-
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
ఖమ్మం: గత ఎన్నికల్లో తమను కడుపులో పెట్టుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి ముస్తఫానగర్, చర్చికాంపౌండ్, ప్రకాష్నగర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు శుక్రవారం రాత్రి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చికాంపౌండ్ సెంటర్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పుల నుండి కాపాడుకోడానికి బీజేపీతో జత కడుతున్నారని చెప్పారు. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి మాయమాటలతో పదేళ్లు రాజ్యమేలారని విమర్శించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ మంత్రి తుమ్మల ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కావాలని అడిగారని తెలిపారు. గృహనిర్మాణ శాఖకు మంత్రిగా ఉన్న తాను ఖమ్మంకు ఆరు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎంపీగా రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని తెలిపారు.నిరుపేదలందరికీ ఇళ్లు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు.ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టితో పాటు తామిద్దరం కలిసి ఖమ్మంను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్టంలోనే ఆగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్న వారు ధైర్యం ఉంటే రేవంత్రెడ్డిని తాకాలని సూచించారు.మతోన్మాద బీజేపీ మరోమారు గెలిస్తే ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముగ్గురు మంత్రుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ రోడ్డు షోలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మహ్మ ద్ జావీద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే అభివృద్ధి, సంక్షేమం : జేపీ నడ్డా
ఖమ్మం: పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే బీజేపీతోనే సాధ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితబియ్యం, 75 ఏళ్లు నిండిన వారికి ఆయుష్మాన్ భారత్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. రాబోయే రోజుల్లో ఏడు కోట్ల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ అందించడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్లో కుటుంబపాలన సాగుతోందని, దానికి అండగా నిలిచిన పార్టీలదీ అదే చరిత్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అవినీతి జరిగిందని నడ్డా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులుగా తాండ్ర వినోద్రావు, సీతారాంనాయక్ను గెలిపించాలని కోరారు.దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు..గత పదేళ్లలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, దేశ ప్రజలే తన కుటుంబంగా భావించే నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదని, రాహుల్ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి అసత్య హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన చిప్ప పట్టుకొని రేవంత్రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 సీట్లనూ బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు మాట్లాడుతూ ఢిల్లీలో మాదిరి ఖమ్మం కాంగ్రెస్లోనూ కుటుంబపాలన సాగుతోందని, స్థానికేతరుడైన వియ్యంకుడిని మంత్రి పొంగులేటి తెచ్చి పెట్టారని ఆరోపించారు. స్థానికుడినైన తననే ఆదరింంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ తనను మరోసారి గెలిపిస్తే మహబూబాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, విజయరామారావు, ఎం.ధర్మారావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్, నాయకులు శ్రీకాంత్, నంబూరి రామలింగేశ్వరరావు, జీవీకే మనోహర్, ఎం.శ్రీనివాసరెడ్డి, ఉప్పల శారద, నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, నరేంద్రబాబు పాల్గొన్నారు.ఇవి చదవండి: లెక్క తేలింది.. పోరు మిగిలింది.. -
కలెక్టర్ను కలిసిన సివిల్స్ ర్యాంకర్
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం క్రైం/ఖమ్మం మయూరిసెంటర్: ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 938వ ర్యాంక్ సాధించిన బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)కు చెందిన సాయి అలేఖ్య సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వీ.పీ.గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ సత్కరించారు. ఆతర్వాత సీపీ సునీల్దత్ను కూడా కలవగా ఆయన సాయిఅలేఖ్యతో పాటు ఆమె తండ్రి మధిర టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాశ్రావు – పద్మశ్రీ దంపతులను సన్మానించారు. అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక సాయి అలేఖ్యను ఖమ్మంలోని బీసీ స్టడీసర్కిల్లో సత్కరించారు. స్టడీసర్కిల్లో గ్రూప్స్, డీఎస్సీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి ఏర్పాటుచేయగా.. ఆమె పాల్గొని ఉద్యోగాలకు సన్నద్ధతపై సూచనలు చేశారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, సాయిఅలేఖ్య చదువుకున్న త్రివేణి పాఠశాల, సెంచరీ స్కూల్లో కూడా ఆమెను సన్మానించారు. త్రివేణి డైరెక్టర్లు గొల్లపుడి వీరేంద్రచౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్తో పాటు సీహెచ్.అప్పారావు, స్వప్న, ముస్తఫా, అశోక్, చార్లెస్, సందీప్, సెంచరీ స్కూల్లో కరస్పాండెంట్ డీవీఎస్.ప్రభాకర్రావు, డైరెక్టర్ మాధవీలతతో పాటు స్వరూప, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాయిఅలేఖ్యను సన్మానించిన కలెక్టర్, సీపీ -
గులాబీకి సవాల్..
ఖమ్మం లోక్సభ ఎన్నిక బీఆర్ఎస్కు సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించడం ఎదురీతకు కారణమవుతోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఇక్కడ విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సర్వశక్తులొడ్డుతున్నా ఫలితం ఎలా ఉండబోతోందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంనాడు అధికారంలో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. దీంతో 1,68,065 ఓట్ల మెజార్టీతో నామ విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నాడు 14.74 శాతం ఓట్ల వ్యత్యాసం వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధి ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు 5,18,194 ఓట్లు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో నామాకు 49,265 ఓట్లు మాత్రమే అదనంగా నమోదయ్యాయి. ఇప్పుడు భారీ వ్యత్యాసం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఖమ్మం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్తో పాటు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థులకు 7,33,293 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తద్వారా కాంగ్రెస్ కూటమి 2,65,654 ఓట్ల మెజార్టీని సాధించినట్లయింది. ఈ గణాంకాలను పరిశీలిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో కూడా లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది. ఖమ్మం లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఎదురీత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు ఆ పార్టీతో పోలిస్తే ‘కారు’కు 2.65 లక్షల ఓట్ల వ్యత్యాసం ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎటువైపోనని ఉత్కంఠపట్టు దొరికేది ఎక్కడ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖమ్మం నియోజకవర్గంలో 49,381 ఓట్ల మెజార్టీ, పాలేరులో 56,650 మెజార్టీ, సత్తుపల్లిలో 19,440 ఓట్లు, మధిరలో 35,452 ఓట్ల మెజార్టీ, వైరాలో 33,045 ఓట్లు, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి 42,781 ఓట్ల మెజార్టీ, అశ్వారావుపేటలో 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ అభ్య ర్థులు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక పోయారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీ రావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ పరిధిలో ఎలా ఓట్లు దక్కించుకోవాలి, ఎక్కడ పట్టు దొరుకుతుందనే లెక్కల్లో బీఆర్ఎస్ నేతలు మునిగితేలుతున్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు.. నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖమ్మం 1,36,016 86,635 పాలేరు 1,27,820 71,170 సత్తుపల్లి 1,11,245 91,805 మధిర 1,08,970 73,518 వైరా 93,913 60,868 కొత్తగూడెం (సీపీఐ) 80,336 37,555 అశ్వారావుపేట 74,993 46,088 మొత్తం 7,33,293 4,67,639 -
‘మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం’
● ఎంపీగా నామను గెలిపిస్తేనే అది సాధ్యం ● ప్రచార సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలిపించాలని పలువురు పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో జరిగిన ప్రచార సమావేశాల్లో అభ్యర్థి నామతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, సామాన్య ప్రజల కష్టాలు కళ్లెదుటే కనబడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా నామ గెలుపు తప్పనిసరని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినందుకు తప్పు చేశామని భావిస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ నామ గెలుపునకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలను తొలగించడమే కాక హామీలను నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా పాట రూపంలో వివరించారు. అలాగే, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ బి.ఉమ, నాయకులు తాళ్లూరి జీవన్కుమార్, బెల్లం వేణు, బాషబోయిన వీరన్న, గుడిబోయిన దర్గయ్య, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, ఏ.వరప్రసాద్, దేవరం దేవేందర్రెడ్డి, మాలతి, చావా వేణు, ఆలస్యం నాగేశ్వరరావు, రవి, చామకూరి రాజు తదితరులు పాల్గొన్నారు. ● ఖమ్మం లీగల్: బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు బిచ్చాల తిరుమలరావు, కొత్తా వెంకటేశ్వరరావు, మేకల సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement