పడవ మునక: 66 మంది విదేశీయులు గల్లంతు | Sakshi
Sakshi News home page

పడవ మునక: 66 మంది విదేశీయులు గల్లంతు

Published Wed, Jun 18 2014 8:50 AM

పడవ మునక: 66 మంది విదేశీయులు గల్లంతు

మలేషియా పశ్చిమ తీరంలో  97 మంది విదేశీ పర్యాటకులతో వెళ్తున్నపడవ గత అర్థరాత్రి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో 66 మంది గల్లంతయ్యారు. మరో 31 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. మలేషియా పశ్చిమ తీరంలోని సన్నాగాయి ఎయిర్ హితమ్ సమీపంలో ఆ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించింది.

 

పడవ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించింది. సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు తీవ్రం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement
Advertisement