-
పారిశ్రామిక పెట్టుబడులు రూ.17,867 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ.17,867 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు సాధించింది. సుమారు 4 వేల పరిశ్రమలు రాగా, 96 వేలకు పైగా ఉద్యోగాలు లభించినట్లు పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక (2021–22) పేర్కొంది. టీఎస్ఐఐసీ 810 ఎకరాల్లో 13 కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి 526 పరిశ్రమలకు కేటాయించింది. వీటి ద్వారా రూ.6,123 కోట్ల పెట్టుబడులు, 5,626 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా. తెలంగాణ ఏర్పడింది మొదలుకుని ఇప్పటి వరకు 19,961 ఎకరాల్లో 56 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. మరో 15,620 ఎకరాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నివేదికలోని ముఖ్యాంశాలు.. వాణిజ్య వాతావరణంలో నం.1 నీతి ఆయోగ్ ‘ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021’ప్రకారం ఉత్తమ వాణిజ్య వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణది అగ్రస్థానం. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం విదేశాలకు ఎగుమతుల్లో 75% వాటా మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణదే. దేశంలో వాణిజ్య, పారిశ్రామిక రంగ ర్యాంకుల్లో తెలంగాణది ప్రథమ స్థానం. దేశంలోనే తొలి ఐపీ మస్కట్ బడ్డీ ‘రచిత్’ను ఆవిష్కరించిన తొలి రాష్ట్రం తెలంగాణ. జీఎస్డీపీలో 19.1% వృద్ధి ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2021–22లో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.11.54 లక్షల కోట్లు. జీఎస్డీపీలో రాష్ట్రం 19.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2017–18 నుంచి 2021–22 మధ్యకాలంలో జీఎస్డీపీలో తెలంగాణ ఐదేళ్లలో 11.4 శాతం సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) సాధించింది. ఇదే సమయంలో భారత్ 8.5 శాతం సీఏజీఆర్ను మాత్రమే సాధించింది. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే 2014–15 నుంచి 2021–22 మధ్యకాలంలో తెలంగాణ జీఎస్డీపీ 128.3 శాతం వృద్ధి చెందగా, ఇదే కాల వ్యవధిలో భారత్ 89.6 శాతం మాత్రమే సాధించింది. తలసరి ఆదాయం రూ.2,78,833 2021–22లో రాష్ట్ర జీఎస్వీఏ (గ్రాస్ స్టేట్ వాల్యూ అడిషన్)లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 18.3 శాతం, పారిశ్రామిక రంగం వాటా 20.4 శాతం, సేవా రంగం వాటా 18.3 శాతంగా నమోదైంది. జీఎస్వీఏకి గత ఏడాది ప్రాథమిక రంగం 18.3 శాతం, ద్వితీయరంగం 20.4 శాతం, తృతీయ రంగం 61.3 శాతాన్ని సమకూర్చాయి. 2021–22లో జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం కాగా, రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఒక శాతం పెరిగింది. Ü తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,833 కాగా జాతీయ స్థాయిలో రూ.1,49,848 మాత్రమే. 2014–15లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే కావడం గమనార్హం. 2014–15 నుంచి 2021–22 మధ్యకాలంలో తెలంగాణ తలసరి ఆదాయంలో 124.7 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి 72.9 శాతం మాత్రమే. వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల వివరాలు 2021–22 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు రూ.17,867 కోట్లు రూ.2,32,311 కోట్లు వచ్చినన పరిశ్రమలు 3,938 19,454 వచ్చిన ఉద్యోగాలు 96,863 16.48లక్షలు (2021–22లో ఫార్మా, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎయిరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, టెక్స్టైల్స్ రంగాల్లో కీలక పెట్టుబడులు వచ్చాయి.) -
‘కాపీ’పై ఏపీకి త్వరలో నోటీసులు
ఇరు రాష్ట్రాల వాదనల తర్వాత చర్యలు సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో ర్యాంకు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కినట్లుగా వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. వెబ్సైట్ కాపీ వ్యవహారంపై త్వరలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తామని కేంద్ర పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహక విభాగం (డిప్) అధికారులు హామీ ఇచ్చినట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. కాపీ వ్యవహారంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ సోమవారం డిప్ అధికారులకు ఆధారాలు సమర్పించారు. మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఎనిమిది నెలలుగా తెలంగాణ పరిశ్రమల శాఖ చేస్తున్న కసరత్తు, విభాగాల వారీగా చేపట్టిన సంస్కరణలు.. వాటికి సంబంధించిన ఆధారాలు అందజేశారు. రాష్ట్రాలు సమర్పించిన ఆధారాలను పూర్తి స్థాయిలో మదింపు చేసిన తర్వాతే తుది ర్యాంకులు కేటాయించాలని కోరినట్లు సమాచారం. తెలంగాణ ఆరోపణలపై స్పందించిన డిప్ అధికారులు త్వరలో ఏపీకి నోటీసులు జారీ చేస్తామని.. ఏపీ సర్కారు వాదనలతో పాటు తెలంగాణ వాదనలు కూడా విన్న తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది. కాగా.. జూలై నెలాఖరులోగా పారదర్శకంగా ఈవోడీబి ర్యాంకులను కేటాయిస్తామని డిప్ అధికారులు హామీ ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement