యాదాద్రికి తగ్గిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

యాదాద్రికి తగ్గిన భక్తుల రద్దీ

Published Sun, Oct 18 2015 10:52 PM

devotees croud less to yadadri in nalgonda district

యాదగిరికొండ : నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. బతుకమ్మ సంబరాలు, దసరా పండుగల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రాక తగ్గినట్లు దేవస్థానం అధికారులు ఆదివారం తెలిపారు. సంగీత భవనం, దక్షిణ ప్రాకార మండపం, గర్భాలయం, తదితర ప్రాంతాలు భక్తులు లేక వెలవెలబోయాయి. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల దర్శనం అరగంటలో పూర్తవుతున్నట్లు భక్తులు చెప్పారు.

Advertisement
Advertisement