49వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

49వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published Sun, Dec 31 2017 7:33 PM

ys jagan mohan reddy prajasankalpayatra completes 48th day - Sakshi

సాక్షి, చిత్తూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం 49వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ముదివేడు నుంచి ప్రారంభమవుతుంది. సోమవారం ఉదయం ముదివేడు నుంచి నడక ప్రారంభించి.. కడప క్రాస్‌రోడ్డు‌, నడింపల్లి, ఆర్‌సీ కురవపల్లి, గడ్డెత్తుపల్లి, నల్లగుట్టపల్లి, కాయలపల్లి, అడ్డగింతవారిపల్లి, చిలకవారిపల్లి, రేగంటివారిపల్లి, సీటీఎం క్రాస్‌ రోడ్స్ మీదగా సీటీఎం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

48వ రోజు ముగిసిన పాదయాత్ర..!
48వరోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ముగిసింది. ఆదివారం వైఎస్‌ జగన్‌ 14.5 కిలోమీటర్ల మేర నడిచారు. ములపల్లి క్రాస్‌ వద్ద పాదయాత్ర ప్రారంభించి.. అక్కడి నుంచి ఎర్రసానిపల్లె, ఎద్దులవారిపల్లి, కన్నెమడుగు, రేణుమకుల పల్లె క్రాస్‌, తిమ్మయ్యవారి పల్లె, దాదంవారిపల్లి, తుపల్లి క్రాస్‌, ముదివేడు వరకు నడిచారు. దారిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారితో మమేకమవుతూ.. మన ప్రభుత్వం వస్తుందన్న భరోసా కల్పిస్తూ ముందుకుసాగారు. ఆదివారం సాయంత్రం ముదివేడు వద్ద వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ముగిసింది.

Advertisement
Advertisement