-
సామాన్యురాలు... పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ
‘మా ప్రాంతంలోని పేదల కష్టాలే నన్ను పెద్దలతో తలపడేలా చేస్తున్నాయి’ అంటోంది దాసరి భారతి.కోవిడ్ సమయంలో నర్స్గా పని చేసి ఎందరికో సేవ చేసిన భారతిబాధితులకు న్యాయం జరగాలంటే చట్టం తెలియాలని ఎల్.ఎల్.బి. చదువుతోంది.జోగులాంబ జిల్లా మేడికొండకు చెందిన 26 ఏళ్ల ఈ దళిత యువతినాగర్ కర్నూల్ ΄ార్లమెంట్ స్థానం నుంచి అధికారికంగా పోటీలో ఉంది.‘జనం కోసం గొంతెత్తకుండా ఉండలేక΄ోతున్నాను’ అంటున్న భారతి పరిచయం.‘నేను హైదరాబాద్ అ΄ోలో నర్సింగ్ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ చదివాను. ఎమ్మెస్సీ నర్సింగ్ చేయాలని ఉండేది. నాకు మెరిట్ ఉన్నా సీట్ వచ్చినా కేవలం డబ్బుల్లేక ఒక సంవత్సరం ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత పాండిచ్చేరి జిప్మర్లో ఎమ్మెస్సీ నర్సింగ్ చదివాను. నాలా ఎందరో పేదింటి, దళిత, వెనుకబడ్డ వర్గాల యువతీ యువకులు చదువు కోసం బాధలు పడుతున్నారు. వారిని పట్టించుకునేది ఎవరు? వారి కోసం గొంతెత్తాలని ఎన్నికలలో నిలుచున్నాను’ అంటుంది దాసరి భారతి.26 ఏళ్ల ఈ దళిత అమ్మాయి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ‘విడుదలై చిరుతైగల్ కట్చి’ (వి.సి.కె.) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమెకు ‘టీవీ రిమోట్’ను ఎన్నికల చిహ్నంగా కేటాయించారు. పాండిచ్చేరిలో చదివేటప్పుడు వి.సి.కె. పార్టీ కార్యక్రమాలు గమనించాను. అది దళితుల అభ్యున్నతి కోసం పని చేస్తున్న పార్టీ. ఒక దళిత యువతిగా నేను ఆ పార్టీతో కలిసి పని చేయాలని భావించాను’ అని తెలిపింది భారతి.జోగులాంబ జిల్లా మేడికొండ భారతి ఊరు. తండ్రి దాసరి రాములు కౌలు రైతు. తల్లి పద్మావతి గృహిణి. ‘మా నాన్న చనిపోయాడు. మేము నలుగురం పిల్లలం. చదువుకోవడానికి చాలా బాధలు పడాల్సి వచ్చింది’ అంది భారతి.‘నా బాల్యం నుంచి చూస్తున్నాను. మా ఊరికి ఇప్పటికీ సరైన రోడ్డు లేదు. రోగాలొచ్చినా ఏమొచ్చినా చాలా కష్టం. ఒక నిండు చూలాలు అంబులెన్స్ ఎక్కి రోడ్డు గతుకుల వల్ల దారిలోనే డెలివరీ అయ్యి చని΄ోయిన సంఘటన కళ్లారా చూశాను. నిధులన్నీ ఏమవుతున్నాయి? ఎం.ఎల్.ఏలు, ఎం.పి.లు, మంత్రులు ఏం చేస్తుంటారు? ఎందుకు పరిస్థితులు మార్చరు? కృష్ణ, తుంగభద్రల తీరంలో ఉండేదే మా ్ర΄ాంతం. కాని పశువులు తాగడానికి కూడా చుక్క నీరు ఇప్పుడు లేదు. రాజకీయ చైతన్యం ఉన్న యువత ఈ పరిస్థితిని ప్రశ్నించే వరకు మార్పు రాదు. అందుకే నేను ఎన్నికలలో నిలుచున్నాను’ అంది భారతి.నాగర్ కర్నూల్లో పార్లమెంట్ స్థానానికి ప్రవీణ్ కుమార్ (బి.ఆర్.ఎస్), మల్లు రవి (కాంగ్రెస్), భరత్ కుమార్ (బి.జె.పి) పోటీలో ఉన్నారు. భారతి దగ్గర మందీ మార్బలం లేకపోయినా కేవలం తన ధర్మాగ్రహంతో వీరితో తలపడనుంది.‘కోవిడ్ కాలంలో టిమ్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేశాను. పేదలు సరైన వైద్యం అందక, కార్పొరేట్ ఆస్పత్రులకు పోలేక మరణించారు. నాకు ముందు నుంచి కూడా విద్యార్థి రాజకీయాలన్నా, ఉద్యమాలన్నా ఇష్టం. నా విస్తృతి పెరగాలంటే నర్స్గా ఉంటే సరి΄ోదనిపించింది. అందుకే ఇప్పుడు ఎల్.ఎల్.బి. చదువు తున్నాను. నేను ఎలక్షన్లలో పోటీ చేస్తున్నానని తెలిసి మావాళ్లంతా సంతోషపడుతున్నారు. నాలాంటి వాళ్లు గెలిచి పేదలకు మేలు జరిగినప్పుడే కదా నిజమైన సంతోషం’ అని ముగించింది భారతి. -
ఆ రాష్ట్రంలో.. 1952 తర్వాత 1998లోనే మహిళా ఎంపీ!
ఉత్తరాఖండ్లో ఇంతవరకూ జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉత్తరాఖండ్ పేరుగాంచింది. అయితే రాజకీయాల్లో ఇక్కడ నేటికీ లింగవివక్ష కనిపిస్తూనే ఉంది. 1952లో రాష్ట్రంలోని తెహ్రీ నుంచి ఎన్నికైన కమలేందు మతి షా ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ. 1998లో నైనిటాల్ నుంచి ఎన్నికైన రెండో మహిళా ఎంపీ ఇలా పంత్. ఈ విధంగా చూస్తే రాష్ట్రం నుంచి లోక్సభకు మహిళా ఎంపీ చేరేందుకు 46 ఏళ్లు పట్టింది. 2012లో మాలా రాజ్య లక్ష్మి షా అనే మరో మహిళ ఎంపీ స్థాయికి చేరుకోగలిగారు. ఏడు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్సభలో ప్రాతినిధ్యం దక్కింది. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెహ్రీ నుంచి మాలా రాజ్యలక్ష్మి షా ఎంపీ అయ్యారు. 1952 ఎన్నికల్లో తెహ్రీ గర్వాల్ సీటు నుంచి రాజమాత కమలేందు మతి షా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నాటి రోజుల్లో కాంగ్రెస్కు భారీ మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడి ఎన్నికల్లో కమలేందు మతి షా విజయం సాధించారు. నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ కృష్ణ సింగ్ ఓటమి చవిచూశారు. -
Cash for Query : మరోసారి ‘మహువా మొయిత్రా’ కు ఈడీ నోటీసులు
పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్సభ అభ్యర్ధి, తృణముల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సమన్లు పంపిన ఈడీ.. తాజాగా మరోసారి పంపింది. విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఆమెను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. మహువా మొయిత్రాను ఈడీ అధికారులు నాన్ రెసిడెన్షియల్ ఎక్స్ట్రనల్ (ఎన్ఆర్ఈ), అకౌంట్స్, ఒక దేశం నుంచి మరో దేశానికి చెందిన అకౌంట్లకు నగదు (foreign remittance)చెల్లింపులు, ఇతర లావాదేవీల గురించి ప్రశ్నించనున్నారు. గతంలో రెండు సార్లు గత ఏడాది మహువా మొయిత్రా స్నేహితుడు, న్యాయవాది జై అనంత్ దెహాద్రాయ్ ఆమెపై ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త హీరానందానీకి మహువా తన పార్లమెంట్ పాస్వర్డ్ను ఇచ్చారని అనంత్ ఆరోపించారు. దీనివల్ల హీరానందానీ అవసరమైనప్పుడు నేరుగా పార్లమెంట్లో తనకు కావాల్సిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని అనంత్ అన్నారు. అంతేకాకుండా, డబ్బులు తీసుకొని హీరానందానీ గ్రూప్ తరఫున పార్లమెంట్లో మహువా ప్రశ్నలు అడిగారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మహువా మొయిత్రాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు. కొద్ది రోజులకే ఆమె పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. రూ.2 కోట్ల వరకు తాజాగా, పార్లమెంట్లో ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రశ్నలను అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి మహువా మొయిత్రా రూ.2 కోట్ల నగదు, అలాగే లగ్జరీ ఐటమ్స్ తీసుకున్నారని, ప్రతిఫలంగా ఆమె తన పార్లమెంటు వెబ్సైట్ లాగిన్ వివరాలను దర్శన్ హీరానందానీకి షేర్ చేశారని, ఇదే అంశంపై ఈడీ హీరానందనీని సైతం విచారణ కోసం పిలిపించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, క్యాష్ ఫర్ క్వైరీ ఆరోపణల్ని మోయిత్రా ఖండించారు (కానీ ఆమె వెబ్సైట్ ఆధారాలను పంచుకున్నారని, ఇది ఎంపీలలో సాధారణ పద్ధతి అని వాదించారు). మేలో ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. -
‘లోక్సభ’లో స్వతంత్రులు విజేతలా? పరాజితులా?
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇదిలా ఉండగా కొన్ని పార్టీలలో టిక్కెట్లు ఆశించి, భంగపడినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇటువంటి వ్యవహారం దేశంలో తొలిసారి లోక్సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. మొదటి లోక్సభ ఎన్నికల్లో.. 1951-52లో మొదటి లోక్సభ ఎన్నికలు జరిగాయి. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 37 మంది స్వతంత్ర ఎంపీలు లోక్సభకు ఎన్నికయ్యారు. రెండో లోక్సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య పెరిగింది. 1957లో రెండో లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 42 మంది స్వతంత్ర ఎంపీలు లోక్సభకు ఎన్నికయ్యారు. 1962లో స్వతంత్రుల హవా మూడో లోక్సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య సగానికి పైగా తగ్గింది. 1962లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపీలు అయ్యారు. నాలుగో లోక్సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్య తిరిగి పెరిగింది. 1967లో జరిగిన ఎన్నికల్లో 35 మంది స్వతంత్ర ఎంపీలు ఎన్నికయ్యారు. 1971లో ఐదవ లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో గెలిచిన స్వతంత్రుల సంఖ్య తగ్గింది. ఈ ఎన్నికల్లో 14 మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. ‘ఎమర్జెన్సీ ’ తర్వాత.. దేశంలో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన 1977 లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం తగ్గింది. ఆరో లోక్సభలో కేవలం తొమ్మిది మంది స్వతంత్ర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. ఏడో లోక్సభలో స్వతంత్ర ఎంపీల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. 1980లో తొమ్మిదిమంది స్వతంత్రులు లోక్సభ ఎంపీలు అయ్యారు. స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం 1984లో మెరుగుపడింది. ఎనిమిదో లోక్సభలో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర ఎంపీల సంఖ్య 1989లో స్వల్పంగా తగ్గింది. 10వ లోక్సభకు ఒక్కరే.. తొమ్మిదో లోక్సభలో 12 మంది స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పార్లమెంట్ దిగువ సభకు చేరుకున్నారు. 1991 లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయింది. 10వ లోక్సభకు ఒక స్వతంత్ర ఎంపీ మాత్రమే ఎన్నికయ్యారు. అత్యల్ప సంఖ్యలో స్వతంత్ర ఎంపీలు 1991లో ఎన్నికయ్యారు. 11వ లోక్సభలో పార్లమెంటులో స్వతంత్ర ఎంపీల వాటా మరోసారి పెరిగింది. 1996లో జరిగిన ఎన్నికల్లో తొమ్మదిమంది స్వతంత్రులు లోక్సభ ఎంపీలు అయ్యారు. 14వ, 15వ లోక్సభ ఎన్నికల్లో.. 12వ లోక్సభలో అంటే 1998లో స్వతంత్ర ఎంపీల సంఖ్య ఆరుకి తగ్గింది. 1999లో 13వ లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆరుగురు స్వతంత్రులు పార్లమెంటుకు చేరుకున్నారు. 14వ లోక్సభలో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ లోక్సభ ఎన్నికలు 2004లో జరిగాయి. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీల సంఖ్య తొమ్మది. 3,449 మంది డిపాజిట్లు గల్లంతు 16వ లోక్సభకు 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేవలం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 8,054 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వారిలో 3,461 మంది స్వతంత్రులు. వీరిలో 3,449 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేవలం నలుగురు స్వతంత్రులు మాత్రమే పార్లమెంటుకు చేరుకున్నారు. విజేతల ఓట్లు.. మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ రాణా 36,951 ఓట్ల తేడాతో గెలుపొందారు. అసోంలోని కోక్రాజార్ లోక్సభ స్థానం నుంచి 37,786 ఓట్లతో విజయం సాధించి నబ కుమార్ సరానియా పార్లమెంటుకు చేరుకున్నారు. దాద్రా అండ్ నగర్ హవేలీ స్థానం నుంచి డెల్కర్ మోహన్భాయ్ సంజీభాయ్ 9,001 ఓట్లతో గెలుపొందారు. కర్ణాటకలోని మాండ్య స్థానం నుంచి సుమలత అంబరీష్ 1,25,876 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. -
Kolkata: మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్కతా: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలడిగిన కేసులో మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ శనివారం ఉదయం సోదాలు ప్రారంభించింది. కోల్కతాలోని మహువా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలోనూ సీబీఐ తనిఖీలు చేస్తోంది. ఇటీవలే ఈ కేసులో మహువాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. క్యాష్ ఫర్ క్వెయిరీ కేసు దర్యాప్తులో భాగంగానే సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన మహువా లోక్సభలో ప్రశ్నలడిగేందుకుగాను వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన లోక్సభ ఎథిక్స్ కమిటీ ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా స్పీకర్ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సుదీర్ఘ ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్పాల్ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై మహువా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి.. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement