-
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1ని డెడ్లైన్గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్ కీపర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్ జట్టులో బెర్తు కోసం రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లలో కలిపి 195.52 స్ట్రైక్రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టినా.. ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్లలో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా రాణిస్తూ.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్ రాహుల్ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్కప్లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్ పంత్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. -
టీ20 వరల్డ్కప్కు భారత జట్టు ఇదే .. ఆ ముగ్గరు స్టార్ క్రికెటర్లకు నో ఛాన్స్?
టీ20 వరల్డ్కప్-2024లకు అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్1న అమెరికా, కెనడా మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే1లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపికను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ మీటింగ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోనున్నాడు. అయితే సెలక్టర్లు కంటే ముందు చాలా మంది మాజీ ఆటగాళ్లు టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే భారత జట్టును అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు చేరాడు.టీ20 ప్రపంచకప్కు తన 15 మంది ప్రాబబుల్స్ని రాయుడు ఎంచుకున్నాడు. రాయుడు ఎంచుకున్న జట్టులో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. హార్దిక్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్ జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది.అదేవిధంగా ఐపీఎల్లో అదరగొడుతున్న పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్లకు రాయడు తన ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. అయితే అనుహ్యంగా రాయుడు వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్లను కాకుండా దినేష్ కార్తీక్కు చోటు ఇవ్వడం గమనార్హం.దినేష్ కార్తీక్ ఈ ఏడాది సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఫినిషర్గా వచ్చి డీకే అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే రాయుడు కార్తీక్కు అవకాశమిచ్చాడు. అంబటి ఎంచుకున్న జట్టులో టాప్-4లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి,సూర్యకుమార్లకు చోటు దక్కింది. ఆల్రౌండర్ కోటాలో శివమ్ దూబే, రవీంద్ర జడేజాలకు రాయుడు అవకాశమిచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ను రాయుడు ఎంపిక చేశాడు. #IncredibleStarcast expert @RayuduAmbati has picked 15 ambitious players for his #TeamIndia squad ahead of #T20WorldCup2024 & there's only one all-rounder, @imjadeja! 👀Participate in the biggest opinion poll ever on our social media handles (23rd April-1st May) and see if you… pic.twitter.com/1PB3TwATc8— Star Sports (@StarSportsIndia) April 24, 2024 -
ఇంకెవరు.. నీ భార్యనే: కోహ్లి ఆన్సర్తో షాకైన డీకే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి ఆటతోనే కాదు తన చురుకుదనంతో అభిమానులను ఫిదా చేస్తూ ఉంటాడు. క్రీజులో దిగగానే భారీ షాట్లతో విరుచుకుపడగల ఈ రన్ మెషీన్.. మైదానంలో తన చేష్టలతోనూ వినోదం పంచుతూ ఉంటాడు. అదే విధంగా.. సహచర ఆటగాళ్లతోనూ సరదాగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదభరింతగా మారుస్తాడు. తాజాగా ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. తోటి ప్లేయర్ దినేశ్ కార్తిక్ అడిగిన ప్రశ్నలకు కోహ్లి ఊహించని సమాధానమివ్వడమే గాకుండా.. మళ్లీ అతడిని మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐపీఎల్-2024లో మ్యాచ్ల నుంచి విరామం దొరికిన సమయంలో ఆర్సీబీ తమ ఆటగాళ్లతో పలు ఆసక్తికర వీడియోలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో.. ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ హోస్ట్గా వ్యవహరిస్తూ ఉండగా... కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులతో కలిసి కోహ్లి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నాడు. ఇంకెవరు నీ భార్యనే! ఇందులో భాగంగా.. డీకే ముందుగా.. ‘‘క్రికెటర్ కాకుండా నా ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పగలరా?’’ అని అడగ్గా.. కోహ్లి వెంటనే తడుముకోకుండా .. ‘‘నీ భార్య’’ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో క్షణంపాటు ఆశ్చర్యంలో మునిగిన డీకే.. ‘‘అవును.. సరైన సమాధానం.. కానీ నిజానికి నా మనసులో వేరే పేరు అనుకున్నా’’ అన్నాడు. డీకే అలా అనగానే అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో కోహ్లి ఫ్యాన్స్ను ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.. మోసం చేసిన మొదటి భార్య? కాగా దినేశ్ కార్తిక్ భార్య పేరు దీపికా పళ్లికల్. ఆమె స్వ్కాష్ ప్లేయర్. భారత్ తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారు. అయితే, దీపికా కంటే ముందు డీకే నికితా వంజరాను పెళ్లాడాడు. కానీ ఆమె డీకేతో వివాహ బంధంలో ఉండగానే భర్త స్నేహితుడు, టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్తో సాన్నిహిత్యం పెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డీకే ఆమెకు విడాకులివ్వగా.. మురళీ విజయ్ను పెళ్లాడింది. తర్వాత డీకే దీపికాను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కోహ్లి బ్యాటర్గా రాణిస్తున్నా ఆర్సీబీ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి పట్టికలో పదో స్థానంలో ఉంది. అయితే, కోహ్లి మాత్రం 361 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతానికి తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు.. దినేశ్ కార్తిక్ సైతం జట్టు కష్టాల్లో ఉన్నపుడు బ్యాట్ ఝులిపిస్తూనే ఉన్నాడు. అయినా ఫలితం మాత్రం ఉండటం లేదు. Virat Kohli - the legend. 🤣👌 pic.twitter.com/1TMIPxEQT2 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నన్ను నవ్వించగలిగేది అతనే.. అప్పుడు చాలా బాధ పడ్డాను: రోహిత్ శర్మ
క్లబ్ ప్రియారీ ఫైర్ అనే పోడ్కాస్ట్తో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న హిట్మ్యాన్ ఖాళీ సమయంలో క్లబ్ ప్రియారీతో మాట్లాడుతూ.. ధోని, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. నన్ను నవ్వించగలిగేది అతనే.. రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ.. టీమిండియాలో నన్ను ఎవరైనా నవ్వించగలరంటే అది పంత్ మాత్రమే. అతన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటాడు. నాకు నవ్వుకోవాలని అనిపించిన ప్రతిసారి అతనితో మాట్లాడతాను. ఏదో ఒకటి చెప్పి నవ్వించేస్తాడు. వికెట్ల వెనక పంత్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అందరూ పగలబడి నవ్వుతారు. అయితే కారు ప్రమాదం కారణంగా పంత్ అమూల్యమైన కెరీర్ను మిస్ కావడం నన్ను చాలా బాధించింది. ఇప్పటికైనా అతను బెస్ట్ అంటూ హిట్మ్యాన్ కితాబునిచ్చాడు. ధోనిని ఒప్పించడం చాలా కష్టం.. డీకే అయితే ఈజీ టీ20 వరల్డ్కప్ 2024 కోసం చాలా మంది రిటైర్డ్ క్రికెటర్లు (పాకిస్తాన్) తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారనే అంశంపై మాట్లాడుతూ.. రిటైర్మెంట్ వెనక్కు తీసుకోమని ధోనిని ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే అతను బాగా అలసిపోయి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో అతన్ని రిటైర్మెంట్ వెనక్కు తీసుకుని వరల్డ్కప్ ఆడమని అడగలేం. అడిగినా అతను ఒప్పుకోడు. ఇదే విషయంలో దినేశ్ కార్తీక్ను ఒప్పించడమయితే చాలా సులువే అని హిట్మ్యాన్ అన్నాడు. శభాష్ డీకే.. వరల్డ్కప్ ఆడాలని ఉన్నట్లుంది.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోని, దినేశ్ కార్తీక్ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారని రోహిత్ కితాబునిచ్చాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రోహిత్ డీకేను సరదాగా ఆటపట్టించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో కార్తీక్ హిట్టింగ్ చేస్తుండగా రోహిత్ సరదాగా చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. శభాష్ డీకే.. టీ20 వరల్డ్కప్కు సెలెక్ట్ కావాలని అడుతున్నట్లుంది. నీ మైండ్లో కూడా ఇదే నడుస్తున్నట్లుందని రోహిత్ డీకేను ఆటపట్టించాడు. ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది.. ఇదే సందర్భంగా రోహిత్.. ధోని ముంబైతో ఆడిన ఇన్నింగ్స్పై (4 బంతుల్లో 20 నాటౌట్) కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది. నాలుగు బంతులు ఆడి అతను మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతన్ని ఇన్నింగ్స్ తమ ఓటమిని శాశించింది. ధోని చేసిన 20 పరుగులే తమకు వారికి వ్యత్యాసం అంటూ గుర్తు చేసుకున్నాడు. -
T20 WC 2024: ధోని యూఎస్ వస్తాడు: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్కు ఐదుసార్లు టైటిల్ అందించిన హిట్మ్యాన్ ఈసారి మాత్రం కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. ఫ్రాంఛైజీ నిర్ణయం మేరకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆరు మ్యాచ్లు ఆడి 261 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(105*) కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. ఆట నుంచి విరామం దొరికిన సమయంలో రోహిత్ శర్మ క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్కాస్ట్లో భాగంగా మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, ఆడం గిల్ క్రిస్ట్లతో సరదాగా ముచ్చటించాడు. ధనాధన్ ధోని యూఎస్ వస్తాడు ఈ సందర్భంగా ఐపీఎల్-2024లో అదరగొడుతున్న టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఆడేందుకు ఎంఎస్ ధోనిని ఒప్పించడం కష్టం. ఇప్పటికే తను కాస్త అనారోగ్యంతో ఉన్నాడు. బాగా అలసిపోయాడు. అతడు యూఎస్కు రావడమైతే ఖాయం. కానీ అక్కడ గోల్ఫ్ ఆడతాడు. ఇటీవలి కాలంలో ధోని గోల్ఫ్పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు’’ అని రోహిత్ పేర్కొన్నాడు. డీకేను ఒప్పించడం తేలిక ఏదేమైనా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఈ సీఎస్కే స్టార్ నాలుగు బంతుల్లోనే 20 రన్స్ రాబట్టిన తీరు అమోఘమని కొనియాడాడు. ఇక మరో వెటరన్ ప్లేయర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ గురించి ప్రస్తావిస్తూ.. డీకేను వరల్డ్కప్లో ఆడేలా కన్విన్స్ చేయడం చాలా సులువని రోహిత్ సరదాగా కామెంట్ చేశాడు. అదే విధంగా.. యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ గురించి మాట్లాడుతూ.. ‘‘క్రేజీ. అందరు యువ ఆటగాళ్లు ఇలాగే ఉంటారనుకోండి. అందులో పంత్ మరింత క్రేజీ. నేను ఎప్పుడైనా ముభావంగా ఉన్నపుడు నవ్వేలా చేస్తాడు. పంత్ అత్యుత్తమ ప్రదర్శన అతడు పిల్లాడిగా ఉన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నాను. అయితే.. గతేడాది ఆ దుర్ఘటన కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావడం బాధనిపించింది. తను తిరిగిరావడం సంతోషంగా ఉంది. వికెట్ కీపర్గానూ పంత్ అదరగొడుతున్నాడు. గాయాల నుంచి కోలుకుని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వికెట్ కీపర్గా అతడే? కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్కప్-2024 ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే టీమిండియాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్గా పంత్ పేరు ఖరారైందని రోహిత్ శర్మ పరోక్షంగా చెప్పాడంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement