-
మోదమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు
పాడేరు,న్యూస్లైన్: మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కురుసా నాగభూషణం, బత్తిన కృష్ణ, సర్పంచ్ కిల్లు వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ఏర్పాట్ల వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను అమ్మవారి ఆల యం నుంచి తోడ్కొని వెళ్లి మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన సతకంపట్టు వద్ద ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఏ రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానిం చడం లేదని స్థానిక భక్తులే ఉత్సవాలకు ముఖ్య అతిథులన్నారు. పట్టణం అంతా విద్యుత్ దీపాలంకరణ ఈ ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణ అని వారు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులతోను సమన్వయం చేశామన్నారు. ఉత్సవాల విజయవంతానికి ఐటీడీఏ కూడా సహకరిస్తుందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజనుల సంప్రదాయ కళా ప్రదర్శనలు కూడా ఉంటాయన్నారు. ఉత్సవాల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాల చివరి రోజైన మంగళవారం అమ్మవారి అనుపు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలను ప్రతి భక్తుడు నెత్తిన పెట్టి మోసే విధంగా అవకాశం కల్పిస్తామని ఈ మేరకు రోప్వే సౌకర్యాన్ని కూడా ఈ ఏడాది వినూత్నంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాలతో పాడేరు పట్టణ వాసులకు అదనంగా గ్యాస్ సిలిండర్ సౌకర్యంతో పాటు అన్ని వీధుల్లోను ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు ఐటీడీఏ పీఓ చర్యలు తీసుకున్నారని, పారిశుద్ధ్య చర్యలు కూడా చేపడతామని చెప్పారు. ఉత్సవాల విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతి నిధులు పలాసి కృష్ణారావు, రొబ్బా నాగభూషణరాజు, బాణం శ్రీనివాసదొర, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, ఎల్.అప్పారావు, కొట్టగుల్లి రాజారావు, తాంగుల రంగారావు, మర్రిచెట్టు రామునాయుడు, సల్లా రామకృష్ణ, రామిరెడ్డి, ఆటో ఈశ్వరరావు, గోపి పాల్గొన్నారు. ఆలయానికి ఉత్సవ శోభ మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి ఉత్సవ శోభ నెలకొంది. ఇటీవల అమ్మవారి విగ్రహానికి కొత్తగా రంగులు వేయడంతో అమ్మవారు మరింత ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవాలతో అమ్మవారి ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో మరింత శోభాయమానంగా భక్తులకు కనువిందు చేస్తుంది. ఉత్సవాలకు రెండు రోజుల ముందుగానే అమ్మవారి ఆలయం దీపాలంకరణతో కళకళలాడుతుంది. -
పెత్తనం కొందరిదేనా?
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్లైన్ : పురాతన కాలం నుంచి బలహీనవర్గాలకు, దళితులకు రాజ్యాధికారం దక్కడం లేదని, రెండుమూడు కులాల వారే పెత్తనం చెలాయిస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్వీయూనివర్సిటీలో మహాజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగిన మహాజన సోషలిస్టు పార్టీ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. రాయలసీమలో ఎస్టీలకు ఒక్క అసెంబ్లీ సీటు కూడా రిజర్వు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రతి రాజకీయ పార్టీ 50 శాతం సీట్లు బలహీనవర్గాలకు కేటాయించాలని సూచించారు. రాయలసీమకు చెందిన రాజకీయనాయకులే సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించి రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సూచించిన మేరకు తాము చిన్న రాష్ట్రాల అంశానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 2001లో ఎమ్మార్పీఎస్ స్థాపించిన సమయంలోనే ఈ తీర్మానం చేసినట్టు వెల్లడించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ, 2009లో టీడీపీలు తమ మ్యానిఫెస్టోలో ప్రత్యేక తెలంగాణ అంశాన్ని చేర్చాయని గుర్తుచేశారు. టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్నాయని గుర్తుచేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ ఆల్మెన్రాజు, ఎంఎస్ఎఫ్ నాయకులు వెంకటస్వామి, బీసీ సంఘం నాయకులు గోవిందు, భాస్కర్యాదవ్, హేమాద్రియాదవ్ పాల్గొన్నారు. నగరంలో బైక్ ర్యాలీ మహాజన సోషలిస్టుపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ నగరంలో బైక్ర్యాలీ నిర్వహించారు. పద్మావతి అతిథిగృహం నుంచి బాలాజీ కాలనీ, ప్రకాశంరోడ్డు, గాంధీరోడ్డు, తిలక్రోడ్డు, భవానీనగర్, రాజన్నపార్కు మీదుగా ఎస్వీయూ వరకు ర్యాలీ సాగింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement