- సీఎం కేసీఆర్కు దిగ్విజయ్ సూటి ప్రశ్న
- ఆత్మహత్యల నివారణలో టీఆర్ఎస్ వైఫల్యం
- మతం తప్ప బీజేపీకి అభివృద్ధి పట్టడం లేదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలేంటి, ఇప్పుడు ఆచరణలో చేస్తున్నదేంటి అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల్లో భరోసా కల్పించి, ఆత్మహత్యలను అరికట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. దిగ్విజయ్ మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, అనిల్కుమార్ గౌడ్తో కలసి గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ విధానంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని, రైతులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణలో నిజాం నియంతృత్వ పాలనను తిరిగి తెస్తున్నారని దుయ్యబట్టారు. వరంగల్ జిల్లాలో శ్రుతిని అమానవీయంగా ఎన్కౌంటర్ పేరిట, చిత్రహింసలు పెట్టి కాల్చిచంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లిం యువకులను కూడా కాల్చిచంపారని, ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని దిగ్విజయ్ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫమైందన్నారు. మతం పేరిట, గోమాంసం పేరిట ఆర్ఎస్ఎస్, శివసేన ఆగడాలు మితిమీరిపోయాయని, అయినా ప్రధాని మోదీ ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తెప్పిస్తానని, ప్రతీ వారికి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఇచ్చిన హామీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మతం పేరిట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. మతం తప్ప బీజేపీకి అభివృద్ధి పట్టడం లేదని ధ్వజమెత్తారు.
హోదా గురించి మోదీని ఎందుకు అడగరు?
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా గురించి ప్రధానమంత్రి మోదీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అడగడం లేదని దిగ్విజయ్సింగ్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నోరెందుకు విప్పడం లేదన్నారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన కోసం వస్తున్న మోదీ విభజన బిల్లులోని హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కూడా మోదీ లాగానే హామీలు ఇచ్చి అమలుచేయకుండా మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా దిగ్విజయ్ చెప్పారు.
చెప్పిందేంటి? చేస్తున్నదేంటి?
Published Wed, Oct 21 2015 3:57 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
What’s your opinion
Advertisement