సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సుదీర్ఘ కసరత్తు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం శనివారం రాత్రి ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో కసరత్తు చేసిన అనంతరం అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అన్ని కోణాల్లో పరిశీలించిన అభ్యర్థుల జాబితాను రూపొందించింది.
సోనియా ఆమోద ముద్ర పడిన తర్వాత ఈ జాబితాను ప్రకటించారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ నరేష్జాదవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. నరేష్ జాదవ్ పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. ఎస్టీ డిపార్ట్మెంట్ మాజీ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు నరేష్జాదవ్ అభ్యర్థిత్వానికి కలిసొచ్చినట్లయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ పంపిన జాబితాలో మొదట నరేష్జాదవ్ పేరునే ప్రతిపాదించారు.
పెద్దపల్లి నుంచి వివేక్
పెద్దపల్లి(ఎస్సీ) లోక్సభ స్థానం నుంచి జి.వివేక్ పేరును ఖరారు చేసింది. ఆయన టీఆర్ఎస్కు రాజీనామా చేసి, ఇటీవల సొంత గూటికి చేరుకున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గం పరిధిలో జిల్లాలోని చెన్నూరు (ఎస్సీ), బెల్లంపల్లి (ఎస్సీ), మంచిర్యాల అసెంబ్లీ స్థానాలున్నాయి.
నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా
ముందుగా తెలంగాణలోని 110 ఎమ్మెల్యే స్థానాలు, 16 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జిత్వాల ప్రకటించారు. చివరి క్షణంలో ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటన ఆగిపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. టిక్కెట్లు ఆశిస్తున్న జిల్లా ముఖ్యనాయకులు పక్షం రోజులుగా హస్తినాలోనే మకాం వేశారు.
తమ బెర్తులను ఖరారు చేసుకునేందుకు ఏఐసీసీ ముఖ్యనేతల చుట్టూ చక్కర్లు కొట్టారు. ఎలాగైనా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారు. ఆదివారం ప్రాదేశిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రకటన ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో చివరి క్షణంలో జాబితాను నిలిపివేసినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
లోక్సభ అభ్యర్థుల ఖరారు
Published Sun, Apr 6 2014 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement