-
బాలయ్య.. ఇదేం బాలేదయ్యా..!
కంచరపాలెం: అసలే నందమూరి నటసింహం..ఆయన సభకు జనం లేకపోతే టీడీపీ స్థానిక నేతలకు దబిడి దిబిడే. కాళ్లోవేళ్లో పట్టుకుని మనిషికి రూ.200 ఇచ్చి మరీ టీడీపీ నేతలు జనసమీకరణ చేశారు. అయితే బాలయ్య తనమార్కు డైలాగ్లతో ప్రజలను విసిగించాడు. మరీ ఆనాడు...అంటూ ప్రారంభించి తలాతోకలేని మాటలతో విసుగుతెప్పించాడు. కంచరపాలెం మెట్టు ప్రధాన రహదారిపై శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ 5.45 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..రాత్రి 7.20 గంటలకు బాలకృష్ణ రావడంతో జనం రోడ్లపై నిలబడలేక ఊసూరుమన్నారు. మైక్ అందుకున్న బాలయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బదులు సీఎం జీవన్ అంటూ నోరుతిరగని పదాలతో జనాన్ని అయోమయంలో పడేశాడు. స్థానిక టీడీపీ, బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా తన తండ్రి ఎనీ్టఆర్ సేవల గురించి చెప్పుకున్నాడు. చంద్రబాబు కోసం అంతంత మాత్రమే మాట్లాడగా.. ఇక పవన్ కల్యాణ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అర్థం కాని మాటలు, సినీ డైలాగ్లతో బాలకృష్ణ బోర్ కొట్టించాడు. ఐటీఐ కూడలిలో బాలకృష్ణకు పూలదండ వేసేందుకు భారీ క్రేన్ను టీడీపీ నాయకులు అడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభా వేదిక వద్ద టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార రథాలపై మహిళలు సినీ గీతాలకు డ్యాన్స్ చేస్తున్నా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. బీఆర్టీఎస్ రోడ్డులో కార్యకర్తలు అడ్డంగా ఉండటంతో అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. -
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
‘అన్యాయం జరిగితే అరగంట లేటుగా వస్తానేమో.. కానీ ఆడపిల్లకు ఆపద వస్తే అర నిమిషం కూడా ఆలస్యం చేయను’– ఇది వెండితెరపై వీర లెవల్ డైలాగ్ కట్ చేస్తే.. ఆడది కనిపిస్తే ‘ముద్దు’ అయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి – ఇది రియల్ లైఫ్లో ముసుగు తొలగించిన మన నాయకుడి ముతక డైలాగ్ ‘నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది’రాజకీయాల్లో మాత్రం తనదాకా ఎందుకనుకున్నారేమో.. ప్రజలను వణికించడానికి నియోజకవర్గంలో పీఏలకే పెత్తనాన్ని అప్పగించేశారు. సాక్షి టాస్క్ఫోర్స్: సినిమాల్లో వీర లెవల్ డైలాగులు పలికే ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మాత్రం ఫెయి ల్యూర్ నేతగా మిగిలిపోయారు. అభివృద్ధి, ప్రతిపక్షంపైనా భారీ సంభాషణలు పలికే ఆయన ప్రజల సమస్యలు తీర్చడంలో జీరోగా మారారు. సెల్యూలాయిడ్పై తన నటనతో ఈలలు, చప్పట్లు కొట్టించుకునే ఆయన ప్రజా జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించి అభినందనలు పొందలేకపోయారు.గడిచిన పదేళ్లలో ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడం, కనీసం స్థానికంగా ఉండే లోటు పాట్లు, సమస్యలపై పదిశాతం కూడా అవగాహన లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆయన తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం నెలకోసారి కూడా నియోజకవర్గంలో పర్యటించని నేత తమకెందుకని, తమ సమస్యలు తీర్చి అక్కున చేర్చుకునే స్థానిక నేతలే తమక కావాలని వారు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ పదేళ్లలో చాలా హామీలిచ్చినా వాటిని తీర్చలేకపోయారు.రాష్ట్రంలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. వెండి తెరపై మన్ననలు పొందిన మాజీ సీఏంతో పాటు ఆ కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అయితే మరీ ముఖ్యంగా గడిచిన దశాబ్ద కాలంగా ఎమ్మెల్యే ఉన్న ఆయన ఆ ప్రాంతాన్ని గాలికొదిలేశారు. సినిమా షూటింగులు, కుటుంబ వ్యవహారాలు, హైదరాబాద్లో స్థిరనివాసం వెరసి ఆయన ఏడాదికి ఒకట్రెండుసార్లు పర్యటనకు మాత్రమే పరిమితమయ్యారు.పీఏలదే పెత్తనం ఎమ్మెల్యే స్థానికంగా ఉండాలనేది అక్కడి ప్రజల మనోగతం. కానీ అరిచి గీపెట్టినా ఆయన అక్కడికి వెళ్లరు. దీంతో ఆయన నియమించుకున్న ప్రైవేటు పీఏలదే పెత్తనం. అంతేకాదు షాడో ఎమ్మెల్యేగా కూడా వీళ్లే వ్యవహరిస్తుంటారు. ఆయనకు పీఏగా ఉన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పేరు కలిగిన వ్యక్తి గతంలో కర్ణాటకలో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. అనంతరం రిమాండుకు వెళ్లారు. అయినా సరే మళ్లీ ఆయన్నే పీఏగా కొనసాగిస్తున్నారు.ఆ పీఏతోపాటు మరో ఇద్దరు కూడా పీఏలుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పీఏలు అంతులేని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా పంచాయతీలు తీర్చడం, సెటిల్మెంట్లు చేయడంలో వారు ఆరితేరారు. నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పదేళ్లలో వారు ఎలాంటి సమస్యను తీర్చడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. కేవలం అయ్యగారు చెప్పిందే వేదంగా పనిచేశారు. పచ్చ నేతలకే అందుబాటులో ఉండేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాము ఎదుర్కొనే సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక అక్కడి ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ప్రచార రంగంలోకి మళ్లీ ఫ్యామిలీ మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ‘పురం’లో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎమ్మెల్యే ఆయన భార్య కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే భార్య అక్కడికి వచ్చి చీరలు పంచినట్టు తెలిసింది. నియోజకవర్గంలో చుట్టిముట్టేలా ప్రచారం ముమ్మరం చేసి కొత్త హామీలు ఇస్తున్నారు. త్వరలోనే కుమారుడు, కూతుళ్లను కూడా ప్రచారానికి దించబోతున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు.కానీ అవి ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయని పురం ప్రజలు వాపోతున్నారు. భూగర్భ డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తానని, రోడ్ల విస్తరణ చేపడతానని ఇచి్చన హామీలు నెరవేర్చలేకపోయారు. క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని ఇచి్చన హామీ అలాగే ఉంది. హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంలో బావను మించిపోయారనే విమర్శలున్నాయి. వాటిని అమలుపరచకపోగా మళ్లీ ఇప్పుడు కొత్త హామీలు గుప్పిస్తున్నారు. సెంటిమెంటును గౌరవించని తీరు 1985లో నటుడు, మాజీ సీఎం ఇక్కడ మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఆ కుటుంబమంటే ఇక్కడి ప్రజలకు గౌరవం. ఆ గౌరవంతోనే ఆయన కుమారులను ఎమ్మెల్యేలుగా చేశారు. ఆ కుటుంబమంటే ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉండటమే ఇక్కడి ప్రజలకు శాపమైంది. దీన్ని ప్రజల బలహీనతగా భావించిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడకు రావడమే మానేశారు. మేము వచి్చనా రాకపోయినా మాకే ఓటేస్తారన్న ధీమా ఆయనది. 2014లోనూ, 2019లోనూ ఇక్కడి నుంచి ఆయన్ను అసెంబ్లీకి పంపించారు. కానీ ఆయన ఇక్కడి సమస్యలను మాత్రం ‘పురం’ పొలిమేర దాటించలేకపోయారన్న విమర్శలున్నాయి. ఎప్పుడూ అక్కడి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదు. వేసవి వచి్చందంటే తాగునీటితో అల్లాడే ఇక్కడి ప్రజలు తమ కష్టాలు తామే తీర్చుకోవాలన్నట్టు చెబుతుంటారు. ఇదే విషయమై ఇటీవల ఓ టీడీపీ నేత ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘నాకు ఓటు వేయడం వాళ్ల అదృష్టం.ఆ అవకాశం అందరికీ రాదు . మీరు నోరు మూసుకుని చెప్పింది చేయండి’’ అని గర్జించారట. కేంద్రం నిధులిచి్చనా.. నియోజకవర్గ కేంద్రంలో ఎప్పటినుంచో తాగునీటి సమస్య ఉంది. 1984 నుంచి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధీ లేదు. అమృత్ స్కీం ద్వారా టీడీపీ హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.194 కోట్లతో పైప్లైన్ వేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీపై రూ.100 కోట్ల భారం పడింది. ఈ డబ్బుకు వడ్డీ చెల్లించేందుకు మున్సిపాలిటీ ఆదాయం సరిపోవడం లేదు. దీంతో పురం మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. -
బాలకృష్ణను ఓడించి జగనన్నకు గిఫ్ట్ ఇస్తా
-
బాలయ్య కుటుంబ ఆస్తులు రూ.465.35 కోట్లు.. అయ్యన్నపై కేసులు 17
సాక్షి నెట్వర్క్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 2022–23లో ఆదాయం రూ.10 కోట్లు, స్థిరాస్తులు రూ.103 కోట్లు, చరాస్తులు రూ.82 కోట్లు కలిపి బాలయ్యకు మొత్తం రూ.185 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. క్రిమినల్ కేసులు ఏవీ లేవని పేర్కొన్నారు. నందమూరి హిందూ అవిభాజ్య కుటుంబంలో బాలకృష్ణకు స్థిరాస్తులు రూ.28.91 కోట్లు, చరాస్తులు రూ.2.41 కోట్లుగా చూపారు. బాలయ్య సతీమణి వసు«ంధర పేరిట రూ.179.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. అందులో స్థిరాస్తులు రూ.38.90 కోట్లు, చరాస్తుల విలువ రూ.140.38 కోట్లుగా చూపారు. కుమారుడు మోక్షజ్ఞ పేరిట స్థిరాస్తులు రూ.11.11 కోట్లు, చరాస్తులు రూ.58.64 కోట్లు కలిపి బాలకృష్ణ కుటుంబానికి మొత్తం ఆస్తుల విలువ రూ.465.35 కోట్లుగా చూపారు. అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరిట రూ.5,04,61,500, అతని భార్య పేరిట రూ.10,84,63,200 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు దళితులపై దూషణలు చేయడం.. అధికారులపై చిందులు వేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అతనిపై 17 కేసులు సైతం నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు ఉన్నాయి. మాగుంట వద్ద ఉన్నది రూ.18 వేలేనట దేశవ్యాప్తంగా పేరున్న మద్యం వ్యాపారి. కానీ.. ఆయన చేతిలో ఉన్న నగదు రూ.18,529 మాత్రమేనట. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన చేతిలో ఉన్న నగదుతో పాటు భార్య వద్ద రూ.6,68,134, ఉమ్మడి కుటుంబ సభ్యుల (హెచ్యూఎఫ్) వద్ద రూ.67,854 నగదు ఉందని తెలిపారు. చరాస్థుల కింద తనకు రూ.4,58,30,319 ఉండగా.. భార్య పేరిట రూ.17,98,70,139, ఉమ్మడి కుటుంబం కింద రూ.4,24,94,762 ఉన్నట్టు తెలిపారు. తన పేరిట రూ.1.09 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. భార్య పేరిట రూ.30,04,44,600, ఉమ్మడి కుటుంబ సభ్యుల కింద రూ.4,29,44,876 ఉన్నట్టు పేర్కొన్నారు. కేసుల చిట్టా విప్పిన బొండా ఉమా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు (ఉమా) ఎన్నికల అఫిడవిట్లో తన కేసుల చిట్టా విప్పారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో తనపై 23 కేసుల నమోదైనట్టు వెల్లడించారు. 2006 నుంచే తనపై కేసులు ఉన్నప్పటికీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల వీటి ప్రస్తావన తేలేదు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా రూ.98.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు వివరించారు. కావలి అభ్యర్థికీ కారు లేదట! కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) ఆస్తుల విలువ రూ.153.27 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అతని పేరున రూ.115.67 కోట్లు, భార్య శ్రీలత పేరిట రూ.31.92 కోట్లు, కుమార్తె వెన్నెల పేరిట రూ.5.67 కోట్లు చర, స్థిరాస్తులున్నట్టు చూపారు. కృష్ణారెడ్డి కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తులు విలువ రూ.715.62 కోట్లుగా ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్రెడ్డి పేరుతో రూ.639.26 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. ఆ దంపతులిద్దరికీ రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నట్టు తెలిపారు. -
‘సహనం నా బ్లడ్లోనే లేదు..’ అభిమానులపై బాలయ్య పంచుల పర్వం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement