట్రంలో పాలనకు బదులుగా పగలు, ప్రతీకారాలు నడుస్తున్నాయి. పాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేయడం తిరోగమన ఆలోచన. ప్రజాపాలనలో వచ్చిన 3.50 లక్షల దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..’ అని హరీశ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధానికి రేవంత్ సహకరించే చాన్స్‘హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్య వాదులు కోరుతున్నారు. ఆంధ్రా మూలాలు కలిగిన రేవంత్రెడ్డి దానికి సహకరించే అవకాశముంది. గతంలో ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్దే ప్రధాన పాత్ర. తెలంగాణ ప్రయోజనాలను కాపా డటం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లలో గెలిపిస్తే బీఆర్ఎస్ కీలకంగా మారుతుంది..’ అని హరీశ్రావు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న రేవంత్‘రాష్ట్రం దివాలా తీసిందంటూ సీఎం చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటు న్నాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే అభివృద్ధి, పెట్టు బడుల సాధన, ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యం? రేవంత్ తీరుతో పెట్టుబడుదారులు పునరా లోచనలో పడుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్క డమే పనిగా పెట్టుకున్న రేవంత్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తూ కేసులు పెడుతు న్నారు..’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు‘దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం సహా ఏదీ ఇవ్వలేదు. బీజేపీ ఆదానీని మాత్రం ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలబెట్టింది. నల్ల చట్టాలతో రైతులపై దాడులు, ఎస్సీ వర్గీకరణ, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వంటి అనేక అంశాలు బీజేపీ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన కేసీఆర్ ఆధ్యాత్మికలో బీజేపీ కంటే రెండు అడుగులు ముందే ఉన్నారు..’ అని మాజీమంత్రి స్పష్టం చేశారు. -
మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి
కరీంనగర్ టౌన్: ‘సీఎం రేవంత్రెడ్డి గోబెల్స్ వారసుడు.. రిజర్వేషన్ల రద్దు చేయబోతోందంటూ బీజేపీపై విషప్రచారం చేస్తుండు.. లౌకిక పదాన్ని తొలగిస్తామన్నందుకు బీజేపీ నేతలను ఏ చెప్పుతో కొట్టాలంటున్నడు.. నేనడుగుతున్నా... 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వంద సార్లకుపైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి?’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్కుమార్ ప్రశ్నించారు.కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్షోలో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ అంటే... రేవంత్రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్కి సవరణకు, పూర్తిగా మార్చేయడానికి తేడా కూడా తెల్వదని ఎద్దేవా చేశారు.‘రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదనీ, ఇకపై రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఎవరైనా అంటే చీపురు, చెప్పులతో ఉరికించి కొట్టండని బండి సంజయ్ పిలుపునిచ్చారు.కార్పొరేటర్లను పశువుల్లా కొంటున్నారుఫోన్ ట్యాపింగ్ సొమ్ముతో కరీంనగర్లో కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని బండి ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్కు 20 లక్షలు ఇస్తే.. అందులో రూ.5లక్షలు బ్యాంకు ఖాతా లో జమచేసినట్లు చర్చ సాగుతోందని, వెంటనే బ్యాంక్ లావాదేవీలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలన్నారు. కరీంనగర్ అభివృద్ధికి రూ.12వేల కోట్లు తీసుకొచ్చానని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్య ర్థులు మీ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ‘మీ కోసం కొట్లాడింది మేం. మీ కోసం జైలుకు పోయింది మేం. నాపైన 109 కేసులు పెట్టినా భయపడలే. మరీ కాంగ్రెస్కు ఓటేయడం ఎంత వరకు న్యాయం?’ అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. విజన్.. ఇజం లేని పార్టీ కాంగ్రెస్కరీంనగర్లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రగతి పథంలో భారతదేశం’ సదస్సులో బండి సంజయ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్, భద్రత విషయంలో స్పష్టమైన విజన్ ఉన్న మహానేత మోదీ అని కొనియాడారు. విజన్తో పాటు ఇజం కూడా లేని పార్టీ కాంగ్రెస్సేనన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేని కాంగ్రెస్కు ఎందుకు ఓటే యాలని ప్రశ్నించారు. మోదీ పదేళ్ల పాలనలో ఇప్పుడు దేశం ఏ విధంగా ఉందో.. కాంగ్రెస్ పాలనలో దేశం పరిస్థితి ఎట్లుండేదో విశ్లేషించి ప్రజల ముందుంచాలని మేధావి వర్గానికి విజ్ఞప్తి చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు: నందమూరి లక్ష్మీపార్వతి
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు
ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..
నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?
ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి
జల్సా హీరోయిన్ ఇలా మారిపోయిదేంటి? గుర్తుపట్టడం కష్టమే(ఫోటోలు)
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement