-
సీఎం వైఎస్.జగన్ చొరవతో.. కుప్పం అప్గ్రేడ్
సాక్షి, కుప్పం: కుప్పం మేజర్ పంచాయతీని నగర పంచాయతీ స్థాయికి పెంపుదలలో కదలిక వచ్చింది. పంచాయతీ స్థాయిని పెంచేందుకు వీలుగా ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని పురపాలక శాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు అందాయి. మున్సిపాలిటీలతో పాటు ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈ నెలాఖరు లోపు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఊరింపే.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కుప్పం మేజర్ పంచాయతీని నగర పంచాయతీ (మున్సిపాలిటీ)గా మార్చే అంశం ప్రతిపాదనలకే పరిమితమైందే గానీ, కార్యరూపం దాల్చలేదు. ఆ దిశగా అప్పటి సీఎం, ప్రస్తుత విపక్ష నేత ఎన్.చంద్రబాబు కూడా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించలేదు. సీఎం వైఎస్.జగన్ చొరవతో.. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. సీఎంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ కోవలోనే కుప్పంతో పాటు రాష్ట్రంలోని అనేక మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరాల స్థాయిని పెంచే దిశగా అడుగులు వేశారు. ఆ క్రమంలోనే మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో కలిసి ఎన్నికలు నిర్వహించే విధంగా కొత్తగా మున్సిపాలిటీల ఏర్పాటుకు వీలుగా ప్రతిపాదనలు పంపించాలని ఈ నెల 17వ తేదీ పురపాలక శాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యా యి. విలీనం చేయాల్సిన గ్రామాలు, పంచాయతీల వివరాలు కూడా పొందుపరచాలని అందులో సూచించారు. కుప్పం మున్సిపాలిటీ స్వరూపం కుప్పం మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా పెంచడానికి గతంలో ప్రతిపాదనల మేరకు ఆ స్వరూపం ఇలా ఉండనుంది. కుప్పం నగర పంచాయతీలోకి సమీపంలోని ఎనిమిది పంచాయతీలు, గుడుపల్లె మండలంలోని మరో మూడు పంచాయతీలు విలీనం కానున్నాయి. కుప్పంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 22,303 మంది ఉన్నారు. పట్టణానికి చుట్టుపక్కల ఉన్న 11 పంచాయతీలు విలీనం చేస్తే ఆ సంఖ్య 49,574కు చేరుతుంది. -
కలెక్టర్ చెంతకు కుప్పం ‘పంచాయితీ’
– 16 మంది వార్డు మెంబర్లు రాజీనామాల సమర్పణ – ఆగస్టు 4న స్వయంగా విచారణ చేపడతామని హామీ చిత్తూరు : సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పంచాయతీలో రాజీనామా బాటపట్టిన వార్డు మెంబర్లతో శనివారం కలెక్టర్ సిద్ధార్థ్జైన్ రహస్య మంతనాలు జరిపినట్లు తెలిసింది. కుప్పం మేజర్ పంచాయతీ. మొత్తం 20 మంది వార్డు మెంబర్లతో పాలకవర్గం ఉంది. మూడేళ్లుగా పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇందుకు సర్పంచ్ తీరే కారణమని శుక్రవారం టీడీపీకి చెందిన 16 మంది వార్డు మెంబర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీవో కార్యాలయానికి తీసుకెళ్లడం, అక్కడ అధికారులు లేకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చిన విషయం విదితమే. అయితే వారు శనివారం కలెక్టరేట్కు వచ్చారు. కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు రాజీనామా పత్రాలను సమర్పించారు. దీంతో కలెక్టర్ తన కార్యాలయంలో దాదాపు గంటన్నర సమయం ఇతరులను ఎవరినీ లోనికి రానీయకుండా వారితో చర్చలు జరిపారు. ఉన్నఫళంగా రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ వారికి సూచించినట్లు సమాచారం. సర్పంచ్ తీరు సరిగాలేదని, అవినీతికి పాల్పడుతన్నారని వారు ఆరోపించినట్లు తెలిసింది. మూడేళ్లుగా కుప్పం పంచాయతీ అభివృద్దికి విడుదలైన నిధులకు ఎలాంటి లెక్కలు లేవని తెలిపారు. డంపింగ్ యార్డు శుభ్రం కోసం విడుదలైన రూ. 25 లక్షలు, ఎస్డీఎఫ్ కింద సీసీ రోడ్లకు విడుదలైన రూ. 4.50 కోట్లకు మూడు వీధులకు మాత్రమే సీసీ రోడ్లు ఏర్పాటుచేసి ఖర్చులు చూపెట్టలేదన్నారు. మొత్తం 20 అంశాలతో కూడిన ఫిర్యాదు పత్రాన్ని వారు కలెక్టర్కు అందజేశారు. సర్పంచ్ తీరుతో విసుగుచెంది రాజీనామాకు సిద్ధమయ్యామని వారు కలెక్టర్కు వివరించినట్లు తెలిసింది. దీనిపై తానే స్వయంగా ఆగస్టు నాలుగో తేదీ కుప్పం విచ్చేసి విచారణ జరిపిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వార్డు సభ్యులు తెలిపారు. తమ రాజీనామా పత్రాలు కూడా అంతవరకు పెండింగ్లో ఉంచి, విచారణలో తమకు న్యాయం జరగకపోతే రాజీనామాలను ఆమోదింప జేయాలని కలెక్టర్ను కోరినట్లు వారు చెప్పారు. అంతకుమునుపు వారు డీపీవో ప్రభాకర్రావుకు కూడా రాజీనామా పత్రాలు అందజేశారు. పంచాయతీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఫిర్యాదు చేశారు. కడా ఎస్వో, ఎంపీడీవోకు కూడా రాజీనామాలు కుప్పం : కుప్పం పంచాయతీ వార్డు సభ్యులు 16 వుంది శనివారం కడా ఎస్వో శావ్యుప్రసాద్కు, మండల అభివృద్ధి అధికారి రామచంద్రకు రాజీనామా పత్రాలను అందజేశారు. ముుఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక్కసారిగా 16 మంది వార్డు మెంబర్లు రాజీనామా చేయడం సంచలనం రేపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement