-
గుండె నిండా కేసీఆర్..
-
ఎన్టీఆర్ మించి సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేసీఆర్
-
బీఆర్ఎస్ గెలిచే ఎంపీ సీట్లు అవే: కేసీఆర్
ఖమ్మం,సాక్షి: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పని గోవిందా అని బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. ఖమ్మంలో సోమవారం(ఏప్రిల్29) రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు.‘తల లేని బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు తెలంగాణ ప్రజల్ని నూకలు తినమన్నాడు. తెలంగాణలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి,ముగ్గురు ఎంపీలు ఉండి వృథా. మోదీ గోదావరి నీళ్లను ఎత్తుకు పోతా అంటుంటే తెలంగాణ బీజేపీ నోరు మెదపడం లేదు. వరిలో పంజాబ్ను తలదన్నే స్థాయిలోకి తెలంగాణను తీసుకెళ్లా. నేను గోదావరిలో మన వాటా ఇచ్చే వరకు చుక్క నీరు తీసుకెళ్లనివ్వనన్నాను.బీఆర్ఎస్ 12 పార్లమెంటు స్థానాలు గెలవబోతోంది. గోదావరి,కృష్ణా జలాలతో పాటు అనేక హక్కులు సాధించడం కోసం బీఆర్ఎస్ అవసరం.ఆమరణ నిరహర దీక్ష చేసిన సమయంలో ఖమ్మం ప్రజలు,న్యూ డెమోక్రసీ నేతలు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.మేం దళారి వ్యవస్థ లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి..అడ్డగోలు హామీలు ఇస్తున్నాడు.దళిత బంధు,రైతు బంధు అడిగితే కాంగ్రెస్ చెప్పుతో కొడతా అంటుంది.నేటి ప్రభుత్వంలో కరెంట్ కోతలున్నాయి.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క.ఉస్మానియా హస్టల్లో కనీస సదుపాయాలు లేకుండా చేశాడు.డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని సీఎం మాట తప్పాడు. భద్రాచలం రామయ్య మీద,యాదాద్రి నర్సన్న మీద ఒట్లు వేయడం తప్ప సీఎం ఏమి చేయడం లేదు. నన్ను రకరకాలుగా దుర్భాషలాడుతున్న ముఖ్యమంత్రి నీ భాష ఇదేనా.జైళ్లకు,తోక మట్టలకు కేసిఆర్ భయపడడు. బీజేపీ వాళ్లే చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తెల్లారి ముఖ్యమంత్రి బీజేపీలోకి జంప్ కొడతాడని అంటున్నారు.వారి మాటలకు రేవంత్ ఖండన ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియదు.పదేళ్లలో ఒక్క ఎకరా ఎండనివ్వలేదు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకు వచ్చాను. ఖమ్మం పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి.దేశం,రాష్ట్రం యువతది.ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా.ఇక్కడి నుంచే పోరాటం మొదలవ్వాలి.గత ప్రభుత్వ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ మెడికల్ కాలేజి వచ్చింది’అని కేసీఆర్ అన్నారు. -
Congress: కాంగ్రెస్లో ఆ ముగ్గురు ఎవరు?
సాక్షి, ఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పెండింగ్లో ఉన్న హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఎంపీ టికెట్ల విషయమై పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా రేవంత్ ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఇక, రేపు(శుక్రవారం) కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఉండనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ టికెట్లపై చర్చించి ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఖమ్మం కాంగ్రెస్ టికెట్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులలో టికెట్ దక్కించుకునేది ఎవరోననే చర్చ నడుస్తోంది. ఇక, ముగ్గురు మంత్రుల కుటుంబాలను కాదని కొత్తవారిపై అధిష్టానం దృష్టి సారించిందనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ఖమ్మంలో రేసులో రాయల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కుసుమ కుమార్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, కరీంనగర్ సీటు కోసం ప్రవీణ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ టికెట్ను ప్రవీణ్ రెడ్డి త్యాగం చేశారు. మరోవైపు.. కరీంనగర్ టికెట్ రేసులో వెలిచాల రాజేంద్ర రావు, ప్రవీణ్ రెడ్డి , తీన్మార్ మల్లన్న ఉన్నారు. వెలమ సామాజిక వర్గం పట్టున్న కరీంనగర్ సీటులో ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే చర్చ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తనకు టికెట్ ఇస్తారన్న హామీని నిలబెట్టుకోవాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ స్థానంలో కూడా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, కొద్దిరోజులుగా హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మీర్జా పోటీ చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, దీనిపై కాంగ్రెస్ నేతలు మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో, ఇక్కడ కూడా ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగానే మారింది. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. కాగా, తెల్లం వెంకట్రావ్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ నేడు కాంగ్రెస్లో చేరారు. దీంతో, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వెంటనే వెంకట్రావ్ సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను కలిశారు. దీంతో, అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారనే చర్చ నడిచింది. ఇక, గత కొన్ని రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం కూడా ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. మరోవైపు.. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు. అయితే, ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఇక, పార్టీ చేరిన వెంటనే వారికి టికెట్ కూడా రావడం విశేషం. దీంతో, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు హైకమాండ్పై సీరియస్ అవుతున్నారు. తమకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement