► సీఎం తరఫున ఢిల్లీలో అవార్డు అందుకున్న పోచారం
► రైతును రాజును చేయాలన్నదే కేసీఆర్ సంకల్పమన్న మంత్రి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు జాతీయస్థాయిలో లభించిన ‘గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్– 2017’ అవార్డును ఆయన తరఫున మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ఆధ్వర్యంలో 10వ గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ సదస్సు ఘనంగా జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా పాలసీ లీడర్షిప్ విభాగంలో కేసీఆర్కు దక్కిన అవార్డును హరియాణా గవర్నర్ కేఎస్ సోలంకి, ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణుడు ఎంఎస్ స్వామినాథన్ల చేతుల మీదుగా అందుకున్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమా నికి కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు, సంస్కరణలను గుర్తించిన ఐసీఎఫ్ఏ 2017కు గాను ఈ అవార్డును బహూకరించింది.
రైతులకు బాసటనిచ్చేలాపథకాలు: పోచారం
రైతును రాజుగా చూడాలన్నదే కేసీఆర్ సంకల్పమని.. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసిందని మంత్రి పోచారం పేర్కొన్నారు. కేసీఆర్ తరఫున అవార్డు అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో వచ్చే సంవత్సరం నుంచి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రైతులకు బాసటగా నిలిచేలా ప్రవేశపెడుతున్న పథకా లే కేసీఆర్ను గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు గ్రహీతగా నిలిపాయని పేర్కొన్నారు. 36 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్కు దక్కిందన్నారు.
రైతును రాజుగా నిలపాల న్నది కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో రైతులకు పారదర్శకంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందనున్నట్లు చెప్పారు. రైతు సమన్వయ సమితులు ప్రతి గ్రామంలో భూ పరిశీలన జరిపి.. ఏ పంట వేయాలో రైతులకు సూచిస్తాయని వెల్లడించారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్ చాంద్, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ వి.జగదీశ్వర్రావు, ఐసీఎఫ్ఏ చైర్మన్ ఎంజే ఖాన్లతో పాటు పలువురు వ్యవసాయరంగ నిపుణులు పాల్గొన్నారు.
కేసీఆర్కు గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు
Published Wed, Sep 6 2017 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement