ఒకే వేదికపై కలుసుకోనున్న మన్మోహన్, మోడీ | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై కలుసుకోనున్న మన్మోహన్, మోడీ

Published Tue, Oct 29 2013 10:37 AM

ఒకే వేదికపై కలుసుకోనున్న మన్మోహన్, మోడీ - Sakshi

అహ్మదాబాద్ : బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నేడు ఒకే వేదికపై కలుసుకోనున్నారు. అహ్మదాబాద్‌లో వీరిద్దరూ సర్దార్‌ పటేల్‌ మ్యూజియంను ప్రారంభించనున్నారు. మోడీ బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబడ్డాక ప్రధానితో కలిసి వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. పాట్నా పేలుళ్ళ నేపధ్యంలో భద్రతా లోపంపై ప్రతిపక్షాలు మండిపడుతోన్న తరుణంలో జరుగుతోన్న ఈ ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement
Advertisement