ఇద్దరు దొంగల అరెస్ట్: రూ.3 లక్షలు సీజ్‌ | Sakshi
Sakshi News home page

ఇద్దరు దొంగల అరెస్ట్: రూ.3 లక్షలు సీజ్‌

Published Tue, Nov 29 2016 1:06 PM

robbers arrested in bhadradri district

పాల్వంచ: ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వెంకటేశ్వర కాలనీలో వీరిద్దరు ఇటీవల చోరీకి పాల్పడ్డారు. వీరిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3 లక్షల విలువ చేసే 5.3 తులాల బంగారం, అర కేజీ వెండి, ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
Advertisement