-
22 మంది బిలియనీర్లయ్యారు
చాయ్బాసా/గుమ్లా: నరేంద్ర మోదీ తన పదేళ్లపాలనలో 22 మందిని బిలియనీర్లను చేస్తే విపక్షాల ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కోట్లాదిమందిని లక్షాధికారులుగా మారుస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్లోని చాయ్బాసా, గుమ్లాల్లో చేపట్టిన ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘ రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో తమ ప్రాణాలను త్యాగంచేసేందుకైనా విపక్షాల ‘ఇండియా’ కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారు.అదానీ, అంబానీ వంటి వారి కోసం పనిచేసే మోదీ గిరిజనుల అటవీభూములను 14–15 మంది పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలనుకుంటున్నారు. పదేళ్లలో ఆయన 22 మందిని కుబేరులుగా మార్చారు. గిరిజనులను చిన్నాచితకా పనులు చేసుకునే వారిగా బీజేపీ పరిగణించింది. మీ వాళ్లు వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులుగా ఎదగాలని బీజేపీ ఏనాడూ కోరుకోలేదు. అడవుల్ని పారిశ్రామికవేత్తలను ఇవ్వడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. దేశంలో గిరిజనుల జనాభా దాదాపు 8 శాతం. కానీ కేంద్రంలో అత్యున్నతమైన పదవుల్లో ఉన్న 90 మంది సీనియర్ ఐఏఎస్లలో కేవలం ఒక్కరే గిరిజన వ్యక్తి. ఇప్పుడు ఆయనను కూడా అప్రాధాన్య పదవికి పరిమితం చేశారు’’ అని రాహుల్ అన్నారు. అప్రెంటిస్షిప్.. నెలకు రూ.8,500‘‘మేం అధికారంలోకి వస్తే గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఉన్న నిరుద్యోగులకు అప్రెంటిస్షిప్ ద్వారా అవకాశాలు కల్పించి నెలకు రూ.8,500 వేతనం అందజేస్తాం. పేద మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున మొత్తంగా ఏటా రూ.1 లక్ష అందిస్తాం. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను రద్దుచేస్తాం. ఆశా, అంగన్వాడీలకు అందే కేంద్రవాటాను రెట్టింపు చేస్తాం’’ అని అన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, గిరిజన నేత హేమంత్ సోరెన్ను అన్యాయంగా అరెస్ట్చేశారని ప్రస్తావించగానే కార్యకర్తలు ‘జైలు తాళాలు బద్దలుకొట్టుకుని సోరెన్ బయటికొస్తారు’ అని నినాదాలు చేశారు. జీఎస్టీ చట్టాన్ని సవరిస్తాం‘‘సైన్యంలో అమలవుతున్న వివాదాస్పద అగ్నివీర్ పథకాన్ని సైన్యం తీసుకురాలేదు. ప్రధాని మోదీ సొంత నిర్ణయమిది. సైన్యంలో అమరులైన వారందరికీ సమాన గౌరవం దక్కాలి. గౌరవమర్యాదలకుతోడు పెన్షన్ అందేలా చూస్తాం. వివాదాస్పద అగ్నివీర్ పథకాన్ని రద్దుచేస్తాం. పేదలకు భారంగా మారిన జీఎస్టీ విధానంలో మార్పులు తెస్తాం. ఐదు పన్ను శ్లాబులకు బదులు ఒక్కటే కనిష్ట శ్లాబును ప్రవేశపెడతాం. దీంతో పేదల నెత్తిన పన్నుభారం తగ్గుతుంది. వస్తుసేవలపన్ను చట్టంలో తగు సవరణలు తెస్తాం. జార్ఖండ్లో ఆదివాసీలు, గిరిజనులు పాటించే మతవిశ్వాసాలను అనుగుణంగా విడిగా సర్నా స్మృతిని తీసుకొస్తాం’’ అని అన్నారు. -
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
ఒడిశాలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశాపై దృష్టి సారించారు. మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోదీ ఇటీవలే బెర్హంపూర్, నబరంగ్పూర్ లోక్సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మే 13న ఒడిశాలో మొదటి రౌండ్ ఎన్నికలకు ముందు కమలం నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు.రాష్ట్ర బీజేపీ విశ్వసనీయ సమాచారం మేరకు మే 10న మోదీ భువనేశ్వర్లో రోడ్షో, మే 11న బొలంగీర్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 8న బరంగ్పూర్, కోరాపుట్లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు హైవే ప్రాజెక్టులు, ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆవశ్యకత వంటి అంశాలను హైలైట్ చేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. మరోవైపు ఒడిశా అధికార బీజేడీ మాత్రం సీఎం పట్నాయక్ ఆయన సన్నిహితుడు పాండియన్ ద్వయం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం మే 13 నుంచి జూన్ మధ్య నాలుగు సార్లు సుడిగాలు పర్యటనలు చేయనున్నారు. -
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
భోపాల్: బీజేపీకి 400 సీట్లు ఎందుకు రావాలనేదానిపై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ తిరిగి తీసుకురాకుండా ఉండాలంటే, అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం పడకుండా ఉండటానికి బీజేపీకి ఈ ఎన్నికల్లో 400 సీట్లు రావాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నట్లుగా రాజ్యాంగాన్ని మార్చడానికి తమకు 400 సీట్లు కావాలని అడగడం లేదన్నారు.మధ్యప్రదేశ్లోని థార్లో మంగళవారం(మే7)జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. పార్లమెంట్లో తమకు ఇప్పటికే 400 సీట్లు ఉండటం వల్లే ఆర్టికల్ 370ని రద్దు చేయగలిగామన్నారు. మొదటి దశ లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఓడిపోయాయని, రెండవ దశలో అవి ఏకంగా నామరూపాలు లేకుండా పోయాయన్నారు. మూడవ దశలో మిగిలిందేమైనా ఉంటే తుడిచిపెట్టుకుపోయిందని మోదీ ఎద్దేవా చేశారు. -
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
ఢిల్లీ: భారతదేశంలో రాజకీయ వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఏప్రిల్ 22న రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ చేసిన 'చొరబాటుదారుల' వ్యాఖ్యపై.. ఇటు బీజేపీ, అటు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎట్టకేలకు దీనిపైన ప్రధాని ఓ స్పష్టమైన వివరణ ఇచ్చారు.తాను ముస్లింలకు లేదా ఇస్లాంకు వ్యతిరేకం కాదని, ఆత్మపరిశీలన చేసుకోవాలని, భవిష్యత్తు గురించి ఆలోచించాలని ముస్లిం సమాజాన్ని ప్రధాని మోదీ కోరారు. దీనికి సంబంధించిన వీడియోను మోదీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.ఈ వీడియోలో.. మేము ముస్లిం లేదా ఇస్లాంకు వ్యతిరేకం కాదు. అది మా పని కాదు. ముస్లిం సమాజం ప్రతిదీ అర్థం చేసుకుంటుంది. ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని ముగించినప్పుడు, ఆయుష్మాన్ కార్డు ఇచ్చినప్పుడు లేదా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు, ముస్లిం సోదరీమణులు మమ్మల్ని నిజమైన మనుషులుగా భావించారు. మేము ఎవరిమీదా వివక్ష చూపమని మోదీ స్పష్టం చేశారు.ముస్లిం సమాజం, వారి విద్యావంతులైన సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలని మోదీ కోరారు. దేశం ముందుకు సాగుతోంది. మీ సంఘం వెనుకబడి ఉంటే, దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందారా? అని మోదీ అన్నారు. ఎవరిని అధికారంలో పెట్టాలి, ఎవరిని తొలగించాలి అని ఆలోచిస్తూ.. మీరు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం మారుతోంది. మీరు కూడా మారాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.భవిష్యత్తు గురించి ఆలోచించు. భయాందోళనతో కూడిన వాతావరణంలో ఏ సమాజమూ బానిస జీవితాన్ని గడపాలని నేను కోరుకోవడం లేదుని ముస్లిం సమాజాన్ని ప్రధాని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, దానిని అగౌరవపరిచే వారికి ఏమీ మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు.पहली बार, मैं मुस्लिम समुदाय से आत्ममंथन करने को कह रहा हूं। आप यह सोचते रहेंगे कि सत्ता में किसे बिठाएंगे और किसे उतारेंगे, तो उसमें आप अपने बच्चों का भविष्य ही खराब करेंगे। pic.twitter.com/cOW6v7svAP— Narendra Modi (@narendramodi) May 7, 2024 -
చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉంది: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చిందని, దానిని తాము అడ్డుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలని కోరారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన..ఎన్నికలు అయిన వెంటనే..లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స. చంద్రబాబుది మనిషి పుట్టుకేనా? ఆయన పేరెత్తడానికే అసహ్యంగా ఉందన్నారు. ఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలనిసూచించారు. సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరని ప్రశ్నించారు. రియింబర్స్మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరని నిలదీశారు. వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలని తెలిపారు. పింఛను లబ్ధిదారులు వారికి కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టాలని, 15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. భవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలకు మంత్రి బొత్సనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. రైల్వేజోన్పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ, టీడపీ, జనసేన తోడు దొంగలు ఎద్దేవా చేశారు. ఒకరు తానా అంటే ఇంకొకరు తందనా అంటున్నారని సెటైర్లు వేశారు. ప్రధాని మోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదని అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి..దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదని అన్నారు మంత్రి బొత్స. తన రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోడీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. బీజేపీ ఏపీలో రాదని, బంగాళాఖాతంలో వస్తుందని చురకలంటించారు. కేంద్రంలో తమ పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలని అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement