-
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
సాక్షి,కామారెడ్డి: సీఎం రేవంత్ కామారెడ్డి జిల్లాను తీసేయాలని చూస్తున్నాడని, కామారెడ్డి జిల్లా ఉండాలంటే జహీరాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం(మే7) కామారెడ్డి జేపీఎన్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడారు. ’తెలంగాణకు మోది చేసింది ఏమీ లేదు. బీజేపీ పరిపాలనలో తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ. బీజేపీ మత విద్వేషాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు నేరేవేర్చే స్దితిలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలొ ఎక్కడా చూసినా కరెంట్ కోతలు. వరి బోనస్ ...బోగస్గా మారింది.అసమర్దులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఇచ్చిన హమీలు నేరవేర్చడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఐదు నెలలకే రాష్ట్రం ఆగమైపోయింది. బీఅర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నింటిని రద్దు చేశారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే’నని కేసీఆర్ స్పష్టం చేశారు. -
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
గచ్చిబౌలి, శంషాబాద్ (హైదరాబాద్)/ సిరిసిల్ల: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించ గలిగే శక్తి, కేంద్రంలో రానున్న సర్కారుతో పోరాడే దమ్ము కేవలం మాజీ సీఎం కేసీఆర్కు, అలాగే కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వారికే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. కేసీఆర్ను మరింత బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు బీఆర్ఎస్కు ఇస్తే ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని పేర్కొన్నారు.సీఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని, రాజీవ్గాంధీ లైన్లో కాకుండా మోదీ లైన్లో నడుస్తున్నాడని విమర్శించారు. బీజేపీ వాళ్లు ఇంటింటికీ పంపే రాముడి ఫొటోకు, అంక్షితలకు మోసపోవద్దని కోరారు. అవి అయోధ్య నుంచి రాలేదని ఇక్కడి రేషన్ బియ్యానికే పసుపు పూసి పంపుతున్నారని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోని కొండాపూర్, శంషాబాద్లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు. ఆయనేమన్నా బోటి కొట్టేటోడా?‘కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి, అలవికాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ ఐదు నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వలేదు. హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడితేనే పిచ్చి వాగుడు వాగుతున్న రేవంత్రెడ్డికి బుద్ధి వస్తుంది. ఆయన తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా ఇయ్యడు. రూ.2,500 నగదు, రూ.4 వేల పింఛను, స్కూటీలు ఇప్పటివరకు ఇయ్యలేదు.రూ.4 వేలు కాదు కదా రూ.400 కూడా ఇయ్యడు. రూ.2,500 కాదు ఉన్న రూ.500 ఇస్తే అదే గొప్ప. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అడ్రస్ లేకుండా పోయింది. ఫార్మాసిటీ లేకుండా పోయింది.. ఒప్పందం చేసుకున్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి.. కొత్తవి రావడం లేదు. పేగులు మెడకు వేసుకుంటా అంటున్నాడు.. ఆయనేమన్నా బోటి కొట్టేటోడా? కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది. సిరిసిల్ల రోడ్డుపై రాజేందర్రావు నిల్చుంటే.. బస్సు కోసం చూస్తుండని భావిస్తారే కానీ కాంగ్రెస్ అభ్యర్థి అని గుర్తుపట్టరు..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మోదీకి ఎందుకు ఓటెయ్యాలి?‘మోదీ పచ్చి మోసగాడు. న.మో అంటే న మ్మించి మోసం చేసేవాడని అర్థం. ఐటీఐ ఆర్, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకర ణకు నిధులు అడిగితే ఇప్పటివరకు ఇయ్యని మోదీకి ఎందుకు ఓటు వేయాలి? జన్ధన్ ఖాతాలు తెరవండి ధనాధన్ 15 లక్షలు వేస్తా, బుల్లెట్ రైళ్ళు..ఇలా పదేళ్ళ కాలంలో ఎన్నో చెప్పారు. కానీ బడే భాయ్ మోదీ మ నకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. గు డి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణ మైతే కేసీఆర్ యాదాద్రి కట్టలేదా? హైదరా బాద్ నగరంలో అన్ని మతాలు, కులాల వారూ ఉంటారు. ముస్లింలను తిట్టడమే లక్ష్యంగా మోదీ పెట్టుకున్నారు. పదేళ్ళు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి చేయాల్సిన పని ఇదా?. దేవుడిని మొక్కండి.. బీజేపీని తొక్కండి..’ అంటూ మాజీమంత్రి ధ్వజమెత్తారు.గ్రేటర్ ప్రజలు కేసీఆర్నే కోరుకున్నారు‘హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 36 ఫ్లైఓవర్లు నిర్మించాం. అత్యధిక ఐటీ కంపెనీలు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే గాంధీ కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయనకు జోడేదార్గా ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపిస్తే వారిద్దరికీ నేను పూర్తి అండగా ఉంటా. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించారు. బీజేపీకి ఒక్క సీటు ఇచ్చారు. కాంగ్రెస్కు ఒక్కటి కూడా ఇవ్వలేదు. గ్రేటర్ ప్రజలు కేసీఆరే సీఎంగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా తెలంగాణకు కేసీఆరే రక్ష..’ అని కేటీఆర్ చెప్పారు. రోడ్ షోల్లో జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాశ్గౌడ్, పార్టీ సీనియర్ నేత గణేష్గుప్తా పలువురు స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘రైతుబంధు’ వచ్చింది.. పిడికిలి బిగిస్తేనే! : కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని.. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు మండిపడ్డారు. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే.. కాంగ్రెస్ సర్కారుకు దెబ్బకు దెయ్యం వదిలి రైతుల ఖాతాల్లో రైతుబంధు (రైతు భరోసా) డబ్బులు వేసిందని చెప్పారు. ఇక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి హామీలన్నీ అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందేనన్నారు. 12–14 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్లలో కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించి.. నెహ్రూ పార్క్ వద్ద కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేస్తూ వస్తోంది. అరచేతిలో వైకుంఠం చూపుతోంది. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా మళ్లీ రాష్ట్రంలో చేనేతల ఆత్మహత్యలు మొదలయ్యాయి. దేవుళ్ల కాడ ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. అనే పాలసీతో సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారు. అంతకుమించి చేస్తున్నదేమీ లేదు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్, అంబేడ్కర్ ఓవర్సీస్, సీఎంఆర్ఎఫ్, కేసీఆర్ కిట్లు.. వంటివన్నీ ఆగిపోయాయి. కరెంటు సరిగా రావడం లేదు.. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంటలన్నీ ఎండబెట్టింది. గోదావరి నీళ్లను మోదీ వేరే రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్ అడ్డుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్కు అండగా నిలవాలి.. కేసీఆర్ పిడికిలి బిగించి నిలదీయడంతోనే దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేశారు. అయినా రైతుబంధుకు 5 ఎకరాలకే కటాఫ్ పెట్టడం ఏమిటి? 6, 7 ఎకరాలున్న రైతులు బతకొద్దా? ఇక రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేసేలా చేయాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందే. తెలంగాణ శక్తి, తెలంగాణ గళం, తెలంగాణ బలం బీఆర్ఎస్సే. 12–14 సీట్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చేది ఒక్క తెలంగాణలో మా త్రమే. మోదీ పింఛన్లు ఇవ్వలేదు. బీడీ కార్మీకులంతా బీఆర్ఎస్కు అండగా నిలబడాలి. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమేబీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ గొప్పగా చెప్తున్నారు. కానీ 200లోపే సీట్లు వస్తాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రావు. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కుమ్మక్కయ్యాయి. అందుకే పరస్పరం బలహీన అభ్యర్థులను నిలబెట్టుకున్నాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటున్న నరేంద్ర మోదీ... దేశంలో 157 మెడికల్ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఒక్క నవోదయ పాఠశాల సైతం ఇవ్వలేదేం? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ.. ఏం చేశారు? తెలంగాణకు ఏమీ చేయని మోదీకి ఎందుకు ఓటెయ్యాలి? నేను ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన. యావత్ తెలంగాణకు కేసీఆర్ ఆత్మబంధువు. నేను కూడా హిందువునే. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నదే నా అభిమతం. నేను ప్రధాని మోదీని నిలదీసినందుకే.. నా కుమార్తె కవితను జైల్లో పెట్టారు. అయినప్పటికీ లొంగిపోయే ప్రసక్తే లేదు. గులాబీ జెండాను గుండెలో పెట్టుకోవాలి యువత ఆవేశంగా ఓట్లు వేయకుండా ఆలో చించి ఓట్లేసి బీఆర్ఎస్ను గెలిపించాలి. విద్యు త్, రైతుబంధు సరిగా రావాలన్నా.. మన గోదావరి నీళ్లు మనకే దక్కాలన్నా.. పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలన్నా.. బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ప్రజల మంచి కోసం పేగులు తెగేదాకా కొట్లాడతాం. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకోవాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ బీఫాం ఇచ్చిన కేసీఆర్నిజామాబాద్ నాగారం: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్ రెడ్డికి బీఫాంను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం రాత్రి నిజామాబాద్లో అందజేశారు. నగరంలో రోడ్ షో ముగిసిన అనంతరం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా బీఫాం అందజేసిన కేసీఆర్కు రాకేశ్ రెడ్డి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, నాయకులు మహేశ్ బిగాల, రాజారాం యాదవ్ పాల్గొన్నారు.కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులుజగిత్యాల క్రైం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్.. సోమవారం సాయంత్రం జగిత్యాల నుంచి కోరుట్లకు వెళ్తుండగా చల్గల్ గ్రామశివారులో ఎన్నికల అధికారులు ఆయన బస్సును, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ లభించలేదని వారు ప్రకటించారు. -
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో మాజీ సీఎం కేసీఆర్ బస్సును ఆపి ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు. కాగా మరికాసేపట్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేసీఆర్ బస్సు యాత్ర చేరుకోనుంది. నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. మంగళవారం కామారెడ్డి లో పర్యటించనున్నారు. జగిత్యాలలో కేసీఆర్ బస్సును తనిఖీ చేస్తున్న ఎన్నికల అధికారులుఎన్నికల అధికారులకు సహకరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/y19WeT2S7D— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024 -
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు.. మిగిలే ఉంది, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మనమే పూర్తి చేయాలి. నాలుగైదు నెలల్లోనే దుర్మార్గులు రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. రూ.1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరలిపోతోంది. అల్యూమినియం, ప్లాస్టిక్ పరిశ్రమలు కరెంటు కోతలతో అల్లాడుతుంటే మనసుకు దుఃఖం కలుగు తోంది. గతంలో మోదీనే అసూయ పడేలా రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు తీసుకువచ్చాం. నాలుగైదు నెలల్లోనే ఇంత వ్యతిరేకతా? ఇది కొసవరకు ఉండే ప్రభుత్వం కాదు.. దుర్మార్గులు ఆగం చేసిర్రు. ఏ మాత్రం అధైర్య పడొద్దు. రాజకీయాల్లో తాత్కాలిక సెట్బ్యాక్ అనేది సాధారణమే. ఎప్పుడు ఎన్నికలు వచి్చనా వచ్చేది మన ప్రభుత్వమే’’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు(కేసీఆర్) అన్నారు. వీణవంక మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఏమన్నారంటే..? వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది? ‘‘తొమ్మిదేళ్లు నడిచిన కరెంటు ఇప్పుడెందుకు పోతోంది. వీళ్లు కొత్తగా చేయాల్సిందేముంది? ఉన్నది ఉన్నట్లు ఇస్తే చాలు కదా? మంచినీళ్లు ఎట్ల మాయమైనయ్, మళ్లీ బిందెలేసుకుని మహిళలు రోడ్ల మీదకు ఎందుకు వస్తుర్రు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచి ప్రసవాలు పెంచాం. బాలింతలకు కేసీఆర్ కిట్, ఆడశిశువుకు రూ.13వేలు, మగశిశువుకు రూ.12వేలిచ్చి ఇంటికి పంపాం. కానీ, నేడు అవేమీ ఇవ్వడం లేదు.ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఏసీలు పనిచేయకపోవడంతో పసికందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోదీ మన గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తీసుకువెళ్తామని చెప్పినప్పటికీ సీఎం రేవంత్ మౌనంగా ఎందుకుంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో సాగునీరు తాగునీరుకి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి గతంలో రైతులకు అన్యాయం చేసే ఏ విషయం నా దృష్టికి వచి్చనా.. వెంటనే దాన్ని తిప్పికొట్టాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నిలిచిన వారిని గెలిపిస్తే తెలంగాణ కోసం పార్లమెంట్లో దుంకి అందుకొని కొట్లాడుతారు. బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన గతంలో ఎన్నోసార్లు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడారు. నా ప్రచారాన్ని ఆపేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నాయి, అందుకే 48 గంటల ప్రచారాన్ని నిలిపివేసేలా చేశారు.. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.’’అని కేసీఆర్ అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకున్నాం ‘‘బీఆర్ఎస్ హయాంలో రైతు వలసల నిరోధానికి, వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి, వారికి ఎకరానికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించాం. నీటి కొరత తీర్చేందుకు మిషన్ భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, దళితుల ఆత్మగౌరవం కోసం దళితబంధు చేపట్టాం’’అని వివరించిన కేసీఆర్, హుజూరాబాద్లో 99% ధనిక దళితులే ఉన్నారని చెప్పారు.సమైక్యాంధ్రప్రదేశ్లో 53 లక్షల టన్నుల వరి ఉత్పత్తయితే తెలంగాణలో మూడు కోట్ల టన్నులకు మించి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. పంటను దళారీల పాలు చేయకుండా కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకున్నామని వ్యాఖ్యానించారు. రైతులకు ఫ్రీ కరెంట్ కోసం రూ.12,000 కోట్లు, రైతుబంధు కోసం రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.. వరి కొనుగోలుతో రూ.750 కోట్లు నష్టం అయినా పర్వాలేదని 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల వద్ద నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు.ఇంకా రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు‘‘తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పథకాలు నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారు. డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కోతలు అయినప్పటికీ రైతుబంధు ఇవ్వకపోవడం సిగ్గుచేటు’’అని విమర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
తల్లడిల్లుతున్నారు..!
భారత బాక్సర్ల పసిడి పంచ్
పుతిన్ ఐదోసారి ప్రమాణం
బంగ్లాదేశ్దే టి20 సిరీస్
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement