Sakshi News home page

రేవంత్‌రెడ్డిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Published Tue, Sep 2 2014 2:08 AM

court orders, booked case on revanth reddy

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌ల పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన ప్రైవేటు ఫిర్యాదును నాంపల్లి కోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్... బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. గత నెల 28న రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మెడికల్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచుకునేందుకు వీలుగా వారి నుంచి కేసీఆర్ రూ.100 కోట్లు ముడుపులు తీసుకున్నారంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ కె.గోవర్ధన్‌రెడ్డి ఈ ఫిర్యాదు దాఖలు చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement