గిరిజనుల వివాదాన్ని పరిష్కరించాలి: సీపీఎం | Sakshi
Sakshi News home page

గిరిజనుల వివాదాన్ని పరిష్కరించాలి: సీపీఎం

Published Sat, Oct 14 2017 2:07 AM

Tribal dispute to be resolved: CPM - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుమురం భీం జిల్లా స్మారక మ్యూజియంలో గిరిజన తెగల మధ్య వచ్చిన తగాదాని సామరస్యంగా పరిష్కరించకుండా.. ప్రభుత్వం ఆ ఘర్షణని పెంచేవిధంగా వ్యవహరించిందని సీపీఎం విమర్శించింది.

ఆదివాసీల మీద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యంత సున్నితమైన విషయం పట్ల ప్రభుత్వం, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం కావడంతో తెగల మధ్య తగాదా ముదిరిందని తమ్మినేని అభిప్రాయపడ్డారు.  

Advertisement
Advertisement