-
భువనగిరి ఎంపీ టికెట్ అడగడం లేదు
మునుగోడు: భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మికి అడుగుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదని, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టనివారు తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే బాగుటుందని తాను పలుమార్లు చెప్పానని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కోమటిరెడ్డి కుటుంబం పదవుల కోసం పాకులాడదని, తన భార్య లక్ష్మి కూడా పోటీచేసేందుకు సుముఖంగా లేదని చెప్పారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో.. తమ కుటుంబం నుంచి పోటీచేస్తేనే గెలుస్తామని రిపోర్టు వస్తే..అధిష్టానం పోటీచేయాలని పట్టుబడితే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవు తన సోదరుడు మంత్రి వెంకట్రెడ్డికి, తన మధ్య విభేదా లు ఉన్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ మధ్య ఏ ఒక్క రోజూ ఎడబాటు ఉండదన్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని, తాను సూర్యాపేటకు వెళ్తే.. ఒక్క రోజు కూడా బయట తిరగలేడన్నారు. ఆలస్యమైనా తనకు మంత్రి పదవి వస్తుందని, ఆ నమ్మకం ఉందని రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం ఎంపీపీలు తాడూరి వెంకట్ రెడ్డి, గుత్తా ఉమాదేవి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్ అధ్యక్షుడు కావాలి: రాజగోపాల్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని.. బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్రావు అధ్యక్షుడు కావాలంటూ వ్యాఖ్యానించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. రాజగోపాల్రెడ్డి. ఎంఐఎం మాతోనే ఉందని.. తమకు 72 సీట్లు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో చాలా మంది నేతలు అవమానానికి గురైన వారు ఉన్నారు. అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్లోకి తీసుకుంటాం. డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే మాకు ఎలా వాడుకోవాలో తెలుసు. క్యాబినెట్ విస్తరణ పై నాకు సమాచారం లేదు. ఎన్ని సార్లు అధికారంలో ఉంటామనేది మనం చెప్పలేము. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఉంది. 2029 గురించి ఇప్పుడు ఏం చెప్పలేమని కోమటిరెడ్డి అన్నారు. ఈటలను ఓడించేందుకు దళితబంధు తెచ్చారు..దళితులపై ప్రేమతో కాదు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిదంటూ రాజగోపాల్రెడ్డి సలహా ఇచ్చారు. కేటీఆర్ పొలిటీషియన్ కాదు.. హైటెక్ పొలిటీషియన్. భవిష్యత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు మునిగినట్లే. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ గెలవదు. కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుంది. ఎంఐఎం మాతోనే ఉంది. ప్రభుత్వం ఎవరిది ఉంటే ఎంఐఎం వారితో ఉంటుంది. భువనగిరి నుంచి బీసీకి టిక్కెట్ ఇస్తే గెలిపించే బాధ్యత నాది’’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. -
ప్లీజ్ కేటీఆర్.. కాంట్రవర్సీ వద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. దీనికాయన స్పందిస్తూ మీలాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని బదులిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తేనే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఇక ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా.. లేక కొడుకు సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని కేటీఆర్ అడగగా, ప్లీజ్ దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్లో ఉంటారు’
సాక్షి, హైదరాబాద్: తాను హోం మంత్రిని అయితేనే బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్లో ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు. హోం శాఖ అడుగుతున్నా.. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే తనకు హోం శాఖ ఇవ్వాలని అడుగుతున్నానన్నారు. తాను మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చిందే కేసీఆర్ను గద్దె దించేందుకేనన్నారు. తాను హోంమంత్రిని అయితేనే వాళ్లు (బీఆర్ఎస్ నాయకులు) కంట్రోల్లో ఉంటారన్నారు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు బీజేపీయే శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని జోస్యం చెప్పారు. ఇక భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదన్నది తమ ఉద్దేశమన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, టెకెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని వివరించారు. -
భువనగిరి ఎంపీగా రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మి..?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలబడడానికి పలువురు నేతల వారసులు ఆసక్తి చూపుతున్నారు. నల్లగొండ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించగా.. బీఆర్ఎస్ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు గుత్తా అమిత్ ప్రయత్నాలు ప్రారంభించారు. భువనగిరి ఎంపీ స్థానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలనే ఆలోచన చేస్తున్నారు. మరో వైపు కోమటిరెడ్డి మోహన్రెడ్డి తనయుడు సూర్యపవన్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మోహన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కలువడం చర్చనీయాంశమైంది. వివిధ వేడుకలతో జనాల్లోకి.. అగ్రనేతల తనయులు వారి పుట్టిన రోజు, నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర సందర్భాలను పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ తరపున నల్లగొండ ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్రెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రఘువీర్ తమ్ముడు జయవీర్రెడ్డి సాగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ టికెట్ను రఘువీర్రెడ్డికి ఇప్పించేందుకు జానారెడ్డి ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ప్రస్తుతం పార్లమెంట్ కోసం పోటీ చేయించాలానే ఆలోచనలో భాగంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం రఘువీర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్బంగా హైదరాబాద్తో పాటు హాలియాలోనూ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి గుత్తా తనయుడు.. బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు గుత్తా అమిత్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 31న ఆయన జన్మదినం సందర్భంగా గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో ఆయన మునుగోడు టికెట్ ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం పార్లమెంట్ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాడు రెండు పార్లమెంట్ నియోజక వర్గాలైన నల్లగొండ, భువనగిరి ఏ నియోజకవర్గాల నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల నిర్వహించిన చిట్చాట్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వెల్లడించారు. ఎవరి ప్రయత్నాల్లో వారే.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట టికెట్ను రాంరెడ్డి దామోదర్రెడ్డికి ఇవ్వగా.. పటేల్ రమేష్రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగడంతో పాటుఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆయనకు అప్పటి కాంగ్రెస్ నేతలు ఎంపీగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ఆలోచనల్లో రమేష్రెడ్డి ఉన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో దామోదర్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ నుంచి గార్లపాటి జితేందర్, సంకినేని వెంకటేశ్వర్రావు, మన్నెం రంజిత్ యాదవ్, బండారు ప్రసాద్, గోలి మదుసూదన్రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. భువనగిరి ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, జెడ్పి మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి భువనగిరి మాజీ ఎమ్మల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ ప్రయత్నిస్తుండగా, బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆశిస్తున్నట్లు తెలిసింది. రంగంలోకి ‘కోమటిరెడ్డి’ కుటుంబం భువనగిరి పార్లమెంట్ సీటు కోసం ‘కోమటిరెడ్డి’ కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన సతీమణి లక్ష్మిని భువనగిరి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనల్లో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి మోహన్రెడ్డి తనయుడు సూర్యపవన్రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. అందులో భాగంగా నూతన సంవత్సరం పురస్కరించుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి కోమటిరెడ్డి మోహన్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డిని కలువడం చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సరం, సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు భువనగిరి ఎంపీ టికెట్ను కుంభం అనిల్కుమార్రెడ్డి కూతురు కీర్తిరెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తెలిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement