-
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ పాకిస్తాన్లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.‘పాకిస్తాన్లో రాహుల్గాంధీ చాలా పాపులర్. ఒకవేళ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్ను పాకిస్థాన్లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. రాహుల్గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కాకుండా రాయ్బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
PM Narendra Modi: యువరాజు కోసం పాక్ ఆరాటం
ఆనంద్: విపక్ష కాంగ్రెస్ను పాకిస్తాన్కు శిష్యరికం చేసే పార్టీగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ)ని మన దేశ తదుపరి ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందని అన్నారు. ఇండియాలో బలహీన, అవినీతి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మన శత్రువులు కోరుకుంటున్నారని ఆరోపించారు. ఇండియాలో కాంగ్రెస్ పతనమవుతుండడం చూసి పాకిస్తాన్ నాయకులు కన్నీరు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బాగు కోసం వారు ప్రారి్థస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ముమ్మాటికీ పాకిస్తాన్ను అనుసరించే పారీ్టయేనని పేర్కొన్నారు. రాహుల్ గాం«దీని ప్రశంసిస్తూ పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సేన్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను మోదీ ప్రస్తావించారు. పాకిస్తాన్, కాంగ్రెస్ మధ్య అనుబంధం ఇప్పుడు పూర్తిగా బయటపడిందని చెప్పారు. భారత్లో అత్యంత బలమైన మోదీ ప్రభుత్వం ఉన్నంతకాలం పాకిస్తాన్ ఆటలు సాగవని తేలి్చచెప్పారు. తాము ఎవరికీ తలవంచబోమని స్పష్టం చేశారు. తమ పాలనలో పాకిస్తాన్ ఉగ్రవాద టైర్లు పంక్చర్ అయ్యాయని అన్నారు. గతంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన దేశం ఇప్పుడు గోధుమ పిండి కూడా దిగుమతి చేసుకోలేక తిప్పలు పడుతోందని, గతంలో బాంబులు విసిరిన చేతులు నేడు భిక్షపాత్ర పట్టుకొని యాచిస్తున్నాయని పేర్కొన్నారు. గురువారం గుజరాత్లోని ఆనంద్, సురేంద్రనగర్, జునాగఢ్, జామ్నగర్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కట్టబెట్టడానికి వీలుగా రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ కుట్ర పన్నిందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఓటు జిహాద్.. సిగ్గుచేటు ‘‘భారత్ గ్లోబల్ పవర్గా ఎదుగుతోంది. ప్రపంచదేశాలు భారత్ను విశ్వబంధుగా పరిగణిస్తున్నాయి. రెండు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించే సత్తా భారత్కు ఉంది. అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి ముస్లింలకు దొడ్డిదారిన రిజర్వేషన్లు ఇవ్వబోమంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి పక్షాలు దేశ ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలి. రాజ్యాంగం ప్రతిని నెత్తిన పెట్టుకొని డ్యాన్సులు చేయడం పిచి్చపని. కాంగ్రెస్ యువరాజు ఇలాంటి పనులు మానుకోవాలి. రాజ్యాంగం కోసం ఎలా జీవించాలో, ఎలా మరణించాలో తెలుసుకోవాలంటే నా దగ్గరికి రండి.. నేరి్పస్తా. మనం ఇప్పటిదాకా లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ గురించి విన్నాం. ఇప్పుడు విపక్ష ఇండియా కూటమి కొత్తగా ఓటు జిహాద్ అంటోంది. మతం ఆధారంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటున్నారు. ఇలాంటి పిలుపులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కించపర్చడమే. మదర్సాల్లో చదువుకున్నవారు కాదు, ఉన్నత చదువులు చదివినవారు ఓటు జిహాద్ అంటుండడం సిగ్గుచేటు. దీనిపై కాంగ్రెస్ ఎందుకు నోరుమెదపడం లేదు? ప్రతిపక్ష కూటమి ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉన్నాయి. కాంగ్రెస్ చిమ్ముతున్న విషం.. కులం పేరిట, మతం పేరిట సమాజాన్ని ముక్కలు చేసి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ కుతంత్రాలకు పాల్పడుతోంది. బుజ్జగింపు విధానాల ద్వారా ఓటు బ్యాంక్ను సంఘటితం చేసుకోవాలని చూస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను ఎన్నికల అజెండాగా మార్చాలని ప్రయతి్నస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు చెందిన 27 శాతం కోటాను రాత్రికి రాత్రే లూటీ చేసింది. ముస్లింలకు కట్టబెట్టింది. రాజ్యాంగాన్ని రాసిన ముసాయిదా కమిటీలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులెవరూ లేరు. అంబేడ్కర్ లాంటి మేధావులు రాజ్యాంగాన్ని రాశారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగాన్ని లెక్కచేయడం లేదు. కాంగ్రెస్ చిమ్ముతున్న విషం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో నాకు అర్థం కావడంలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఉగ్రవాదులకు మద్దతిచ్చారు. కశీ్మర్లో వేర్పాటువాదుల ఎదుట సిగ్గులేకుండా మోకరిల్లారు. ఢిల్లీ బాట్లాహౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతమైతే ఒక మేడమ్(సోనియా గాం«దీ) బాధతో కన్నీరు ఆపులేకపోయారట! మన విశ్వాసాన్ని ఎగతాళి చేయడానికి కాంగ్రెస్ నేతలు వెనుకాడడం లేదు. సందర్భం వచి్చనప్పుడులా మన విశ్వాసాన్ని కించపరుస్తున్నారు. అదే ధైర్యం ఇతర మతాల విషయంలో ఆ నాయకులకు ఉందా? స్వార్థం కోసం, ఓట్ల కోసం సమాజాన్ని విచి్ఛన్నం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదు. ‘మిషన్’ పూర్తిచేయాలన్నదే లక్ష్యం ఈ ఎన్నికలను నా వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకొనే ఎన్నికలుగా నేను భావించడం లేదు. నా ఆకాంక్షలను 2014లోనే ప్రజలు నెరవేర్చారు. 2024 ఎన్నికల తర్వాత నా ‘మిషన్’ను పూర్తి చేయాలన్నదే లక్ష్యం. కేంద్రంలో బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడం కేవలం మన దేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా అవసరం. శ్రీరాముడిని శివుడు ఓడించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపునిస్తున్నారు. ఇదెక్కడి వైపరీత్యం? మొఘల్ రాజులు అదే ఆలోచనా ధోరణి కలిగి ఉండేవారు. అయోధ్యలో రామ మందిరాన్ని, సోమనాథ్లో ఆలయాన్ని మొఘల్ రాజులు కూల్చేశారు. దేవుళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టి, హిందువులను కులాల వారీగా విడదీయాలన్నదే కాంగ్రెస్ కుతంత్రం. అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని, ట్రిపుల్ తలాక్ను మళ్లీ తీసుకొస్తామని చెప్పే ధైర్యం కాంగ్రెస్కు ఉందా? దుష్ట కాంగ్రెస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. -
గెలవలేని యుద్ధం చేసిన పాక్
కార్గిల్ యుద్ధం జరిగి పాతికేళ్లవుతోంది. మే 3న పాక్ చొరబాట్లను మొదటిసారి కనుగొన్న తర్వాత, జూలై 26న భారత్ తన విజయాన్ని ప్రకటించ డానికి ముందు దాదాపు మూడు నెలలు నెత్తుటి యుద్ధం కొనసాగింది. 18,000 అడుగుల ఎత్తులో, ఎన్నో సవాళ్లతో కూడిన ఈ ప్రాంతంలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది. భారత్కు వ్యతిరేకంగా పాక్ సైనిక పంథాను అనుసరించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయటపెట్టింది. స్థాయిలోనూ, విస్తృతిలోనూ పరిమితమే అయినప్పటికీ, కార్గిల్ రెండు దేశాలలో లోతైన విశ్లేషణను ప్రేరేపించింది.1999 ఫిబ్రవరి 20న, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్లో చరిత్రాత్మక దౌత్య పర్యటనకు బయలుదేరారు. మరుసటి రోజు, ఇద్దరు ప్రధానులు లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, తమ ప్రజల పురోగతి, శ్రేయస్సు గురించిన భాగస్వామ్య దార్శనికతను ఇరువురు నేతలూ ప్రతిబింబించారు.ఉద్రిక్తతలను పెంచిన 1998 అణు పరీక్షల ఛాయల నుండి ఉద్భవించిన ఈ ప్రకటన, సరిహద్దుకు ఇరువైపులా చక్కటి ప్రశంసలు పొందింది. అయితే విచారకరంగా, ఈ ఆశావాదం భ్రమగా మారింది. వాఘా సరిహద్దులో వాజ్పేయికి షరీఫ్ అభివాదం చేస్తున్నప్పుడే, పాకిస్తాన్ సైనికులు కార్గిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ను దాటి ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన టోలోలింగ్, టైగర్ హిల్ వంటి పర్వత శిఖరాల్లో కందకాలు తవ్వుతున్నారు.18,000 అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ భౌగోళికపరంగా అసాధారణమైన సవాళ్లతో కూడినది. అటువంటి విపరీతమైన పరిస్థి తులలో యుద్ధం అనేది సైన్యం లాఘవానికి నిజమైన పరీక్ష. అయితే అధికారులు, సైనికులు మానవాతీత దృఢత్వాన్ని ప్రదర్శించడం, దేశం కోసం ప్రాణాలు ధారపోయడానికి కూడా సిద్ధమైనందునే విజయం సాధ్యపడింది.మే 3న పాక్ చొరబాట్లను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత, జూలై 26న భారతదేశం విజయాన్ని ప్రకటించడానికి ముందు దాదాపు మూడు నెలల కాలం కార్గిల్లో నెత్తుటి యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్ సైన్యం ఈ పోరాటంలో తన ప్రమేయాన్ని నిరాకరించింది, నేలకొరిగిన తన సైనికులను గుర్తించడానికి నిరాకరించింది. ఇది వారి త్యాగానికి అంతిమ అవమానం అని చెప్పాలి.స్థాయిలోనూ, భౌగోళిక విస్తృతిలోనూ పరిమితమే అయినప్ప టికీ, కార్గిల్ యుద్ధం రెండు దేశాలలో లోతైన వ్యూహాత్మక విశ్లేషణను ప్రేరేపించింది. వేసుకున్న లెక్కలు తప్పడంపై పాక్లోనూ; నిఘా వైఫల్యం కారణంగా చొరబాట్లను గుర్తించలేక పోవడంతో సహా, జాతీయ భద్రతా అంతరాలపై భారత్లోనూ పెద్ద చర్చ జరిగింది.యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత, పాకిస్తాన్ దురాక్ర మణకు దారితీసిన సంఘటనలను సమీక్షించడానికీ, సాయుధ చొర బాట్లకు వ్యతిరేకంగా జాతీయ భద్రతను కాపాడే చర్యలను సిఫార్సు చేయడానికీ భారత ప్రభుత్వం కార్గిల్ సమీక్షా కమిటీ (కేఆర్సీ)ని ఏర్పాటు చేసింది. రాజకీయ, అధికార, సైనిక, నిఘా సంస్థలు యథా తథ స్థితిపై స్వార్థ ఆసక్తిని పెంచుకున్నాయని ఈ కమిటీ పేర్కొంది. కార్గిల్ అనుభవం, కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, అణుబాంబుతో కూడిన భద్రతా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని జాతీయ భద్రతా వ్యవస్థపై సమగ్ర సమీక్ష అవసరమని కమిటీ నొక్కి చెప్పింది.కేఆర్సీని అనుసరించి వచ్చిన మంత్రుల బృందం నివేదిక, జాతీయ భద్రతా సమస్యలపై స్వతంత్ర భారతదేశంలో చేపట్టిన అత్యంత సమగ్ర పరిశీలన అని చెప్పవచ్చు. గూఢచార యంత్రాంగం, అంతర్గత భద్రత, సరిహద్దు నిర్వహణ. రక్షణ నిర్వహణను అంచనా వేయడానికి నాలుగు టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేశారు.ఈ రెండు నివేదికలు జాతీయ భద్రతా నిర్వహణలో అనేక మార్పులకు దారితీశాయి. కేంద్రీకృత కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ను నిర్వహించడానికి 2004లో జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థను ఏర్పర్చారు. సైన్యం నిర్దిష్ట గూఢచార అవసరాలను తీర్చడానికి రక్షణ నిఘా సంస్థ ఏర్పడింది. మెరుగైన ఇంటర్–ఏజెన్సీ సమాచారం భాగస్వామ్యాన్ని, సమన్వయాన్ని పెంపొందించడానికి బహుళ ఏజెన్సీ కేంద్రం కూడా ఏర్పాటయింది. రక్షణ వ్యవస్థ కొంత పునర్ని ర్మాణానికి గురైంది. ఇందులో సమీకృత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయడం, వ్యూహాత్మక బలగాలు, అండమాన్ నికోబార్ కమాండ్ల స్థాపన, త్రివిధ బలగాలకు ఆర్థిక, పరిపాలనా అధికారాలు పంపిణీ చేయడం వంటివి ఉన్నాయి. మంత్రుల బృందం సిఫార్సు చేసిన విధంగా 2020లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం జరిగింది.కొన్ని సిఫార్సులు పాక్షికంగా మాత్రమే అమలైనాయి. ‘ఒకే సరి హద్దులో అనేక బలగాలు ఉండటం కూడా బలగాల జవాబు దారీతనం లోపానికి దారితీసిం’దని మంత్రుల బృందం నివేదిక పేర్కొంది. ‘జవాబుదారీతనాన్ని తేవడానికి, సరిహద్దు వద్ద బలగాల మోహరింపును పరిగణనలోకి తీసుకునేటప్పుడు ‘ఒక సరిహద్దు, ఒక బలగం’ సూత్రాన్ని అవలంబించవచ్చు’ అని సూచించింది. ఈ సూత్రాన్ని ఇంకా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర వర్తింపజేయాల్సే ఉంది. ఇక్కడ భారత సైన్యం, ఇండో–టిబెటన్ సరిహద్దు పోలీసులు వేర్వేరు కమాండ్ ఏర్పాట్లలో మోహరించారు.జాతీయ భద్రతా సిద్ధాంతం లేకపోవడం, ఆర్థిక సంవత్సరానికి మించి సైన్యానికి నిధుల నిబద్ధత లేకపోవడం వంటి బలహీనతలను మంత్రుల బృందం ఎత్తి చూపింది. పరిష్కరించాల్సిన ఇతర సమస్యలు ఏవంటే, త్రివిధ బలగాల హెడ్క్వార్టర్స్ను ప్రభుత్వంలో మరింతగా ఏకీకృతం చేయడం, సాయుధ దళాలు ఉమ్మడిగా ఉండటం. ఇప్పటికీ ఈ లోటుపాట్లు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ వైపు కూడా, కార్గిల్ పరాజయంపై చాలా బహిరంగ చర్చ జరిగింది. ఆ యుద్ధం పౌర–సైనిక సంబంధాల వక్ర స్వభావాన్ని బహిర్గతం చేసింది. సైనిక లక్ష్యాలను రాజకీయ, దౌత్యపరమైన పరిశీలనలు లేకుండా రూపొందించారు. నసీమ్ జెహ్రా రాసిన ‘ఫ్రమ్ కార్గిల్ టు ది కూ’ పుస్తకంలో, మే 17న సైన్యం అప్పటి ప్రధాని షరీఫ్కు కార్గిల్ సైనిక చర్యపై తొలి వివరణాత్మక సమాచారాన్ని అందించిందని రాశారు. ఆ సమయానికి, సైనికులు అప్పటికే నియంత్రణ రేఖ వెంబడి స్థానాలను ఆక్రమించారు.యుద్ధం తరువాత, దానికి పన్నాగం పన్నిన జనరల్స్ పాత్ర పరిశీలనలోకి రావాలి. దీనికి బదులుగా, పాకిస్తాన్ సైన్యం రాజకీయ నాయకత్వానికి నిందను ఆపాదించడానికి ప్రయత్నించింది. పెరుగుతున్న ఈ అపనమ్మకం చివరకు 1999 అక్టోబర్లో షరీఫ్ను అధికారం నుండి తొలగించిన సైనిక కుట్రకు దారితీసింది.భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సైనిక పంథాను ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభం లేదని కార్గిల్ విధ్వంసం గట్టిగా బయట పెట్టింది. భారత్తో ఉద్రిక్తతలను తగ్గించడానికి మార్గాలను కనుగొనే బదులు, పాకిస్తాన్ సైన్యం వెనక్కితగ్గి ఉగ్రవాదులను ఉపయోగించింది. యుద్ధం తర్వాత జమ్మూకశ్మీర్లో హింస పెరిగింది. కశ్మీర్పై మక్కువ పెంచుకోవడం మానుకోవాలనీ, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై పాకిస్తాన్ దృష్టి పెట్టాలనీ పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశం తన పరిమితులు, ప్రాధాన్యతల గురించి నిర్దాక్షిణ్యంగా వాస్తవికంగా మారాలని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త షాహిద్ అమీన్ రాశారు. ఏమైనప్పటికీ, పాకిస్తాన్ను గెలవలేని సంఘర్షణలోకి నెట్టిన ప్రధాన సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదు. సైన్యం ఇప్ప టికీ దేశ పగ్గాలను నియంత్రిస్తోంది. కశ్మీర్పై వాగాడంబరం కొనసాగు తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పైగా, ఉగ్రవాద సంస్థ లకు పాక్ ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది.నేడు, భారతదేశం చాలా శక్తిమంతమైన దేశం. ఇప్పుడు కార్గిల్ తరహా ఘటన అసంభవంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 1999 సంఘర్షణ పాకిస్తాన్ రాజ్యయంత్రాంగపు నిర్లక్ష్య స్థాయిని వెల్లడి చేసింది. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు ఆ ముద్రను తొలగించ డానికి పెద్దగా అనుకూలించవు.లెఫ్ట్నెంట్ జనరల్ డీఎస్ హుడా (రిటైర్డ్) వ్యాసకర్త మాజీ నార్తర్న్ ఆర్మీ కమాండర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరిగే గొప్ప ఘట్టం. అది అందరికి ఓ మర్చిపోని గొప్ప మధురానుభూతి. అలాంటి గొప్ప క్షణాన్ని పదిలంగా ఉంచుకునేలా కొందరూ బహుమతులు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓ వరుడు అలానే ఓ బహుమతిని వధువకి ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూసిన వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోయారు. చెప్పాలంటే అది ఊహకే అందని బహుతి అది. ఇంతకీ ఆ వధువుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..ఈ అరుదైన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. పెండ్లి రోజున పాకిస్తానీ వరుడు తన కాబోయే భార్యకు ఓ విచిత్రమైన గిఫ్ట్ని అందజేశాడు. ఆమె ఆనందంగా ఆ గిప్ట్ ఏంటని తెరిచి చూసి ఒక్కసారిగి నివ్వెరపోయింది. అది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో. తాను ఊహించని ఆ బహుమతిని చూసి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఫోటోలకి ఆనందంగా ఫోచ్చింది. ఆ వేదిక వద్ద ఉన్న అతిథులు సైతం ఆ ఫోటో ఫ్రైమ్ని చూసి ఆశ్చర్యపోతు వారిపై పూల వర్షం కురిపించిగా..ఆ వధువరులిద్దరు ఆ ఫోటో ప్రేమ్ని కలిసి పట్టుకుని ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసి నెటిజన్లు విమర్శలు కురిపించగా, మరికొంందరూ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ విడిపించేందుకు పాక్లోని కొందరు ప్రజలు చేస్తున్న ఎత్తుగడ అని కామెంట్లు చేశారు. కాగా, 2018 నుంచి 2022 వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు గానూ అతనికి, ఇమ్రాన్ భార్యకు 14 సంవత్సరాల జైలు శిక్షతో సహా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Becoming a common occurrence now. How long before they put a ban on this? pic.twitter.com/c0BJHjTdkQ— Mahvish- (@halfbakedtruths) April 30, 2024 (చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
రాహుల్ను ప్రధానిని చేసేందుకు పాక్ నేతల ఆరాటం: ప్రధాని మోదీ
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ, అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల వర్షం కురిపించారు. రాహుల్ ప్రధాని కానున్నారంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. వారిద్దరి (కాంగ్రెస్, పాకిస్థాన్) బంధం బహిర్గతమయ్యాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ యువరాజును ప్రధాని చేయడానికి పాక్ నేతలు ఆరాటపడుతున్నారని మండిపడ్డారుగుజరాత్లోని ఆనంద్లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి రాహుల్ను ప్రశంసించండపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ రోజురోజుకీ బలహీనపడుతోందన్నారు. హస్తం పట్టు కోల్పోతుండటంతో పాకిస్థాన్ ఏడేస్తోందని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, కాంగ్రెస్ మధ్య భాగస్వామ్యన్ని బీజేపీ బహిర్గతం చేసిందని తెలిపారు.‘కాంగ్రెస్ దేశంలో బహీనంగా మారుతోంది. మైక్రోస్కోప్లో వెతికినా కనిపించని పరిస్థితి వచ్చింది. కానీ కాంగ్రెస్ కథ కంచికి చేరుతుంటే పాకిస్థాన్ ఏడుస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని పాక్ నాయకులు తహతహలాడుతున్నారు. ఆ పార్టీకి పాక్కు అభిమాని అని మనందరికీ తెలుసు. వారి భాగస్వామ్యం బయటపడింది.భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారు. 26/11 ముంబయి దాడుల నాటి ప్రభుత్వం, 2014కు ముందున్న సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారు. అందుకే కాంగ్రెస్ కోసం పాక్ నేతలు ప్రార్థిస్తున్నారు’ అంటూ మోదీ మండిపడ్డారు. కాగా గుజరాత్లో 26 ఎంపీ స్థానాలకు లోక్సభ ఎన్నికలు మూడో ఫేజ్లో మే 7న జరగనున్నాయి.ఇదిలా ఉండగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఫవాద్ హుస్సేన్ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో రాహుల్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రసంగించిన వీడియోను షేర్ చేసి.. ‘రాహుల్ ఆన్ ఫైర్’ అని రాసుకొచ్చారు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement