-
సీఎం జగన్పై హత్యాయత్నాన్ని ఖండిస్తూ యూకేలో ప్రవాసాంధ్రులు నిరసన
సాక్షి,అమరావతి: చంద్రబాబుకు ఏ దురుద్దేశమూ లేకపోతే ఇటీవల అమరావతి పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ సీఎం జగన్ను రాళ్లతో కొట్టండి అని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్ టీడీపీని డిమాండ్ చేశారు. బాబు అన్న కొద్ది గంటల్లోనే సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిందని గుర్తు చేశారు. దీనిని వైఎస్సార్సీపీ యూకే విభాగం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం యూకేలో సీఎం జగన్పై హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ నిరసన చేపట్టారు. కార్తీక్ మాట్లాడుతూ.. విజయవాడలో సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని, దాన్ని చంద్రబాబు ఓర్చుకోలేక పోయారని అన్నారు. యాత్ర ఇలాగే సాగితే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించే సీఎం జగన్పై ఘాతుకానికి తెగబడ్డారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ కచి్చతంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పాలెం క్రాంతి కుమార్ రెడ్డి, మలిరెడ్డి కిషోర్, వడ్డూరి అప్పాజీ, వీర పులిపాకల, వజ్రాల రాజశేఖర్, భీమిరెడ్డి ప్రతాప్, మాదిరెడ్డి శ్రీకాంత్, వెంకట్ రమణ మామిడిశెట్టి, వంశీ కృష్ణా రెడ్డి కూకటి, గుండం సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. -
‘కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది కదా?’
సాక్షి, కాకినాడ: 2018 అక్టోబర్లో విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగితే.. కోడి కత్తి కేసు అని చంద్రబాబు, ఎల్లో మీడియా ఎగతాళి చేశాయని మండిపడ్డారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు ఎప్పుడైనా కోడి కత్తి చూశారా? అని ప్రశ్నించారు. ఎంత పదునుగా ఉంటుందో ఓసారి టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు. ఈ మధ్య కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది చూసుకోండి అని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. 'వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిందని ఛార్జిషీటు పేర్కొంది. దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. ఈనాడు కథనంలో దీనిపై తీర్పు కూడా ఇచ్చేశారు. తీర్పులు ఇవ్వడానికి మీరెవరూ? మీకు ఏం హక్కుఉంది. నిందితుని వాంగూల్మంతో తీర్పులు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఈనాడు అచ్చేస్తుంది. ఎన్ఐఎ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయమని కోరితే మీకు ఇబ్బంది ఏంటి? మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఈ సంఘటనను చులకనగా తీసిపడేస్తే చంద్రబాబును కాపాడొచ్చు అని మీ దుర్బుద్ధి కాదా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు బాధ్యత లేదా? నిందితుడి కత్తి భుజానికి కాకుండా మెడకు తగిలి ఉంటే పరిస్ధితి ఏంటి?' అని కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘చంద్రబాబు, లోకేశ్ను తరిమికొడతాం’ -
వైఎస్ జగన్పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: గత ఏడాది విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎన్ఐఏ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శ్రీనివాస్ బెయిల్ రద్దు చేసింది. అయితే నిందితుడు బెయిల్పై అప్పీలు చేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. శ్రీనివాస్కు ఈ ఏడాది మే 22న బెయిల్ మంజూరు కాగా, 25న జైలు నుంచి విడుదల అయ్యాడు. దీంతో కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ....హైకోర్టులో అభ్యర్థించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, అసలు బెయిల్ మంజూరుకు కారణాలు కూడా తెలపలేదన్నారు. జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఈ చట్టంలోని సెక్షన్ 6ఏ ప్రకారం బెయిల్ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని కోర్టుకు విన్నవించారు. 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్పై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని... హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో విశాఖ ఎయిర్పోర్టు లాంజ్లో ఆయనపై దాడి జరిగింది. -
శ్రీనివాసరావు బెయిల్ పొడగింపు
సాక్షి, విజయవాడ : గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన జె.శ్రీనివాసరావు బెయిల్ను ఎన్ఐఏ కోర్టు పొడగించింది. జూలై 12 వరకు బెయిల్ను పొడగిస్తూ ఏఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. బుధవారం విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసరావును పోలీసులు ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలంటూ అధికారులు కోర్టును కోరారు. విచారణ చేపట్టిన ధర్మాసనం శ్రీనివాస్రావు బెయిల్ను వచ్చే నెల 12 వరకు పొడగించింది. 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్పై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని... హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఆయనపై దాడి జరిగింది. -
శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేయండి
సాక్షి, అమరావతి: గత ఏడాది వైఎస్ జగన్పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన జె.శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సిద్ధిరాములు బుధవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. అసలు బెయిల్ మంజూరుకు కారణాలు కూడా తెలియచేయలేదన్నారు. జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఈ చట్టంలోని సెక్షన్ 6ఏ ప్రకారం బెయిల్ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని ఆయన వివరించారు. ఆ తరువాత శ్రీనివాసరావు తరఫు న్యాయవాది మట్టా జయకర్ వాదనలు వినిపించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
కళతప్పిన జీవనదులు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ఢిల్లీ రేసులోకొచ్చింది!
గుట్టలుగా... అవినీతి కట్టలు
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement