-
చంద్రబాబు ప్రజాజీవితానికి పనికిరారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అతి సామాన్య కుటుంబంలో జన్మించి, రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో సాగించిన మాజీ సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ప్రజల కోసం గుర్తుంచుకోదగ్గ ఒక్క పనిచేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రజాజీవితానికి పనికిరారనే అంశం స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడారు.దివంగత సీఎం వైఎస్సార్తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ప్రజల పక్షాన మూడు దశాబ్దాలకుపైగా పోరాటాలు చేసి ఆయన సీఎం అయిన అంశాన్ని ప్రస్తావించారు. వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తిరుగులేని ప్రజానేతగా వైఎస్సార్ అవతరించారన్నారు. వైఎస్సార్తో కలిసి కాంగ్రెస్లో పనిచేశానని, ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతోపాటు కోట్లాది అభిమానుల మనోభావాల్లో అనూహ్యమైన మార్పొచి్చందని తెలిపారు. జగన్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర చేయాలని భావిస్తే, కొందరి మాటలను విని పార్టీ అధిష్టానం అడ్డుకుందని చెప్పారు. ఈ క్రమంలో తాము ఆయనకు అండగా నిలిచామన్నారు. జగన్తో తన కుమారుడు గౌతమ్రెడ్డి మాట్లాడిన అనంతరం తాను ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సుబ్బిరామిరెడ్డి బరిలో దిగారని, ఆయనకు మద్దతుగా అప్పటి రాష్ట్ర, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి తనను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిన అంశాన్ని గుర్తుచేశారు. అయినా తాను 2.92 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందానని తెలిపారు. ప్రజల గుండెల్లో జగన్కు సుస్థిర స్థానం వివిధ సంక్షేమ పథకాలు, నూతన ఒరవడితో ప్రజల హృదయాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి సుస్థిరస్థానం సంపాదించుకున్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లోనే ఆయన్ని సీఎం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, అయితే పచ్చమీడియా, టీడీపీ దు్రష్పచారంతో ఆ అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను గెల్చుకుని అఖండ విజయాన్ని నమోదు చేసుకుందని చెప్పారు. జగన్మోహన్రెడ్డిపై ప్రజాభిమానం మరింత ఎక్కువైందని, వై నాట్ 175 అనే పిలుపు అక్షరసత్యం కానుందని పేర్కొన్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం సభలకు అశేష ప్రజాదరణ లభిస్తోందని, రానున్న ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించనుందనే అంశం దీని ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు. చరిత్రహీనులుగా మిగలడం ఖాయం ప్రజాబలం లేని చంద్రబాబు, పవన్కళ్యాణ్ వంటి వారు సీఎంపై దాడులకు ఉసిగొల్పి చరిత్రహీనులుగా నిలిచిపోనున్నారని ధ్వజమెత్తారు. సీఎంపై ఇటీవల రాయితో దాడిచేశారని, ప్రజాశీస్సులు మెండుగా ఉన్న కారణంగా ఆయనకు పెనుప్రమాదం తప్పిందన్నారు. ఈ హత్యాయత్నం వెనుక అసలు దోషి చంద్రబాబు కాదా అని ప్రశి్నంచారు. సంక్షేమసారథి జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు నుంచి తన కుమారుడు మేకపాటి విక్రమ్రెడ్డి, ఉదయగిరి నుంచి తన సోదరుడు రాజగోపాల్రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించనున్నారని చెప్పారు. నెల్లూరు లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలని ఆయన కోరారు. -
పవన్ కళ్యాణ్ వెళ్లి సినిమాలు చేసుకో: రాజమోహన్ రెడ్డి
-
బయటపడ్డ మోడీ మనసు బాబు కు ఇదే ఘోర అవమానం
-
తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం
ఆత్మకూరు: దివంగత మంత్రి, తన సోదరుడు మేకపాటి గౌతమ్రెడ్డి ఆలోచనలు ఎంతో ముందుచూపుతో ఉన్నతంగా ఉండేవని, ఆయనతో ఉండే అనుబంధంతో తాను చిన్న వయసులోనే ఈ విషయాన్ని గమనించానని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. పట్టణంలో ఏడీఎఫ్, ఎంజీఆర్ ఫౌండేషన్ల ద్వారా సొంత నిధులతో నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ పాల్గొన్న ఈ సభలో ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి మాట్లాడారు. 1995లో లండన్లో చదువు పూర్తి చేసుకొని దేశంలో అడుగుపెట్టిన గౌతమ్రెడ్డి అప్పట్లో మాల్ లాంటివి లేకపోవడంతో అది ఏర్పాటు చేసే ఆలోచన చేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై సరిగ్గా ఈ రోజుతో ఏడాది పూర్తయిందని, ఇచ్చిన మాట మేరకు తొలి కానుకగా మున్సిపల్ బస్టాండ్ను ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పలు వినతులు అందాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఏడీఎఫ్ ద్వారా రూ.10 కోట్ల సొంత నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నుడా పరిధిలో చేరడం సంతోషకరమని, పేదలకు మరో 15 వేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఇప్పటికే రెండు జాబ్మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించగా, శనివారం మరో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 23 కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్లో మరో జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. నారంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండస్ట్రి యల్ పార్కులో ఆరు నెలల్లో ఓ పరిశ్రమ ఏర్పాటు కానుందని, అక్కడ 3 వేల మందికి ఉద్యోగాలు కల్పి ంచేలా పరిశ్రమలు తీసుకురానున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట మండలాలకు సాగు, తాగునీరు లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో రెండు జాతీయ రహదారులు ఉండగా, మరో జాతీయ రహదారి రానుందన్నారు. వేర్హౌసింగ్, లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని త్వరలోనే ఆ పనులు వేగవంతమయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, తమ కుటుంబీకులు తప్పు చేయబోరని, ప్రజలకు తలవంపులు తీసుకురామని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఎంజీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అనంతరం చెప్పుడు మాటలతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడంతో ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి ఆ కుటుంబం వెంట నడిచామన్నారు. ఆత్మకూరు ప్రాంతానికి తమ కుటుంబం తరపున చిరుకానుకగా ఈ బస్టాండ్ను సొంత నిధులతో నిర్మించిన అందజేసినట్లు తెలిపారు. దివంగత వైఎస్సార్ వల్లనే వెలుగొండ ప్రాజెక్ట్, సోమశిల హైలెవల్ కెనాల్ రూపురేఖలు దాల్చాయని, వాటిని వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీఎం ఆశీర్వాదంతో తన సోద రుడు మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. 600 వాగ్దానాలిచ్చి, వాటి ని తుంగలో తొక్కి, మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మబోరన్నారు. తండ్రీ, కొడుకులు, దత్తపుత్రుడు అబద్దాలు చెబుతూ ప్రజలను నమ్మించేందుకు పాదయాత్ర,బస్సుయాత్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వీరికితోడు పచ్చపత్రికలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దివంగత మంత్రి గౌతమ్రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె అనన్య, కుమారుడు అర్జున్, తల్లి మణిమంజరి పాల్గొన్నారు. -
‘పోలవరం, వెలిగొండ పూర్తి కావాలంటే 2024లో కూడా వైఎస్ జగన్ సీఎం అవ్వాలి’
సాక్షి, నెల్లూరు: ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ లోకేష్ నవ్వులపాలవుతున్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో అభివృద్ది లేదని విమర్శించే వాళ్లు అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుందని హితవు పలికారు. లోకేష్ బుద్ధి, జ్ఞానం లేకుండా విమర్శలు చేశారు.. తమ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని ఘాటుగా రాజమోహన్రెడ్డి బదులిచ్చారు. నెల్లూరులో సాగు నీటి ప్రాజెక్టులు అన్నీ వైఎస్సార్, జగన్ పుణ్యమేనని చెప్పారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే 2024లో కూడా వైఎస్ జగన్ సీఎం అవ్వాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఆర్ధిక బలం, కమ్మ బలం, మీడియా సపోర్ట్ ఉంటే.. జగన్కు మాత్రం ప్రజా బలం ఉందన్నారు. లోకేష్ బుజ్జి బాబు చేసిన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేకపాటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: గంటకో నిర్ణయం.. పూటకో మాట.. పవన్పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement