-
లారీలు ఢీకొని డ్రైవర్ మృతి
ఇల్లెందు : రెండు లారీలు ఢీకొన్న ఒక డ్రైవర్ మృతిచెందాడు. మరో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని బొజ్జాయిగూడెం సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఇల్లెందుకు చెందిన లారీ, మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి ఐరన్ లోడ్తో పాల్వంచ కేటీపీఎస్కు వస్తోంది. బొగ్గు లోడుతో హెదరాబాద్ నుంచి మరో లారీ వస్తోంది. మంగళవారం ఉదయం బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల సమీపంలో ఈ రెండు లారీలు ఢీకొన్నాయి. ఇల్లెందు లారీ డ్రైవర్ లక్ష్మణ్, తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 108 సిబ్బంది ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అతడు అక్కడే మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయితండాకు చెందిన లక్ష్మణ్కు భార్య కుమారి, మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న కూతురు ఉన్నారు. ఇల్లెందు ఎస్ఐ బి.రాజు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్కు చెందిన లారీ డ్రైవర్ రాజశేఖర్రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఇల్లెందు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స పొందాడు. ఇల్లెందు లారీలో మంటలు ఇల్లెందు లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. అప్పటికే అటు వైపు వచ్చిన ప్రయాణికులు, అపస్మారకంగా స్టీరింగ్పై పడిపోయిన డ్రైవర్ లక్ష్మణ్ను వెంటనే కిందకు లాగారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. మిట్టపల్లి వద్ద మరో రెండు లారీలు.. తల్లాడ : మండలంలోని మిట్టపల్లి హైలెవల్ వంతెన వద్ద మంగళవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఒక లారీ (టీఎస్ 12 యుబీ 7965) ఖమ్మం వైపు, మరో లారీ (ఓడీ 01 ఆర్ 8583) సత్తుపల్లి వైపు వెళ్తున్నాయి. మిట్టపల్లి బ్రిడ్జి వద్ద ఇవి రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఖమ్మం వైపు వెళుతున్న లారీ డ్రైవర్ పొన్నం గణేష్, క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. కాళ్లు, చేతులకు, ఇతరచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని మిట్టపల్లి గ్రామస్తులు బయటకు తీశారు. ఇతనిది సూర్యాపేట జిల్లా తిరుమలగరి మండలం. మరో లారీ డ్రైవర్ సంతోష్కుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. బ్రిడ్జి సైడ్ వాల్కు ఒక లారీ తగిలి ఆగిపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఆ లారీ పడిపోయినట్టయితే ప్రాణాపాయం ఉండేది. ఈ ప్రమాదంతో గంటన్నరపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. తల్లాడ ఎస్ఐ మేడా ప్రసాద్, సిబ్బంది కలిసి వాహనాలను వెంగన్నపేట, బిల్లుపాడు మీదుగా తల్లాడకు మళ్లించారు. కేసనును ఎస్ఐ ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. -
చింతూరులో రెండు లారీలు ఢీ
చింతూరు: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం సంభవించింది. చింతూరు మండలం ఏడుగుర్రాల పల్లి వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. సిమెంటు, పశువుల దాణాతో వెళ్తున్న లారీలు ఢీకొట్టుకోగానే మంటలు చెలరేగి అక్కడికక్కడే దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లారీలో డ్రైవర్, క్లీనర్ సజీవదహమైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో లారీలోని డ్రైవరు, క్లీనర్లకు తీవ్రగాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement