-
టాస్క్ఫోర్స్ టైగర్కు వీడ్కోలు
సాక్షి, తిరుపతి అర్బన్: ఉద్యోగులకు బదిలీలు తప్పవని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (టాస్క్ఫోర్స్) ఐజీ మాగంటి కాంతారావు తెలిపారు. తిరుపతి టాస్క్ఫోర్స్ కార్యాలయంలో గురువారం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. టాస్క్ఫోర్స్, అటవీ శాఖాధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఐజీ కాంతారావు మాట్లాడుతూ, ఉద్యోగాలు విధుల్లో రాణించాలంటే సహచరులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. ఆ విధానంతోనే తాను తిరుపతి డివిజన్ టాస్క్ఫోర్స్ ఐజీగా 54 నెలల పాటు వృత్తిధర్మం నెరవేర్చానన్నారు. తిరుపతి కార్యాలయంతో పాటు అనేకమంది ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. ఏ ప్రాంతంలో విధులనేది కాకుండా, ఎంతమేరకు వృత్తిలో రాణిస్తున్నామనే అంశాన్ని గుర్తించుకోవాలన్నారు. తెలుగు రాష్టాల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేసినా, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత సుదీర్ఘకాలం ఉద్యోగం చేసే భాగ్యం లభించడం తనకు లభించిన అదృష్టం అన్నారు. టాస్క్ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ మాట్లాడుతూ, తిరుపతి టాస్క్ఫోర్స్ ఉద్యోగులకు ఐజీ కాంతారావు మార్గదర్శకులన్నారు. అనేక అంశాల్లో ఆయన తీరు మానవత్వానికి అద్దం పట్టిందన్నారు. టాస్క్ఫోర్స్ విభాగంలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి తన సొంత ఖర్చుతో క్యాంటిన్ ఏర్పాటు, సిబ్బంది చురుకుగా ఉండడానికి జిమ్ ఏర్పాటు చేయడం కాంతారావు మానవత్వానికి మచ్చుతునకలన్రాను. అటవీసంపదను కాపాడడంలో ఆయన కృషిని కొనియాడారు. అటవీశాఖ సీఎఫ్ఓ శరవణ్ మాట్లాడుతూ, ఐజీ కాంతారావు కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు అనుబంధం పెంచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ డీఎస్పీలు, ఆర్ఐలు, డీఎఫ్ఓలు, ఎఫ్ఆర్ఓలు పాల్గొన్నారు. బదిలీ అయిన టాస్క్పోర్స్ ఐజీ కాంతారావును గురువారం రాత్రి కార్యాలయం నుంచి కపిలతీర్థం వరకు పోలీస్ వాహనంలో ఊరేగించారు. ఉద్యోగులు ఆయనపై పూలవర్షం కురిపించి, అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ డీఎస్పీలు వెంకటరమణ, వీ. అల్లాబక్ష, డీఎఫ్ఓలో నాగార్జున్రెడ్డి పాల్గొన్నారు. ఎస్పీకి బాధ్యతల అప్పగింత తిరుపతి డివిజన్ ఎర్రచందనంటాస్క్ ఫోర్స్ ఐజీ మాగంటి కాంతారావును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర లీగల్ మెట్రోలజీ కంట్రోలర్గా నియమిస్తూ విజయవాడకు రెండు రోజుల క్రితం బదిలీ చేసింది. గురువారం ఆయన ఆ బాధ్యతలు టాస్క్ఫోర్స్ ఎస్పీ, అడిషనల్ కమాండెంట్ పీ.రవిశంకర్కు అప్పగించారు. -
ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్డంపై అధికారులతో చర్చ
రైల్వేకోడూరు రూరల్: ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్డడంలో తీసుకునే చర్యలుపై టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు అధికారులతో చర్చ జరిపారు. రైల్వేకోడూరు పట్టణంలోని ఆ శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం తిరుపతి డీసీఎఫ్ బీఎన్ఎన్ మూర్తి, ఆరైలు, ఎఫ్ఆర్లతో సమావేశమయ్యారు. రైల్వేకోడూరు బాలుపల్లె ఫారెస్టుకు సంభందించిన మ్యాప్ను అధికారులతో కలిసి పరిశీలించారు. పుల్లగూర పెంట వద్ద రాత్రి నిద్ర బాలుపల్లె ఫారెస్టు పరిధిలోని పుల్లగూరపెంట ప్రాంతంలో రాత్రి నిద్ర చేయనున్నట్లు టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు తెలిపారు. పుల్లగూర పెంట నుంచి వాగేటి కోన వరకు అడవిని జల్లెడ పడుతున్నామన్నారు. ఈ సమావేశానికి టాస్క్ఫోర్స్ ఆరైలు మురళి, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, అలిభాషా, ఎఫ్ఆర్ఓ రమణ, స్థానిక ఎసై ్స రమేష్బాబులు హాజరయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement