‘తప్పు జరిగింది.. క్షమించండి’ | Sakshi
Sakshi News home page

‘తప్పు జరిగింది.. క్షమించండి’

Published Sat, Oct 20 2018 2:44 AM

Maoists letter on student murders in Sukma district - Sakshi

పర్ణశాల (భద్రాద్రి కొత్తగూడెం): విద్యార్థి హత్యపై తప్పు జరిగిందని మావోయిస్టులు క్షపమాపణ కోరారు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ కమిటీ పేరుతో శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా కేంద్రంలోని లైవ్‌వుడ్‌ కళాశాలలో చదువుతున్న కుకనార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుందనపాల్‌ గ్రామానికి చెందిన కుంజం శంకర్‌ను పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు ఈ నెల 7న అపహరించి హత్య చేశారు.

హత్య జరిగిన 12 రోజుల తర్వాత మావోయిస్టులు స్పందించారు. విద్యార్థి హత్య తొందరపాటు నిర్ణయం వల్ల జరిగిందని, ఈ ఘటనకు మావోయిస్టు పార్టీ తరపున క్షమించాలని ప్రజలను కోరుతున్నట్లు అందులో పేర్కొన్నారు. గతంలో మావోయిస్టు పార్టీ విద్యార్థులను చంపిన ఘటనలు లేవని, ఇకపై మరో ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు.

Advertisement
Advertisement