-
కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న అల్లు అరవింద్.. ధరెంతంటే?
తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొత్త కారు కొన్నాడు. ఈసారి బీఎమ్డబ్ల్యూ ఐ7 బ్రాండ్ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. చూడటానికి ఎంతో స్టైలిష్గా ఉన్న ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రెండున్నర కోట్ల పైనే ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించాడు. పసివాడి ప్రాణం, మెకానిక్ అల్లుడు, జల్సా, మగధీర, సరైనోడు, అల వైకుంఠపురములో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలున్నాయి.తండ్రి నిర్మాతగా, తనయుడు హీరోగా బిజీఅల్లు అర్జున్ 22వ సినిమాతో పాటు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించే సినిమా సైతం గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే నిర్మితం కానుంది. కొన్ని ఇతర భాషా చిత్రాలను అరవింద్ ఇక్కడ డబ్ చేయిస్తూ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by BMW KUN Exclusive (@bmwkunexclusive_ts_ap) -
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ప్రముఖ నిర్మాత
ప్రముఖ కన్నడ నిర్మాత సౌందర్య జగదీష్ మరణించారు. అయితే ఈయన మృతిపై తలో రకంగా కామెంట్స్ వినిపించడం చర్చనీయాంశంగా మారింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని అనగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) జగదీష్.. మస్త్ మజా మాది, స్నేహితారు తదితర చిత్రాలని నిర్మించారు. అప్పు-పప్పు సినిమాతో తన కొడుకుని హీరోగా పరిచయం చేశాడు. సినిమాల నిర్మాణంతో పాటు ఈయన ఇండస్ట్రీలిస్ట్ కూడా. అలానే బెంగళూరులో ఓ పబ్ కూడా ఉంది. ఆదివారం ఉదయం జగదీష్ ఉరి వేసుకోగా, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు జగదీష్ కి లేవని ఇతడి ఫ్రెండ్ శ్రేయస్ చెప్పారు. కానీ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) -
విజయ్ బాగా డబ్బున్నోడు.. బేబీ నిర్మాత కౌంటర్
హీరో విజయ్ దేవరకొండ.. మధ్యతరగతి కుటుంబం నుంచి పైకి వచ్చినవాడే! ఎన్నో కష్టాలు పడి గొప్ప స్థాయికి ఎదిగాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీస్టార్ రేపు(ఏప్రిల్ 5న) రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు సినిమా తర్వాతే బైక్ ఫుల్ ట్యాంక్ కొట్టించాను.. అప్పటివరకు నా జీవితంలో బండి ఫుల్ ట్యాంకు కొట్టించలేదు అని చెప్పాడు. ఇది చూసిన కొందరు అంత సీన్ లేదు.. నీకు మంచి బ్యాగ్రౌండ్ ఉంది.. నువ్వు మిడిల్ క్లాస్ అంటే నమ్మమంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ట్రోలింగ్పై బేబీ, టాక్సీవాలా చిత్రాల నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) స్పందించాడు. 'ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కంటెంట్ బాగోలేకపోతే సినిమా చూడం.. ఒకవేళ డబ్బులున్నవాడని కంటెంట్ బాగున్నా సినిమా చూడకుండా ఆగిపోము. కాబట్టి అతడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత అతడు శ్రీనగర్లో మాకు దగ్గర్లోనే ఓ చిన్నపాటి ఫ్లాట్లో అద్దెకు ఉన్నాడు. నేను అతడిని ఫస్ట్ టైమ్ అక్కడే కలిశాను. కష్టపడి పైకి వచ్చినవాళ్లకు.. ఆ కష్టాన్ని చెప్పుకోవడంలో ఒక తృప్తి ఉంది. అందుకే అది ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. డబ్బులు సంపాదించాలనే.. నచ్చితే సినిమా చూడు, లేకపోతే మనేయ్. ఎందుకు ఒకరి మీద పడి ఏడవడం సోదరా? వీలుంటే అతడి పదాలను ఇన్స్పిరేషన్గా తీసుకో.. కష్టపడి తనలా ఓ స్థాయికి ఎదుగు. అప్పుడు నీకు ఆ తృప్తి ఏంటో తెలుస్తుంది' అని కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి.. విజయ్ సోదరుడు ఆనంద్ అమెరికా వెళ్లాడుగా.. మరి మధ్యతరగతి వ్యక్తికి అదెలా సాధ్యమని ప్రశ్నించాడు. దీనికి ఎస్కేఎన్ స్పందిస్తూ.. మిడిల్ క్లాస్ కాబట్టే డబ్బులు సంపాదించుకుందామని పోయాడు. కోట్లు ఉంటే ఇక్కడే ఎంజాయ్ చేస్తారు కదా.. ఇప్పుడు అమెరికా, కెనడా పోయే విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లేవారందరికీ కోట్లు ఉన్నాయా? అని ప్రశ్నించాడు. Middle class kabatte dabbulu sampadinchukondam ani poyindu Kotlu unte ikkade enjoy chestaru kadha Ippudu U S U K Canada poye students /job holders andaru crores unnaya — SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 4, 2024 చదవండి: డేరింగ్ స్టంట్స్.. అజిత్ కారు ప్రమాదం వీడియో వైరల్ -
నిర్మాత లైంగిక వేధింపులు.. ఆ విషయంలో సంతోషంగా ఉందన్న నటి!
బాలీవుడ్లో ప్రముఖ రియాలిటీ షో తారక్ మెహతా కా ఊల్టా చష్మా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఈ షోలో రోషన్ దారువాలా కౌర్ సోధి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జెన్నిఫర్ మిస్త్రీ బన్సీవాల్ అర్ధాంతరంగా తప్పుకుంది. ఆ తర్వాత షో నిర్మాత అసిత్ కుమార్ మోడీ లైంగిక వేధింపుల గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసిత్ కుమార్ మోడీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ విజయం సాధించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15న ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడిందని తెలిపింది. అయితే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని పోలీసులను కోరినట్లు ఆమె వెల్లడించారు. నాకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే పరిహారంగా అందించారని తెలిపారు. ఈ కేసులో నాకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.25 నుంచి 30 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అదనంగా మరో రూ.5 లక్షలు కోర్టు జరిమానా విధించినట్లు ఆమె వెల్లడించింది. అయినప్పటికీ ఈ కేసులో తనకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదని జెన్నిఫర్ మిస్త్రీ వాపోయింది. జెన్నిఫర్ మాట్లాడుతూ.." ఈ కేసులో కోర్టు తీర్పు ఇచ్చి 40 రోజులకు పైగా అయింది. ఇంకా నాకు రావాల్సిన మొత్తం పరిహారం రాలేదు. అతన్ని దోషిగా నిరూపించినప్పటికీ.. ముగ్గురు నిందితులకు ఎలాంటి శిక్ష విధించలేదు. సోహిల్ రమణి, జతిన్ బజాజ్లను దోషులుగా చేర్చలేదు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ కేసు తీర్పుతో నేను ఎలాంటి ప్రచారాన్ని కోరుకోవడం లేదు. నాపై జరిగిన వేధింపులను గుర్తించినందుకు సంతోషిస్తున్నా. ఈ కేసులో ప్రస్తుతానికి నాకు సరైన న్యాయం లభించలేదని భావిస్తున్నా" అని చెప్పింది. కోర్టు విధించిన పరిహారం చిన్నదని.. ఇలాంటి నేరాలు ఇతరులు చేసేలా ప్రేరేపించవచ్చని నటి పేర్కొంది. -
తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం.. ప్రారంభించిన టాలీవుడ్ నిర్మాత!
ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్గా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన నిర్మాతగానే కాదు.. సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా పలు సూపర్ హిట్ సినిమాలను పంపిణీచేస్తున్నారు. బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించారు ధీరజ్ మొగిలినేని. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరుపతిలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
అవినీతిలో ‘ఆది’పత్యం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement