-
భీకర గాలులు–నేలకొరిగిన చెట్లు
పర్లాకిమిడి: అల్పపీడన ద్రోణి ప్రభావంతో పర్లాకిమిడి, కాశీనగర్ సమితిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులతో భారీ వృక్షాలు పలుచోట్ల నేలకొరిగాయి. సోమవారం సాయంత్రం నుండి రాత్రి వరకూ కురిసిన పెనుగాలి వర్షానికి డోలాట్యాంకు రోడ్డులో దండుమాలవీధి చర్చి వద్ద రెండు చెట్లు విరిగిపడ్డాయి. కాశీనగర్ సమితి సిద్ధమణుగు గ్రామంలో పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో పర్లాకిమిడి, గుణుపురం, రాయగడ, కోరాపుట్కు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చెట్లను జిల్లా ప్రకృతి వైపరీత్యాల నివారణ సిబ్బంది తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. పెనుగాలులకు పర్లాకిమిడిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి
పర్లాకిమిడి: ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాలు, మైకుల కోసం అధికారుల నుంచి విధిగా అనుమతి తీసుకోవాలని గంజాం, గజపతి జిల్లాల ఎన్నికల ఖర్చు పరిశీలకుడు చంద్రికా గార్గ్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో పర్లాకిమిడి, మోహానా, దిగపోహాండి నియోజికవర్గాల అభ్యర్థులకు చెందిన ఎన్నికల ఖర్చుల రిజిష్టరు, ఖాతాలను మంగళవారం పరిశీలించారు. ఆమెతో పాటు జిల్లా ఎన్నికల అధికారి స్మృతిరంజన్ ప్రధాన్, డీఆర్డీఏ అధికారి గుణనిధి నాయక్, ఇతర ఎన్నికల సిబ్బంది ఈనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకూ జరిగిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సహాయ అధికారి గుణనిధి నాయక్ మాట్లాడుతూ.. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా మైక్ సౌండింగ్ ప్రచారంలో వాడుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాహనాల కోసం విధిగా ఆన్లైన్లో రిజిష్టరు చేసుకొని ఎన్నికల అధికారుల అనుమతి పొందాలన్నారు. వాహనాల ఖర్చుల వివరాలను అభ్యర్థుల తరఫున ఏజెంట్లు విధిగా పొందుపరచాలని సూచించారు. ఎన్నికల పరిశీలకులు చంద్రికా గార్గ్ -
విద్యుత్ ఏఈ, అకౌంట్స్ అధికారి సస్పెన్షన్
అరసవల్లి: లావేరు మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు విద్యుత్ శాఖాధికారులపై ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు కొరఢా ఝలిపించారు. లావేరులో అప్పట్లో ఏఈగా పనిచేసిన తంగుడు వెంకట రమణమూర్తి (ప్రస్తుతం మెళియాపుట్టి ఏఈ), అప్పట్లో శ్రీకాకుళం ఈఆర్వో విభాగంలో ఏఏఓగా పనిచేసిన పి.ప్రభాకరరావు (ప్రస్తుతం విశాఖ కార్పొరేట్ కార్యాలయం ఏఓ) లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సీఎండీ పృథ్వీతేజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2022–23లో లావేరు మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో పలు అక్రమాలకు పాల్పడినట్లుగా అందిన ఫిర్యాదుల మేరకు జరిపిన విచారణలో వీరిద్దరి పాత్రను నిర్ధారిస్తూ సస్పెన్షన్ వేటు విధించారు. వ్యవసాయదారులకు చెందిన పాత కనెక్షన్ల పేర్లు మార్చి కొత్తవారికి డబ్బులు తీసుకుని కనెక్షన్లు కేటాయించారనే విషయంలో అప్పట్లో ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కథనాలతో పాటు బాధిత రైతుల లిఖితపూర్వక ఫిర్యాదుల మేరకు చర్యలు చేపట్టారు. ఈ సస్పెన్షన్లను సర్కిల్ ఎస్ఈ ఎన్.కృష్ణమూర్తి ధృవీకరించారు. రణస్థలం మండలంలోనూ విజిలెన్స్.. లావేరులో అక్రమాలపై చర్యలు చేపట్టిన క్రమంలో రణస్థలం నుంచి కూడా సీఎండీ కార్యాలయానికి పలు ఫిర్యాదులు చేరినట్లు సమాచారం. ఇక్కడ కూడా పలువురి వ్యవసాయ కనెక్షన్ల మంజూరుకు రూ.వేలల్లో లంచాలు వసూలు చేస్తున్నట్లుగా, స్థానిక స్టోర్స్లో ఉన్న విలువైన విద్యుత్ కేబుళ్లు, ఏబీ స్విచ్లు, ఇతర సామగ్రిని చోరీ చేయిస్తూ ఓ అధికారే తన మనుషులతో బయట వ్యాపారులకు విక్రయిస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. దీనిపై విజిలెన్స్ అఽధికారులతో పాటు శాఖాపరంగా కూడా ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
కాంగ్రెస్లోకి బీజేపీ నాయకుడు దాస్ భొత్ర
జయపురం: బొరిగుమ్మ సమితి మాజీ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత దాస్ భొత్ర మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొరిగుమ్మలో గల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దాస్ భొత్రను జయపురం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తారాప్రసాద్ బాహిణీపతి సాదరంగా ఆహ్వానించారు. భొత్రకు నువాగుడ, పాతబొరిగుమ్మ, జిలిమిలి, ఖుడిగుడ తదితర గ్రామాల్లో మంచి పేరున్న నాయకుడని, అతడి వెంట వందలాది మంది కార్యకర్తలు ఉన్నారని, అతడి పట్ల భొత్ర సంప్రదాయ ప్రజలకు ఆదరణ ఉందని, కాంగ్రెస్లో కలవటం వల్ల తమ పార్టీకి మేలు కలుగుతుందని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేంద్ర బాహిణీపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను బీజేపీలో ఉంటూ బొరిగుమ్మలో ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశానని, కొంత కాలంగా బీజేపీ తనను విస్మరించిందని దాస్ ఆరోపించారు. ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి బొరిగుమ్మ సమితిలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు, సారా ప్రవాహాన్ని అరికట్టేందుకు చేపట్టి ఉద్యమాలకు, సమితి అభివృద్ధికి చేసిన కృషి తనను ఆకర్షించడంతో కాంగ్రెస్లో చేరినట్లు వెల్లడించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మళ్లీ బీజేడీదే అధికారం
● మంత్రి అతాన్ సవ్యసాచి నాయక్ రాయగడ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈసారి కూడా రాష్ట్రంలో బీజేడీ పార్టీ అధికారంలోకి రానుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, రాయగడ జిల్లా ఎన్నికల పరిశీలకులు అతాన్ సవ్యసాచి నాయక్ జోష్యం చెప్పారు. స్థానిక బీజేడీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిచోటా ప్రజాదారణతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా రాయగడ జిల్లాలో గల గుణుపూర్, రాయగడ, బిసంకటక్ శాసనసభలతోపాటు కొరాపుట్ లోక్సభ స్థానాల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు మెచ్చిన పథకాలు . ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చినవి కావడంతో బీజేడీ పాలనపై నమ్మకం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులతో పాటు వారికి సుస్థిర పాలనను అందించే ఏకై క పార్టీగా బీజేడీ ఆవిర్భవించిందన్నారు. సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి నాంది పలుకుతున్నాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి అమలు చేసిన మిషన్ శక్తి, స్వయం సహాయక బృందాలు, మమత తదితర పథకాలు విజయవంతం కావడంతో బీజేడీకి ఆదరణ పెరిగిందన్నారు. దానికి అనుగుణంగా వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తుండటం పార్టీ అభివృద్ధికి మరో మైలు రాయిగా నిలిచిందన్నారు. విభేదాలు లేవు.. పార్టీలో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జిల్లాలో నెక్కంటి భాస్కరరావు, కృష్ణ మహాపాత్రో వంటి సీనియర్ నాయకులు పార్టీ విజయానికి నిరంతరం పని చేస్తున్నారన్నారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఈ సమావేశంలొ రాయగడ శాసనసభ నియోజకవర్గం నుంచి పొటీ చేస్తున్న అనసూయా మాఝి, బీజేడీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జగదీష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. .
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement