ఆదిలాబాద్ : జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో భానుడు చెలరేగిపోయాడు. దాదాపు 46 డిగ్రీల సెంటిగ్రేడ్కుపైగా ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. ఎండలకు వేడిగాలులకు తోడవడంతో ప్రజలు కొందరు మృత్యువాత పడ్డారు. గతేడాది 40 మందికిపైగా మృతిచెందితే.. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 50 మందికిపైగా మరణించారు. మృతిచెందిన వారిలో అత్యధికంగా నిరుపేదలైన ఉపాధి కూలీలే ఉండటం గమనార్హం. వాస్తవానికి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించకుండానే నివేదికలు తయారుచేసి అధికారులకు పంపించారు. ఈ నివేదికల్లో ఈ ఏడాది ఇప్పటివరకు ముగ్గురే మృతిచెందినట్లు పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది.
గతేడాది 40 మంది..
జిల్లాలో వడదెబ్బ కారణంగా గతేడాది ఏప్రిల్, మే, జూన్లలో 40 మంది మృతి చెందారు. ఇందులో 39 మందికి ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల చొప్పున వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఏడాది 50 మందికిపైగా వడదెబ్బతో మృతి చెందారు. సాధారణంగా ఇలా మృతి చెందినప్పుడు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఒకవేళ మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే ఎఫ్ఐఆర్ కాపీ వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. అందులో తహశీల్దార్, సంబంధిత పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, మెడికల్ అధికారి ఇందులో సభ్యులు ఉంటారు. వారు వ్యక్తి మృతికి సంబంధించి విచారణ చేపట్టి నివేదికను అందజేస్తారు.
ఒకవేళ ఆ వ్యక్తి వడదెబ్బ కారణంగానే మృతి చెందాడని నిర్దారణ అయిన పక్షంలో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆపద్బంధు వర్తిస్తుంది. సహజంగా బాధితులు ఆపద్బంధు పథకం కోసం తహశీల్దార్కు ఎఫ్ఐఆర్ కాపీతో దరఖాస్తు చేసుకోవాలి. తహశీల్దార్ నుంచి వచ్చే వివరాల ఆధారంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పథకం విభాగంలో లబ్ధిదారులను గుర్తిస్తారు. ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. దాని ఆధారంగా వచ్చే సహాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. జిల్లాలో పలువురు ఉపా ధి హామీ కూలీలు, ఇతర కష్టజీవులు వడదెబ్బతో మృ తి చెందారు. అయితే వారి వివరాలు పంపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పలువురు బాధితులకు ఆపద్బంధు పథకం కింద ఈ ఆర్థిక సాయం లభిస్తుందనే అవగాహన లేకపోవడం కూడా దీనికి కారణమవుతుంది. పేద కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద వచ్చే రూ. 50 వేలు ఎంతో ఆసరాను ఇస్తాయి. అధికారులు మిగతా వారిని గుర్తించి ఆపద్బంధు కింద ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
వడదెబ్బ మృతులు వీరేనట..
పేరు ఊరు మండలం
ఉర్వేత రాము లక్ష్మీపూర్ కడెం
జంగుల గంగారాం గిర్నూర్ బజార్హత్నూర్
కంకణాల మాధవరెడ్డి కోనంపేట నెన్నెల
వడదెబ్బ మృతులు ముగ్గురేనట!
Published Sat, Jun 14 2014 3:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement